Just In
- 7 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 7 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 9 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 10 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
డ్రైవ్ ది డ్రైవర్ ఫండ్ ప్రోగ్రాంను ప్రారంభించిన ఓలా, ఎందుకో తెలుసా.. !
భారతదేశంలో కరోనా వైరస్ ఎక్కువగా విస్తరించడం వల్ల భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించబడింది. దీనివల్ల అన్ని రకాల రవాణా సదుపాయాలు నిలిపివేయడం జరిగింది. ఇందులో క్యాబ్ మరియు టాక్సీ ఉన్నాయి. దీని ఫలితంగా క్యాబ్ మరియు టాక్సీ డ్రైవర్లు కొన్ని క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
ఓలా ఫౌండేషన్ కింద ఓలా కంపెనీ తన డ్రైవర్లకు మద్దతు ఇవ్వడానికి సహాయం చేస్తోంది. ఇందులో భాగంగా ఓలా ఫౌండేషన్ డ్రైవ్ ది డ్రైవర్ ఫండ్ ప్రోగ్రాంను ప్రారంభించింది.
ఈ ప్రోగ్రాం కింద ఓలా గ్రూప్ మరియు దాని పెట్టుబడిదారులు ఓలా యొక్క ఆటో రిక్షా మరియు క్యాబ్ డ్రైవర్లకు సహాయం చేయనున్నారు. నివేదికల ప్రకారం ఓలా గ్రూప్ ఈ ఫండ్కు రూ. 20 కోట్లు సమకూర్చుతుంది. ఓలా సీఈఓ సహ వ్యవస్థాపకుడు భనీష్ అగర్వాల్ దీని గురించి ట్వీట్ చేశారు.
లాక్ డౌన్ ప్రకటించడం వల్ల మిలియన్ల మంది డ్రైవర్లు ఆదాయం లేకుండా కష్టాలను ఎదుర్కొంటారు. వారికి సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో డ్రైవ్ డ్రైవర్ ఫండ్ను ప్రారంభించానని చెప్పారు. దీని కోసం దాదాపు రూ. 20 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు.
దీని గురించి ఓలా గ్రూప్ ప్రతినిధి ఆనంద్ సుబ్రమణియన్ మాట్లాడుతూ, ఈ కష్ట సమయంలో ఓలా గ్రూప్ మన వేలాది మంది డ్రైవర్లకు సహాయం చేయడానికి ఒక నిధిని ఏర్పాటు చేసింది. దీన్ని రూ. 20 కోట్ల నుంచి రూ. 50 కోట్లకు పెంచనున్నారు.
తక్షణ సహాయం అందించడానికి ఈ ఫండ్ ఉపయోగించబడుతుంది. కంపెనీ డ్రైవర్లు మరియు వారి కుటుంబాలకు ఉచిత వైద్య సంప్రదింపులు కూడా ఇస్తామని తెలిపింది.
MOST READ:కరోనా ఎఫెక్ట్ : ఐసోలేషన్ వార్డులుగా మారిన ట్రైన్ బోగీలు
భారతదేశంలో కొరోనావైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. భారతదేశంలో ఈ ఘోరమైన వైరస్ కారణంగా ఇప్పటికే చాలామంది ప్రజలు మరణించారు. దీని భారిన పడుతున్న ప్రజల సంఖ్య లెక్కకు మించి ఉంది.
MOST READ:కరోనా గుడ్ న్యూస్: సూపర్ ఫాస్ట్ టెస్టింగ్ కిట్ సిద్దం చేసిన బాష్