Just In
- 12 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 13 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 15 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 18 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- Movies Karthika Deepam 2 నా బిడ్డకు దూరంగా ఉండు.. కార్తీక్కు దీప షాక్
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఈ చైనా ఎస్యూవీని తెగ కొనేస్తున్నారు, ఇప్పటికే 50,000 లకు పైగా బుకింగ్స్
చైనాకు చెందిన ప్రముఖ కార్ బ్రాండ్ ఎమ్జి మోటార్స్ గత ఏడాది భారత మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త ఎమ్జి హెక్టర్ ఎస్యూవీ అతి తక్కువ సమయంలోనే మంచి ప్రజాదరణను సొంతం చేసుకుంది. అద్భుతమైన ఫీచర్లు, ఆకర్షనీయమైన ధరతో వచ్చిన ఎమ్జ్ హెక్టర్ ఎస్యూవీని కస్టమర్లు ఇప్పుడు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ మోడల్కు 50,000 యూనిట్లకు పైగా బుకింగ్లు వచ్చినట్లు కంపెనీ ప్రకటించింది.
ఎమ్జి మోటార్స్ తమ హెక్టర్ ఎస్యూవీని హలోల్లోని తమ ప్లాంట్లో అసెంబ్లింగ్ చేస్తోంది. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా, ఇటీవల ప్రకటించిన లాక్డౌన్ నేపథ్యం, ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితి వలన ఎమ్జి హెక్టర్ ఉత్పత్తిలో జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో ఎమ్జి హెక్టర్ ఎస్యూవీ మోడల్కు వెయింటింగ్ పీరియడ్ భారీగా పెరిగిపోయింది.
ఎమ్జి హెక్టర్ భారత మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 50,000 యూనిట్లకు పైగా బుకింగ్లు రాగా ఇప్పటి వరకూ 20,000 లకు పైగా యూనిట్లను కంపెనీ తమ కస్టమర్లకు డెలివరీ చేసింది. అంటే సుమారు 30,000 మందికి పైగా కస్టమర్లు ఇంకా ఈ మోడల్ డెలివరీల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా సప్లయ్ చేసేందుకు హలోల్ ప్లాంట్లో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు కంపెనీ కృషి చేస్తోంది.
MOST READ: 2W ఎక్సేంజ్ ప్రోగ్రామ్ కోసం క్రెడ్ఆర్తో చేతులు కలిపిన ఏథర్ ఎనర్జీ
ఈ ఏడాది ఆరంభంలో ఎమ్జి మోటార్స్ తమ హెక్టర్ ఎస్యూవీలో బిఎస్6 పెట్రోల్ వెర్షన్ మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో దీని బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ.12.77 లక్షలుగా ఉండే, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.17.44 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)గా ఉంది. అప్డేట్ చేసిన బిఎస్6 పెట్రోల్ వేరియంట్ను విడుదల చేసిన కొద్ది రోజులకే కంపెనీ బిఎస్6 డీజిల్ వేరియంట్ను కూడా విడుదల చేసింది.
బిఎస్6 ఎమ్జి హెక్టర్ డీజిల్ వేరియంట్ ధరలు వేరియంట్ను బట్టి రూ .13.88 లక్షల నుంచి రూ .17.77 లక్షల (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.
MOST READ: ఆంపియర్ మాగ్నస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ఫస్ట్ రైడ్ రివ్యూ.. దీనినే ఎందుకు కొనాలంటే ?
ఇందులోని ఇంజన్ వివరాలను గమనిస్తే, ఎమ్జి హెక్టర్లోని బిఎస్6 పెట్రోల్ ఇంజన్ 1.5-లీటర్ టర్బో యూనిట్ను కలిగి ఉంటుంది. ఇది గరిష్టంగా 143bhp శక్తిని మరియు 250Nm గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పెట్రోల్ ఇంజిన్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ లేదా సెవెన్-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో లభిస్తుంది.
ఇకపోతే, ఇందులో బిఎస్6 డీజిల్ వేరియంట్ను గమనిస్తే, ఇందులో 2.0 లీటర్ ఫియట్-సోర్స్డ్ డీజిల్ ఇంజిన్ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 168.4bhp శక్తిని మరియు 350Nm గరిష్ట టార్క్ని (బిఎస్ 4 మోటారు మాదిరిగానే ఉంటుంది) ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో మాత్రమే లభ్యమవుతోంది.
MOST READ: సోషల్ డిస్టెన్సింగ్ ఎఫెక్ట్: ఇన్-యాప్ టిప్పింగ్ ఫీచర్ను పరిచయం చేసిన ఓలా క్యాబ్స్
ఎమ్జి హెక్టర్ ఎస్యూవీ 50,000 యూనిట్ల బుకింగ్లను రిసీవ్ చేసుకోవటంపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
అత్యంత సరసమైన ధరతో సెగ్మెంట్లో కెల్లా అధునాతనమై ఫీచర్లతో ఎమ్జి హెక్టర్ మార్కెట్లో విడుదలైంది. ఈ ఫుల్లీ ఫీచర్డ్ కారు కొనుగోలుదారులను మొదటి చూపులోనే ఆకట్టుకుంటోంది. ఎమ్జి హెక్టర్ మిడ్-సైజ్ ఎస్యూవీ ఈ సెగ్మెంట్లోని కియా సెల్టోస్, టాటా హారియర్, జీప్ కంపాస్ మరియు హ్యుందాయ్ క్రెటా వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తోంది.