Just In
- 4 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 6 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 9 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 10 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కియా కార్నివాల్కు పోటీగా ఎమ్జి మోటార్స్ జి10 ఎమ్పివి!
ప్రముఖ చైనీస్ ఆటోమొబైల్ బ్రాండ్ ఎమ్జి మోటార్స్ ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆటో ఎక్స్పో 2020లో ఓ పెర్ఫార్మెన్స్ సెడాన్, ఫుల్-సైజ్ ఎస్యూవీ, ఎమ్పివిలతో మరికొన్ని కార్లను భారత మార్కెట్లో ప్రదర్శన కోసం ఉంచిన సంగతి తెలిసినదే. ఎమ్జి మోటార్స్ ప్రస్తుతం భారత మార్కెట్లో హెక్టర్ ఎస్యూవీని మరియు ఎమ్జి జిఎస్ ఎలక్ట్రిక్ ఎస్యూని మాత్రమే విక్రయిస్తోంది. భారత్లో మరిన్ని వాహనాలను విడుదల చేసేందుకు కూడా కంపెనీ సన్నాహాలు చేస్తోంది.
ఎమ్జి మోటార్స్ గడచిన ఆటో ఎక్స్పో 2020లో ప్రదర్శించిన ఎమ్జి జి10 (పలు అంతర్జాతీయ మార్కెట్లలో ఈ మోడల్ను మాక్సస్ జి10 అని కూడా పిలుస్తారు) ఎమ్పివి వాహనాన్ని భారత్లో కియా కార్నివాల్ ఎమ్పివికి పోటీగా ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ సరికొత్త తరం 2020 జి10 ఎమ్పివిని ఎమ్జి మోటార్స్ ఇటీవలే చైనీస్ మార్కెట్లో విడుదల చేసింది. వచ్చే ఏడాదిలో ఇది భారత మార్కెట్లో కూడా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చైనీస్ మార్కెట్లో విడుదలైన ఎమ్జి జి10 ధర భారత కరెన్సీతో పోల్చుకుంటే సుమారు రూ.15 లక్షల వరకూ ఉంటుంది. అయితే, ఇండియన్ మార్కెట్లోకి వచ్చే సరికి దీని ధర మరింత పెరిగే అవకాశం ఉంది. కియా కార్నివాల్ మాదిరిగానే ఎమ్జి జి10 ఎమ్పివి కూడా విభిన్న రకాల సీటింగ్ ఆప్షన్లతో లభ్యం కానుంది. తొమ్మిది మంది కూర్చునేందుకు వీలుగా ఇందులో నాలుగు వరసల సీటింగ్ ఆప్షన్ కూడా లభిస్తుంది.
MOST READ: ట్రాఫిక్ ఫైన్ తగ్గించాలని అభ్యర్థించిన బిఎమ్డబ్ల్యూ 5 సిరీస్ ఓనర్ [వీడియో]
భారత మార్కెట్లో కియా కార్నివాల్ ఎమ్పివి నేరుగా పోటీనిచ్చేలా ప్రీమియం ఎమ్పివి సెగ్మెంట్లో జి10 ఎమ్పివిని ఎమ్జి మోటార్స్ ప్రవేశపెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఈ చైనీస్ వెర్షన్ ఎమ్జి జి10 ఎమ్పివి అక్కడి మార్కెట్లో రెండు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. అందులో మొదటి 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 223 బిహెచ్పిల శక్తిని మరియు 350 ఎన్ఎమ్ల టార్క్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో లభిస్తుంది.
MOST READ: టెస్లా ఖాతాలో మరో విజయం, ప్రపంచంలో కెల్లా అత్యంత విలువైన బ్రాండ్!
ఇకపోతే రెండవది 2.0 డీజిల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 162 బిహెచ్పిల శక్తిని మరియు 375 ఎన్ఎమ్ల టార్క్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్ లేదా 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఎమ్జి మోటార్స్ కొత్తగా విడుదల చేసిన 2020 ఎమ్జి జి10లో 7 మరియు 9 సీటర్లకు అదనంగా కొత్తగా 8-సీటర్ వేరియంట్ను ప్రవేశపెట్టారు. ఇందులోని ఇంటీరియర్లను కూడా చాలా వరకు మార్చారు.
ఎల్ఈడి హెడ్ల్యాంప్స్, వెనుక ప్యాసింజర్లకు కూడా అందుబాటులో ఉండేలా పెద్ద స్ప్లిట్ సన్రూఫ్ (రెండు ఉంటాయి), సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్ ఆపరేటెడ్ స్లైడింగ్ డోర్స్ వంటి అనేక ఫీచర్లతో కొత్త 2020 ఎమ్జి జి10 ఎమ్పివిని అప్గ్రేడ్ చేశారు.
MOST READ: మలేషియా పోలీస్ ఫోర్స్లో చేరిన హోండా సివిక్ కార్లు
ఇకపోతే ఎమ్జి మోటార్స్ భారత మార్కెట్లో వచ్చే నెలలో మరో సరికొత్త మోడల్ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న ఎమ్జి హెక్టర్ ఎస్యూవీలో ఎమ్జి హెక్టర్ ప్లస్ అనే కొత్త వేరియంట్ను జులైలో ప్రవేశపెట్టడానికి కంపెనీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న స్టాండర్డ్ హెక్టర్ ఎస్యూవీని పొడగించిన బడిన వెర్షన్గా హెక్టర్ ప్లస్ను విడుదల చేయనున్నారు. ఇందులో కొత్తగా మూడో వరుస సీటింగ్ను జోడించనున్నారు.
ఎమ్జి మోటార్స్ ఎమ్జి జి10 ఎమ్పివిపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితుల్లో దేశంలో పర్సనల్ మొబిలిటీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో, ఇలాంటి అధిక సీటింగ్ సామర్థ్యం కలిగిన కార్లకు భారత్లో డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. ఒకవేళ ఎమ్జి మోటార్స్ తమ జి10 ఎమ్పివిని భారత్లో విడుదల చేసినట్లయితే, ఇది తప్పకుండా కియా కార్నివాల్, టొయోటా ఇన్నోవా క్రిస్టా వంటి మోడళ్లకు పెను సవాల్ విసురుతుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.