Just In
- 12 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 13 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 17 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 18 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- Movies Karthika Deepam 2 April 24th: దీప తాళికట్టిన భార్య.. నరసింహ చెప్ప పగలగొట్టిన సుమిత్ర
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రెడ్ జోన్లో క్యాబ్ సర్వీసులకు గ్రీన్ సిగ్నల్, ఎక్కడో తెలుసా !
భారతదేశంలో కరోనా వైరస్ ప్రభావం వల్ల దేశ వ్యాప్తంగా గ్రీన్, ఆరంజ్ మరియు రెడ్ జోన్లుగా విభాజించారు. ఈ నాల్గవ దశ లాక్ డౌన్ లో కొన్ని సడలింపులు కూడా కల్పించబడింది. గ్రీన్ మరియు ఆరంజ్ జోన్లలో కొన్ని వాహన సేవలు కూడా కల్పించారు. ఇటీవల కాలంలో రెడ్ జోన్లలో కూడా ఆటోరిక్షాలు మరియు టాక్సీలకు అధికారం ఇచ్చినట్లు రాజస్థాన్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. అంతే కాకుండా గుట్కా, పాన్ మసాలా మరియు పొగాకు ఉత్పత్తుల అమ్మకం కూడా అనుమతించబడింది.
అయితే గుట్కా మరియు పొగాకు ఉత్పత్తులను తినడం మరియు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం వంటివి చేయకూడదని ప్రభుత్వం జారీ చేసింది. ఈ నిబంధనను ఉల్లంఘించడం చట్టవిరుద్ధం మరియు శిక్షార్హమైనది.
లాక్ డౌన్ యొక్క నాల్గవ దశలో ఓలా మరియు ఉబెర్ టాక్సీలతో సహా ఆటో రిక్షాల నిర్వహణకు రాజస్థాన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఆపరేషన్ సామాజిక దూరాన్ని నిర్వహించడం మరియు భద్రతా నిబంధనలను పాటించడం వంటి పరిస్థితులతో అనుమతించబడుతుంది.
MOST READ:దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త స్కోడా కరోక్, ఎలా ఉందో చూసారా
రాష్ట్రంలో పబ్లిక్ పార్కులు కూడా తెరవబడతాయి. దీనికి సంబంధించిన నివేదికల ప్రకారం పబ్లిక్ పార్క్ ఉదయం 7 నుండి సాయంత్రం 6.45 వరకు తెరిచి ఉంటుంది. ఈ కార్యకలాపాలన్నీ ఇప్పటికే గ్రీన్ మరియు ఆరెంజ్ జోన్లలో అనుమతించబడ్డాయి.
రాజస్థాన్లో సోమవారం కరోనా వైరస్ సంక్రమణతో నలుగురు మరణించారు. రాజస్థాన్లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 272 కు పెరిగింది. రాజస్థాన్లో కోవిడ్-19 బారిన పడిన వారి మొత్తం సంఖ్య 7,300 కు పెరిగింది.
MOST READ:బిఎమ్డబ్ల్యూ F 900 R & F 900 XR బైక్ టీసర్ వీడియో
దీనిపై రాజస్థాన్ అదనపు ఆరోగ్య కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా 272 కేసులు నమోదయ్యాయని, ఈ సంఖ్య ఇప్పుడు 7,300 కు పెరిగిందని చెప్పారు.
పాలిలో 50, నాగౌర్లో 48, జోధ్పూర్లో 47, సికార్లో 44, చురులో 17, జైపూర్లో 13, ఉదయపూర్లో 12 కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్లో 3,077 క్రియాశీల కేసులు నమోదయ్యాయని, 3,559 మందిని నయం చేసి ఆసుపత్రుల నుంచి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఏది ఏమైనా ఈ పరిస్థితుల్లో సామజిక దూరం పాటిస్తూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
MOST READ:రాళ్ళలో చిక్కుకున్న ఇన్నోవా కారును బయటకు తీసిన మహీంద్రా బొలెరో [వీడియో]