Just In
- 16 min ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- 2 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- 16 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 18 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
Don't Miss
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- News AP Elections: నా కాళ్లు పట్టుకున్నావా లేదా ? పెద్దిరెడ్డికి కిరణ్ ఘాటు కౌంటర్.. !
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Movies సుడిగాలి సుధీర్ అమ్మాయిల పిచ్చోడా? జబర్దస్త్ కమెడియన్ ఘాటుగా రియాక్షన్!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కోవిడ్ - 19 నిబంధనలు ఉల్లంఘించినందుకు నోయిడాలో ఏంజరిగిందో తెలుసా ?
కరోనా వైరస్ వల్ల భారతదేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే, దాదాపు రెండు నెలల లాక్ డౌన్ తరువాత ఇప్పుడు భారత ప్రభుత్వం కొన్ని నియమాలతో లాక్ డౌన్ సడలించడం జరిగింది. లాక్ డౌన్ సడలించడం వల్ల ప్రజలు ఎక్కువ సంఖ్యలో బయటికి వస్తున్నారు. ప్రజలు కనీస సామాజిక దూర నిబంధనలను కూడా పాటించడం లేదు. ఈ నేపథ్యంలో మరికొన్ని నిబంధనలు వెల్లడించడం జరిగింది.
కరోనా అధికంగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రభుత్వం విధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు నోయిడా మరియు గ్రేటర్ నోయిడా అంతటా 1,200 కు పైగా వాహన యజమానులకు ఇటీవల జరిమానా విధించడం జరిగింది. అంతే కాకుండా 24 గంటల వ్యవధిలో ఇదే విధమైన ఉల్లంఘనకు మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
గౌతమ్ బుద్ధ నగర్లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్పిసి) సెక్షన్ 144 అమల్లో ఉంది, కోవిడ్ -19 కోసం 'రెడ్ జోన్'లో పట్టణ ప్రాంతాలు కూడా వస్తాయి. జిల్లాలోని 200 బారియర్ పాయింట్లలో మొత్తం 2,185 వాహనాలను తనిఖీ చేయగా, వాటిలో 1,236 నిబంధనల ఉల్లంఘన కారణంగా చలాన్లు జారీ చేయబడ్డాయి. పోలీసులు కూడా దాదాపు రూ. 1,89,400 జరిమానా వసూలు చేశారు.
MOST READ:బజాజ్ కంపెనీ జూన్ అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా !
ఇటీవలి ఇతర ఆటో సంబంధిత వార్తల ప్రకారం, హోండా కార్స్ ఇండియా ఇటీవలే భారతదేశంలో న్యూ హోండా డబ్ల్యూఆర్-వి ని రూ. 8,49,900 ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో విడుదల చేసింది.
న్యూ హోండా డబ్ల్యుఆర్-వి లో కొత్త సాలిడ్ వింగ్ క్రోమ్ లౌవర్ స్టైల్ గ్రిల్, ఇంటిగ్రేటెడ్ డిఆర్ఎల్లు మరియు పొజిషన్ లాంప్స్తో అధునాతన ఎల్ఇడి ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్లు, అడ్వాన్స్డ్ ఎల్ఇడి ఫాగ్ లాంప్స్ మరియు అడ్వాన్స్డ్ ఎల్ఇడి ఫాగ్ లాంప్స్ మరియు అడ్వాన్స్డ్ ఎల్ఇడి రియర్ కాంబినేషన్ లాంప్స్ వంటివి ఇందులో ఉన్నాయి.
ఈ కారు డిజిపాడ్ 2.0 ను కలిగి ఉంది. ఇది అధునాతన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇది సీమ్ లెస్ మరియు స్మార్ట్ కనెక్టివిటీని కలిగి ఉంటుంది. ఇది 7 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో ద్వారా స్మార్ట్ఫోన్ కనెక్టివిటీని అందిస్తుంది. ఇందులో టర్న్-బై-టర్న్ నావిగేషన్, లైవ్ ట్రాఫిక్ సపోర్ట్, వాయిస్ కమాండ్స్, బ్లూటూత్ కనెక్టివిటీ మరియు వైర్లెస్ ఇన్ఫ్రారెడ్ రిమోట్ వంటి అధునాతన ఫీచర్స్ ఉంటాయి.
MOST READ:2W ఎక్సేంజ్ ప్రోగ్రామ్ కోసం క్రెడ్ఆర్తో చేతులు కలిపిన ఏథర్ ఎనర్జీ
హోండా డబ్ల్యుఆర్-వి పెట్రోల్ మోడళ్లలో బిఎస్ 6 కంప్లైంట్ 1.2-లీటర్ ఐ-విటిఇసి ఇంజన్ ఉంది. ఇది 90 బిహెచ్పి శక్తిని మరియు 110 ఎన్ఎమ్ పీక్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ ఐదు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్కు జతచేయబడుతుంది.
డీజిల్ మోడళ్లలో అయితే బిఎస్ 6 కంప్లైంట్ 1.5-లీటర్ ఐ-డిటిఇసి ఇంజన్ ఉంది. ఇది 100 బిహెచ్పి పవర్ మరియు 200 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ ఆరు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడుతుంది.
MOST READ:పోర్షే ఇండియా డైరెక్టర్ రాజీనామా; తదుపరి డైరెక్టర్ ఎవరు?
డ్రైవ్స్పార్క్ అభిప్రాయం :
కరోనా మహమ్మారి వల్ల దాదాపు 2 నెలలు లాక్ డౌన్ విధించబడింది. ఈ సమయంలో దేశ ఆర్ధిక వ్యవస్థ బాగా తగ్గిపోయింది. దేశ ఆర్ధిక వ్యవసాయాను ముందుకు తీసుకువెళ్ళడానికి కొన్ని నియమాలతో లాక్ డౌన్ సడలించింది. కానీ కరోనా సంక్షోభం నుండి సురక్షితంగా ఉండటానికి తప్పనిసరిగా అనుసరించాల్సిన కొన్ని నియమ నిబంధనలను తెలిపింది. ప్రజలు వీలైనంత వరకు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించకుండా ఉండటం మంచిది.