Just In
- 20 min ago ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- 1 hr ago కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- 3 hrs ago రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- 4 hrs ago కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (వీడియో)
Don't Miss
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Movies Yuva Movie Collections పునీత్ రాజ్కుమార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. యువ మూవీకి రికార్డు కలెక్షన్లు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
2025 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల తయారీ హబ్గా భారత్: నితిన్ గడ్కరీ
కోవిడ్-19 పరిస్థితుల తర్వాత భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల రోడ్మ్యాప్ గురించి నిర్వహించిన ఓ వెబినార్లో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. రానున్న సంవత్సరాల్లో భారతదేశం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ హబ్గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమకు ప్రభుత్వం చేయగలిగిన అన్ని రకాల సహాయ, సహకారాలను అందిస్తామని, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే పరిశ్రమలకు గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ రేట్లను 12 శాతానికి సవరించిందని ఆయన గుర్తు చేశారు.
ఇ-రిక్షాలు కాకుండా, దేశంలో విక్రయించే మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల్లో 90 శాతం ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. వీటికి అదనంగా, రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ టూవీలర్లు మరియు ఫోర్-వీలర్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
MOST READ: ఖాళీ రోడ్డుపై బైక్ స్టంట్స్ : ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు యువకులు [వీడియో]
మార్కెట్లోకి రానున్న కొత్త ఎలక్ట్రిక్ వాహనాలతో దేశంలో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ పరిధి పెరుగుతుందని, భారతదేశాన్ని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ హాట్స్పాట్గా మార్చాలనే కేంద్ర ప్రభుత్వ ప్రణాళికను వేగవంతం చేస్తాయని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ భావిస్తోంది.
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి ప్రభుత్వానికి అవగాహన ఉందని, అయితే ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరిగిన తర్వాతనే ఈ సవాళ్లను అధిగమించగలమని మంత్రి గడ్కరీ అన్నారు.
MOST READ: వరుసగా 16 వ రోజు చుక్కలు చూపిస్తున్న డీజిల్ & పెట్రోల్ ధరలు
శిలాజ ఇంధనాలు అంతరించిపోతున్న నేపథ్యంలో, భవిష్యత్తులో
విద్యుత్ మరియు జీవ ఇంధనాలే ప్రత్యమ్నాయ మార్గాలని, సామూహికంగా వీటిని స్వీకరించినప్పుడే ఈ రంగంలో అద్భుతమైన అవకాశాలు ఉంటాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఢిల్లీ-ముంబై గ్రీన్ కారిడార్లో భాగంగా తయారవుతున్న తొలి విద్యుత్ రహదారి ఏమిటనే దానిపై ప్రభుత్వం ప్రస్తుతం కృషి చేస్తోంది.
పెట్రోలియం సహజ వనరులు నెమ్మదిగా కొరత ఏర్పడుతుందని భావిస్తున్నందున, ఇందుకు ప్రత్యామ్నాయంగా పూర్తి ఎలక్ట్రిక్కు మారాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని గడ్కరీ అన్నారు. చైనాలో పెట్టుబడులపై ప్రపంచం అంతగా ఆసక్తి చూపకపోవడంతో, భారతదేశంలో పరిశ్రమలకు అవకాశం సరైనదని ఆయన చెప్పారు.
MOST READ: సుశాంత్ సింగ్ రాజ్పుత్ బైక్లు, కార్లు ఎలా ఉన్నాయో చూసారా ?
ఇండియా ఎలక్ట్రిక్ హబ్గా మారడంపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
నిజానికి ఇది చాలా గొప్ప విషయం. పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ఇంధనాల వినియోగం నానాటికీ పెరిగిపోతోంది, ఫలితంగా వీటి నిల్వలు కూడా భారీగా క్షీణిస్తున్నాయి. ఇది ఇలానే కొనసాగితే కొంత కాలానికి మనకు పెట్రోల్, డీజిల్ లభించవు, ఒకవేళ లభించినా వాటిన కొనడానికి మనం భారీ మొత్తంలో నగదు చెల్లించాల్సి రావచ్చు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే, మనం ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలను ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.