Just In
- 1 hr ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 4 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 7 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 10 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Movies Tenent Review: మర్డర్ మిస్టరీ మెప్పించిందా? సత్యం రాజేష్కు హిట్ పడిందా? టెనెంట్ రివ్యూ
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆరోగ్య కార్యకర్తలకు గుడ్ న్యూస్, లక్ష ఉచిత విమాన టికెట్లను అందించనున్న ఖతార్
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ రోజు రోజుకి ఎక్కువ సంఖ్యలో విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్తో పోరాడుతున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు గల్ఫ్ ఎయిర్లైన్స్ ఖతార్ ఎయిర్వేస్ లక్ష కాంప్లిమెంటరీ టిక్కెట్లను ప్రకటించింది. 2020 మే 12 ప్రపంచ నర్సుల దినోత్సవ సందర్భగా ఈ ప్రకటనను విడుదల చేసింది. ఎయిర్వేస్ ప్రతి సంవత్సరం మే 12 న ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని జరుపుకుంటారు.
ఖతార్ ఎయిర్వేస్ దీని గురించి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్తో పోరాడుతున్న వైద్యులు మరియు ఆరోగ్య కార్యకర్తలను మేము అభినందిస్తున్నామన్నారు. కరోనా రోగుల ప్రాణాలను కాపాడటానికి కరోనా వారియర్స్ తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు.
వైద్యులు వారి దయ మరియు అంకితభావం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే మిలియన్ల మంది ప్రాణాలను రక్షించారు. వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లతో సహా ప్రపంచంలోని ప్రతి దేశానికి చెందిన ఆరోగ్య కార్యకర్తలు ఈ టికెట్ పొందటానికి అర్హులు. టిక్కెట్లు పారదర్శకంగా పంపిణీ చేయబడతాయి. జనాభా ఆధారంగా ప్రతి దేశానికి టికెట్లు జారీ చేస్తారు.
MOST READ:త్వరలో లాంచ్ కానున్న ఎంవి అగస్టా సూపర్ బైక్, చూసారా..?
ఎంపికైన ఆరోగ్య కార్యకర్తలకు రెండు రౌండ్ట్రిప్ టికెట్లను బుక్ చేసుకునే అవకాశం ఇవ్వబడుతుంది. ఖతార్ ఎయిర్వేస్ ప్రయాణిస్తున్న ఏ ప్రదేశానికైనా వారు టికెట్ బుక్ చేసుకోవచ్చు.
అదనంగా, ఖతార్ రాజధాని దోహా యొక్క హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న రిటైల్ దుకాణాలకు 35% తగ్గింపు ఇవ్వబడుతుంది. ఈ టిక్కెట్లను నవంబర్ 26 లోపు రిజర్వు చేయాలి.
MOST READ:భారీ డిస్కౌంట్ ప్రకటించిన మహీంద్రా, ఏ కారుపై ఎంతెంతో చూడండి
ఈ ప్రయాణం 2020 డిసెంబర్ 10 వరకు చెల్లుతుంది. ఈ కాంప్లిమెంటరీ టిక్కెట్లను రీ షెడ్యూల్ చేయడానికి లేదా రద్దు చేయడానికి ఎటువంటి ఛార్జీలు ఉండవని ఖతార్ ఎయిర్వేస్ తెలిపింది. రద్దు చేసిన టిక్కెట్లను తిరిగి బుక్ చేసుకోవచ్చు.
విదేశాలలో చిక్కుకున్న భారతీయులను తిరిగి తీసుకురావడానికి భారత క్యారియర్ ఎయిర్ ఇండియా వందే భారత్ మిషన్ను ప్రారంభించింది. ఈ మిషన్ మే 8 నుండి మే 14 వరకు 64 విమానాలను నడపబడతాయి.
MOST READ:సినిమా స్టైల్ లో సింగం స్టంట్ చేసిన పోలీసుకు రూ. 5000 జరిమానా
ఈ మిషన్ కింద భారతదేశానికి తిరిగి వచ్చే ప్రజలు పూర్తి ప్రయాణ ఖర్చుతో పాటు 14 రోజుల హాస్పిటల్ ఖర్చులు మరియు సదుపాయ ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మిషన్లో భారతీయ పౌరులను ఎయిర్ ఇండియా విమానం మరియు యుద్ధనౌకల ద్వారా తిరిగి తీసుకురావడం జరుగుతుంది.