Just In
- 30 min ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 3 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- 3 hrs ago టోల్గేట్ల వద్ద ఇకపై ఈ బోర్డులు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- 4 hrs ago ట్రయంఫ్ టైగర్ 900 బైకులు మరింత కొత్తగా వచ్చేశాయ్!.. ధర ఎంతో తెలుసా?
Don't Miss
- Sports CSK Playing XI: స్టార్ ప్లేయర్పై వేటు.. LSGతో ఆడే తుదిజట్టు ఇదే
- Technology వన్ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
- News ఆ నలుగురిపై టీడీపీ గురి - జగన్ సమర్ధతకు సవాల్..!!
- Finance 9 రోజులుగా 54 శాతం పెరిగిన స్టాక్.. బ్రోకరేజ్ తాజా టార్గెట్ ధర ఇదే.. మీరూ కొంటున్నారా..??
- Lifestyle Gruha Pravesham Wishes in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Movies Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్ను భయపెడుతున్న రాజమౌళి.. దేవరను వెంటాడుతున్న ఆ సెంటిమెంట్!
2020 బిఎస్-6 మారుతి వితారా బ్రెజ్జా పెట్రోల్: ధర, ఇతర వివరాలు
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన మారుతి సుజుకి తన బ్రాండ్ నుంచి బిఎస్-6 మారుతి వితారా బ్రెజ్జా పెట్రోల్ ని ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. కొత్తగా వచ్చిన బిఎస్-6 మారుతి బ్రెజ్జా గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!
మారుతి సుజుకి 2020 వితారా బ్రెజ్జా పెట్రోల్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త మారుతి వితారా బ్రెజ్జా పెట్రోల్ ప్రారంభ ధర రూ. 7.34 లక్షలతో (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వస్తుంది. కొత్త పెట్రోల్-శక్తితో కూడిన వితారా బ్రెజ్జా ఎస్యువి నాలుగు వేరియంట్లలో వస్తుంది. అవి వరుసగా ఎల్ఎక్స్ఐ , విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ మరియు జెడ్ఎక్స్ఐ ప్లస్ లు. వితారా బ్రెజ్జా పెట్రోల్ యొక్క టాప్-స్పెక్ మోడల్ ధర రూ. 11.40 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
ఎల్ఎక్స్ఐ | Rs 7.34 Lakh |
విఎక్స్ఐ | Rs 8.35 Lakh |
విఎక్స్ఐ ఎటి | Rs 9.75 Lakh |
జెడ్ఎక్స్ఐ | Rs 9.10 Lakh |
జెడ్ఎక్స్ఐ ఎటి | Rs 10.50 Lakh |
జెడ్ఎక్స్ఐ ప్లస్ | Rs 9.75 Lakh |
జెడ్ఎక్స్ఐ ప్లస్ ఎటి | Rs 11.15 Lakh |
జెడ్ఎక్స్ఐ ప్లస్ ఎటి డ్యూయల్ టోన్ | Rs 11.40 Lakh |
*అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ
కొత్త మారుతి సుజుకి వితారా బ్రెజ్జా ఇప్పుడు బిఎస్ 6 కంప్లైంట్ పెట్రోల్ ఇంజిన్తో పనిచేస్తుంది. ఈ ఎస్యువి పాత డీజిల్ యూనిట్ స్థానంలో ఉంది. కొత్త పెట్రోల్ ఇంజన్ 1.5-లీటర్ కె-సిరీస్ యూనిట్ రూపంలో వస్తుంది.
మారుతి సుజుకి వితారా బ్రెజ్జా 1.5 లీటర్ యూనిట్ 104 బిహెచ్పి మరియు 138 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ ప్రామాణిక ఐదు స్పీడ్ మాన్యువల్ లేదా నాలుగు-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడుతుంది.
కొత్త పెట్రోల్-శక్తితో కూడిన ఇంజిన్తో పాటు, మారుతి విటారా బ్రెజ్జా కూడా చాలా తక్కువ నవీకరణలతో వస్తుంది. ఇందులో కొత్తగా రూపొందించిన ఎల్ఈడీ హెడ్ల్యాంప్ యూనిట్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్లు ఉన్నాయి. కొత్త విటారా బ్రెజ్జా కొత్త ఫ్రంట్ గ్రిల్ మరియు ఎల్ఈడీ టైల్లైట్స్ మరియు అల్లాయ్ వీల్ డిజైన్తో నవీకరించబడింది. ఇవే కాకుండా నవీనీకరించబడిన ముందు మరియు వెనుక బంపర్ యూనిట్లు కూడా ఉన్నాయి.
కొత్త మారుతి వితారా బ్రెజ్జా పెట్రోల్ మూడు కొత్త డ్యూయల్ టోన్ పెయింట్ పథకాలలో వస్తుంది. అవి సిజ్లింగ్ రెడ్ / మిడ్నైట్ బ్లాక్, గ్రానైట్ గ్రే / ఆటం ఆరెంజ్ మరియు టార్క్ బ్లూ / మిడ్నైట్ బ్లాక్. ఇవి కాకుండా స్టాండర్డ్ సింగిల్-టోన్ పెయింట్ పథకాలలో టార్క్ బ్లూ, గ్రానైట్ గ్రే, సిజ్లింగ్ రెడ్, ఆటం ఆరెంజ్, ప్రీమియం సిల్వర్ మరియు పెర్ల్ ఆర్కిటిక్ వైట్ వంటివి ఉన్నాయి.
కొత్త మారుతి సుజుకి వితారా బ్రెజ్జా లోపల కూడా అనేక నవీకరణలను జరిగాయి. ఇందులో కొత్త లెదర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్విఎంలు మరియు బ్రాండ్ యొక్క సరికొత్త స్మార్ట్ప్లే స్టూడియో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను ప్రామాణికంగా కలిగి ఉన్నాయి.
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
బిఎస్ 6 మారుతి వితారా బ్రెజ్జా పెట్రోల్ ఫేస్ లిఫ్ట్ మొట్టమొదటిసారిగా ఇటీవల ముగిసిన ఆటో ఎక్స్పో 2020 లో ప్రదర్శించబడింది. పెట్రోల్-శక్తితో పనిచేసే వితారా బ్రెజ్జా చాలా కాలం నుండి అభివృద్ధిలో ఉంది. వినియోగదారులు ఈ కారు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొత్త మారుతి వితారా బ్రెజ్జా పెట్రోల్ అమ్మకాలను మరింత మెరుగుపరుస్తుందని కంపెనీ భావిస్తోంది. కొత్త మారుతి వితారా బ్రెజ్జా భారత మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు టాటా నెక్సాన్ వంటి వాటికి ప్రత్యర్థిగా కొనసాగుతోంది.