Just In
- 12 min ago మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- 13 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 17 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 19 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
Don't Miss
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- Movies ఇంద్రజకు చుక్కలు చూపించిన డైరెక్టర్.. భోరుమని ఏడ్చిన సీనియర్ హీరోయిన్.. ఏం జరిగిందంటే?
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
డ్రైవ్ ది డ్రైవర్ ఫండ్ ప్రోగ్రాంను ప్రారంభించిన ఓలా, ఎందుకో తెలుసా.. !
భారతదేశంలో కరోనా వైరస్ ఎక్కువగా విస్తరించడం వల్ల భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించబడింది. దీనివల్ల అన్ని రకాల రవాణా సదుపాయాలు నిలిపివేయడం జరిగింది. ఇందులో క్యాబ్ మరియు టాక్సీ ఉన్నాయి. దీని ఫలితంగా క్యాబ్ మరియు టాక్సీ డ్రైవర్లు కొన్ని క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
ఓలా ఫౌండేషన్ కింద ఓలా కంపెనీ తన డ్రైవర్లకు మద్దతు ఇవ్వడానికి సహాయం చేస్తోంది. ఇందులో భాగంగా ఓలా ఫౌండేషన్ డ్రైవ్ ది డ్రైవర్ ఫండ్ ప్రోగ్రాంను ప్రారంభించింది.
ఈ ప్రోగ్రాం కింద ఓలా గ్రూప్ మరియు దాని పెట్టుబడిదారులు ఓలా యొక్క ఆటో రిక్షా మరియు క్యాబ్ డ్రైవర్లకు సహాయం చేయనున్నారు. నివేదికల ప్రకారం ఓలా గ్రూప్ ఈ ఫండ్కు రూ. 20 కోట్లు సమకూర్చుతుంది. ఓలా సీఈఓ సహ వ్యవస్థాపకుడు భనీష్ అగర్వాల్ దీని గురించి ట్వీట్ చేశారు.
లాక్ డౌన్ ప్రకటించడం వల్ల మిలియన్ల మంది డ్రైవర్లు ఆదాయం లేకుండా కష్టాలను ఎదుర్కొంటారు. వారికి సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో డ్రైవ్ డ్రైవర్ ఫండ్ను ప్రారంభించానని చెప్పారు. దీని కోసం దాదాపు రూ. 20 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు.
దీని గురించి ఓలా గ్రూప్ ప్రతినిధి ఆనంద్ సుబ్రమణియన్ మాట్లాడుతూ, ఈ కష్ట సమయంలో ఓలా గ్రూప్ మన వేలాది మంది డ్రైవర్లకు సహాయం చేయడానికి ఒక నిధిని ఏర్పాటు చేసింది. దీన్ని రూ. 20 కోట్ల నుంచి రూ. 50 కోట్లకు పెంచనున్నారు.
తక్షణ సహాయం అందించడానికి ఈ ఫండ్ ఉపయోగించబడుతుంది. కంపెనీ డ్రైవర్లు మరియు వారి కుటుంబాలకు ఉచిత వైద్య సంప్రదింపులు కూడా ఇస్తామని తెలిపింది.
MOST READ:కరోనా ఎఫెక్ట్ : ఐసోలేషన్ వార్డులుగా మారిన ట్రైన్ బోగీలు
భారతదేశంలో కొరోనావైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. భారతదేశంలో ఈ ఘోరమైన వైరస్ కారణంగా ఇప్పటికే చాలామంది ప్రజలు మరణించారు. దీని భారిన పడుతున్న ప్రజల సంఖ్య లెక్కకు మించి ఉంది.
MOST READ:కరోనా గుడ్ న్యూస్: సూపర్ ఫాస్ట్ టెస్టింగ్ కిట్ సిద్దం చేసిన బాష్