Just In
- 23 min ago ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- 1 hr ago బిలినీయర్ మనసుదోచిన ఆటో ఇదే!.. ధర తెలిస్తే మీరు కొనేస్తారు
- 2 hrs ago క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- 16 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
Don't Miss
- Movies నాతో ఆ పని చేస్తావా? ఒక రాత్రికి ఎంత తీసుకుంటావ్.. జబర్ధస్త్ బ్యూటీ ఏమన్నదో చూశారంటే!
- News ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఓలా క్యాబ్ లో ప్రయాణించాలా, అయితే ఇవి తప్పకుండా పాటించాల్సిందే
భారతదేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకి ఎక్కువగా వ్యాపిస్తున్న కారణంగా భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. ఈ లాక్ డౌన్ ఇప్పుడు మొదటి మరియు రెండవ దశలు పూర్తి చేసుకుని ఇప్పుడు మూడవ దశలో అడుగుపెట్టింది. ఈ మూడవదశలో అన్ని రాష్ట్రాలలోని ప్రాంతాలను గ్రీన్, ఆరంజ్ మరియు రెడ్ జోన్లగా విభాగించారు. అంతే కాకుండా గ్రీన్ మరియు ఆరంజ్ జోన్లలో కొన్ని కార్యకలాపాలకు అనుమతులను జరీ చేసింది.
ఓలా క్యాబ్స్ భారతదేశంలో తమ కార్యకలాపాల పునఃప్రారంభించింది. యాప్-బేస్డ్ రైడ్-హెయిలింగ్ ప్లాట్ఫాం ఆధారంగా దేశవ్యాప్తంగా 100 కి పైగా నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభించినట్లు చెబుతున్నారు. కానీ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ సేవలు కేవలం గ్రీన్ మరియు ఆరంజ్ జోన్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి.
భారతదేశంలోని కొన్ని మండలాల్లో లాక్డౌన్ పరిమితులను సడలించడానికి అనుమతించిన హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం తమ కార్యకలాపాలను పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.
MOST READ:లాక్డౌన్ ఎఫెక్ట్ : లక్షకుపైగా వాహనాలు సీజ్, ఎక్కడో తెలుసా..?
ఓలా క్యాబ్స్ కార్యకలాపాల యొక్క పునఃప్రారంభం గురించి మాట్లాడుతూ, కంపెనీ '10 -స్టెప్స్ టు సేఫ్ రైడ్ 'అనే కొత్త పద్దతిని ప్రవేశపెట్టింది. ఈ కొత్త పద్ధతి కరోనా నివారణకు కూడా ఉపయోగపడుతుంది. ఇది వినియోగదారులు మరియు డ్రైవర్ భాగస్వాముల భద్రతను నిర్ధారిస్తుంది.
డ్రైవర్ మరియు కస్టమర్ల కు చాలా భద్రతను కల్పిస్తుంది. అంతే కాకుండా డ్రైవర్లు మరియు వినియోగదారులు రెడ్ జోన్లలోకి ప్రవేశించకుండా చర్యలను కూడా తీసుకుంటుంది. ప్రతి రైడ్ తర్వాత కార్లు శుభ్రపరచబడతాయి. ఇది వినియోగదారుల ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకుంటుంది.
MOST READ:ఆకాశంలోకి ఎగరటానికి ట్రై చేసిన హీరో అక్షయ్ కుమార్ [వీడియో]
ఓలా డ్రైవర్లు మరియు కస్టమర్లు సామాజిక దూరం పాటించడమే కాకుండా, శానిటైజేషన్ చర్యలు మరియు వ్యక్తిగత పరిశుభ్రతకు కట్టుబడి ఉండాలని ఆదేశించింది.
కస్టమర్ మరియు డ్రైవర్లు అనుసరించడానికి కంపెనీ ప్రోటోకాల్లను ఏర్పాటు చేసింది.
డ్రైవర్ - పార్ట్నర్ కోసం :
1) రెడ్ జోన్లో ప్రయాణం నిషేధం
2) తప్పనిసరిగా ఫేస్ మాస్క్లు ఉపయోగించడం
3) వాహనంలోని వస్తువులను పరిశుభ్రంగా ఉంచడం
4) క్రమం తప్పకుండా కార్లను శుభ్రం చేయడం
5) ఫ్లెక్సిబుల్ క్యాన్సిలేషన్
MOST READ:నిస్సాన్ కి కష్ట కాలం : నిలిపివేయబడిన టెర్రానో ఎస్యువి
వినియోగదారుల కోసం :
1) తప్పనిసరిగా మాస్క్ ధరించడం
2) ఎసి స్విచ్ ఆఫ్ చేయడం
3) కారులో ఇద్దరే ప్రయాణించాలి
4) కస్టమర్లచే సామాను లోడ్ చేసి అన్లోడ్ చేయించడం
5) కాష్ లెస్ పేమెంట్
ఓలా ప్రతినిధి మరియు కమ్యూనికేషన్స్ హెడ్ ఆనంద్ సుబ్రమణియన్ మాటాడుతూ, "సురక్షితమైన ప్రయాణానికి ఈ విధానాలను తప్పనిసరిగా పాటించాలి. ఈ విధంగా పాటించడం వాళ్ళ కరోనని కొంతవరకు కట్టడి చేయవచ్చు.అందరూ కలిసి ఈ విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం వల్ల అవసరమైన నివారణ చర్యలు మంచి ఫలితాలకు దారి తీస్తాయి.
MOST READ:నిజంగా ఈ పెళ్లి కొడుకు అదృష్టవంతుడే, ఎందుకో మీరే చూడండి