Just In
- 1 hr ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 1 hr ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 3 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 4 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- News సీఎం జగన్ కొత్త ఎన్నికల నినాదం..డబుల్ సెంచరీ ప్రభుత్వం అంటూ
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బ్రేకింగ్ న్యూస్.. త్వరలో పెరగనున్న మహీంద్రా థార్ ధర : వివరాలు
దేశీయ మార్కెట్లో మహీంద్రా కొత్త థార్ ఎస్యూవీని అక్టోబర్లో ప్రారంభించింది, అంతే కాకుండా దాని డెలివరీ నవంబర్ నుండి ప్రారంభమయ్యాయి. ప్రారంభించిన రెండు నెలల తరువాత, కంపెనీ దాని ధరను పెంచనున్నట్లు తెలిసింది. ధరల పెరుగుదలకు సంబంధించిన అధికారిక సమాచారం కంపెనీ ఇవ్వలేదు, కానీ మా వర్గాల సమాచారం ప్రకారం, కొత్త థార్ ధర డిసెంబర్ 2 నుండి రూ. 40,000 వరకు పెరిగే అవకాశం ఉంది.
కొత్త థార్ ఎస్యూవీకు ఇప్పటివరకు 20 వేలకు పైగా బుకింగ్లు వచ్చాయి. మహీంద్రా థార్ యొక్క బుకింగ్స్ భారీగా జరుగుతున్నాయి, దీని కారణంగా దాని వెయిటింగ్ పీరియడ్ 9 నెలలు పెరిగింది మరియు దీనికి సంబంధించిన సమాచారం మహీంద్రా సిఇఒ పవన్ గోయెంకా తెలిపారు. థార్ ఎస్యూవీని బుక్ చేసుకున్న వినియోగదారులు ఈ విషయాన్నీ ఒక సమస్యగా సోషల్ మీడియాలో లేవనెత్తుతున్నారు.
అదే సమయంలో, థార్ యొక్క బేస్ వేరియంట్ AX యొక్క తక్కువ బుకింగ్ కారణంగా, దాని బుకింగ్ నిలిపివేయబడింది. 2020 మహీంద్రా థార్ భద్రత మరియు సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని చాలా ఫీచర్లు మరియు పరికరాలతో పాటు కొత్త ప్లాట్ఫాంపై నిర్మించబడింది.
MOST READ:2020 డిసెంబర్లో లాంచ్ కానున్న కొత్త కార్లు : వివరాలు
ఇటీవల గ్లోబల్ ఎన్సిఎపి క్రాష్ పరీక్షలో కొత్త థార్కు 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ కూడా కైవసం చేసుకుంది. గ్లోబల్ ఎన్సిఎపి నిర్వహించిన పరీక్షల్లో వయోజన మరియు పిల్లల భద్రత కోసం థార్కు 4 స్టార్ రేటింగ్ లభించింది. దీనితో, కంపెనీ ఎక్స్యూవీ 300 తర్వాత క్రాష్ టెస్ట్లో ఉత్తీర్ణత సాధించిన రెండవ మోడల్ గా నిలిచింది.
2020 థార్ ఎస్యూవీలో డ్యూయల్ ఎయిర్బ్యాగులు, ఎబిఎస్, రియర్ పార్కింగ్ అసిస్ట్ వంటివి ఇందులో స్టాండర్డ్ గా ఇవ్వబడ్డాయి. థార్ కోసం పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి, జనవరి నుండి నెలకు 3,000 కు పైగా థార్స్ ఉత్పత్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది.
MOST READ:అద్భుతంగా ఉన్న ఎంజి గ్లోస్టర్ ఆఫ్-రోడ్ క్యాపబిలిటీస్.. చూసారా ?
కొత్త థార్ ప్రారంభ ధర రూ. 9.80 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, టాప్ వేరియంట్ ధర 13.75 లక్షల రూపాయలు (ఎక్స్-షోరూమ్). కొత్త మహీంద్రా థార్ మూడు రూప్ టాప్ వేరియంట్లలో విడుదల చేయబడింది, వీటిలో సాఫ్ట్ టాప్, కన్వర్టిబుల్ టాప్ మరియు హార్డ్ టాప్ / ఫిక్స్డ్ టాప్ వున్నాయి.
మహీంద్రా థార్లో 2.0 లీటర్ పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజన్లతో సహా కొత్త పెట్రోల్, డీజిల్ ఇంజన్లు ఉపయోగించబడ్డాయి. పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ ఇవ్వగా, డీజిల్ ఇంజన్ 130 బిహెచ్పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. ఇది కొత్త 6-స్పీడ్ మాన్యువల్ మరియు టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్ కలిగి ఉంది.
MOST READ:టాటా మోటార్స్ కొత్త స్టైల్లో పరిచయం చేసిన సేఫ్టీ బబుల్ ; ఎందుకో తెలుసా !