Just In
- 14 hrs ago రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- 17 hrs ago మార్కెట్లో వీటికి తిరుగే లేదు.. కొత్త బైక్ కొనాలనుకుంటే ఈ లిస్ట్ అస్సలు మిస్ అవ్వకండి
- 19 hrs ago వారెవ్వా.. యూట్యూబర్స్ వాడే కార్లు ఇలా ఉన్నాయా!.. ఓ లుక్కేసుకోండి
- 19 hrs ago రూ. 10 లక్షల లోపు ధరలో విడుదల కాబోతున్న ప్రముఖ బ్రాండ్ల కార్లు ఇవే..
Don't Miss
- Sports సర్ఫరాజ్, ధ్రువ్కు బీసీసీఐ బంపర్ ఆఫర్
- Movies భర్తకు విడాకులిచ్చి మరొకరితో డేటింగ్.. 38 ఏళ్ల ఏజ్లో జగతి మేడం రొమాన్స్ చూశారా?
- Finance IT News: CEO మైండ్ బ్లాంక్ చేసిన IT ఉద్యోగి.. నెట్టింట పోస్ట్ వైరల్.. ఆ ఒక్క మాటతో..
- News తెలంగాణా కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు నేడే: కాంగ్రెస్ సిఈసి భేటీకి సీఎం రేవంత్ రెడ్డి!!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
ఇండియాలో ఇప్పుడు అతి తక్కువ ఖర్చుతోనే హెలికాఫ్టర్ సర్వీస్.. ఎక్కడో తెలుసా ?
పవన్ హన్స్ లిమిటెడ్ (పిహెచ్ఎల్) ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్-న్యూ టెహ్రీ-శ్రీనగర్-గౌచర్ మార్గంలో కొత్త హెలికాప్టర్ సేవను సెంటర్ కనెక్టివిటీ స్కీమ్ ఉడాన్ కింద ఆవిష్కరించింది.
పవన్ హన్స్ లిమిటెడ్ (పిహెచ్ఎల్) ఉడాన్ ప్రాజెక్టు కింద అతి తక్కువ ధరలకే ఉత్తరాఖండ్లో హెలికాప్టర్ సర్వీస్ ప్రారంభించింది. ఈ హెలికాప్టర్ సర్వీస్ డెహ్రాడూన్, న్యూ టెహ్రీ, శ్రీనగర్ మరియు గౌచర్ల మధ్య కనెక్టివిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ హెలికాప్టర్ వారానికి 3 రోజుల సేవలను అందిస్తుంది.
ఈ హెలికాప్టర్ ట్రావెల్ బుకింగ్ ఫీజు రూ. 2,900. ఈ సర్వీస్ రాష్ట్రాల మధ్య పరస్పర హెలికాప్టర్ సేవలకు మరింత పెంచుతుంది. అంతే కాకుండా రాష్ట్రాల మధ్య పర్యాటక రంగాన్ని, రాష్ట్రాల్లో పర్యాటక అభివృద్ధిని మెరుగుపరుస్తుందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్, కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరి తెలిపారు.
MOST READ:ఈ సంవత్సరం ఎక్కువగా సర్చ్ చేసిన కార్లు ఇవే
కొత్త సేవలకు సంబంధించినంతవరకు పవన్ హన్స్ వారానికి మూడుసార్లు హెలికాప్టర్ సర్వీస్ ప్రారంభిస్తారు, మరియు ప్రయాణీకుల నుండి ఛార్జీలు కూడా నిర్దారించబడుతుంది.
ఈ ప్రాంతంలో హెలికాప్టర్ సేవలను ప్రారంభించడంతో, రాష్ట్రాల మధ్య విమాన సంబంధాలు మెరుగుపడతాయి మరియు రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. ఈ హెలికాప్టర్ సర్వీస్ కొండ ప్రాంతాలలో కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తుంది.
MOST READ:బిఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్ రద్దుచేసిన సుప్రీంకోర్టు : ఎందుకో తెలుసా ?
ఉత్తరాఖండ్ కొండ భూభాగం గుండా ప్రయాణించడానికి గతంలో 2 నుండి 3 గంటలు పట్టింది. ఇప్పుడు ఈ ప్రాంతాలను కేవలం 30 నిమిషాల్లో చేరుకోవచ్చు. చార్ ధామ్లో ప్రయాణించే వారికి కూడా ఈ హెలికాప్టర్ సేవ అందించబడుతుంది.
డెహ్రాడూన్ నుండి రామ్నగర్, పంత్నగర్, నైనిటాల్, అల్మోరా, పిథోరాగర్ మరియు డెహ్రాడూన్ నుండి ముస్సూరీ వరకు మరో రెండు హెలికాప్టర్ సర్వీసులు త్వరలో ప్రారంభించబడతాయి. ఉడాన్-2 ప్రాజెక్ట్ కింద కొత్త మార్గాల్లో సేవలకు పవన్ హన్స్ లిమిటెడ్ను సివిల్ ఏవియేషన్ విభాగం ఆమోదించింది.
MOST READ:కొత్త అవతారం దాల్చిన మోడిఫైడ్ ప్రీమియర్ పద్మిని కార్
ఉడాన్ ప్రాజెక్టు కింద ఇప్పటివరకు 50 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించినట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. ఉడాన్ ప్రాజెక్ట్ 19 రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రారంభించబడింది. ఈ సర్వీసులు ప్రయాణికులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
Image Courtesy: Pawan Hans Ltd
Note: Images are representative purpose only