Just In
- 44 min ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 2 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
- 3 hrs ago సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- 6 hrs ago 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
Don't Miss
- News రూ.100 తో ఊరు వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Movies నీకెంత బలుపు? ఆర్కే నాయుడుపై సీనియర్ నటి సీరియస్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ఇప్పుడు ఇండియన్ మార్కెట్లోకి రెనాల్ట్ కూడా ఎలక్ట్రిక్ కారుని ప్రవేశపెట్టనుందా..!
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రాను రాను ఎక్కువవుతోంది. దీని ఫలితంగా అన్ని సంస్థలలో కూడా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడం ప్రారంభించారు. ఆ శ్రేణిలో ఇప్పుడు రెనాల్ట్ కూడా ఎలక్ట్రిక్ కారుని ప్రవేశపెట్టబోతోంది. దీని గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం!
రెనాల్ట్ నుండి భారతీయ మార్కెట్లోకి జోయి ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రవేశపెట్టాలనుకుంటుంది. దీనికి కావలసిన పరిశీలనలు జరుగుతున్నాయి. ఆటో కార్ ఇండియా ప్రకారం రెనాల్ట్ జోయి భారత మార్కెట్ కోసమే తయారు చేయబడుతోంది. ఇది 2020 చివరిలో లేదా 2021 ప్రారంభంలో విక్రయించబడుతుందని భావిస్తున్నారు.
2020 ఫిబ్రవరిలో జరిగే ఆటో ఎక్స్పోలో రెనాల్డ్ తన ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రదర్శనకు ఉంచబోతోంది అని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ప్రదర్శన వినియోగదారుల యొక్క ఆసక్తిని అంచనా వేయడానికి సహాయపడుతుంది.
జోయి ఎలక్ట్రిక్ కారుని భారతీయ మార్కెట్లోకి తీసుకురావాలని రెనాల్ట్ నిర్ణయించుకుంటే అది చాలా మార్పులతో రావడం జరుగుతుంది. ఇది భారతీయ డ్రైవింగ్ పరిస్థితులకు అనువైనదిగా మారడానికి వీలు కల్పిస్తుంది. రెనాల్ట్ ఎలక్ట్రిక్ వాహనంలో ప్రధాన మార్పులలో ఒకటి ఏమిటంటే వాహనం యొక్క దిగువ భాగంలో అదనపు రక్షణ ఉంటుంది. అననుకూలమైన భారతీయ రహదారి పరిస్థితులపై డ్రైవింగ్ చేసేటప్పుడు బ్యాటరీలు దెబ్బతినకుండా కాపాడటానికి ఇది సహాయపడుతుంది.
రెనాల్ట్ జోయి ఎలక్ట్రిక్ దాని మోటారు నుండి 90 బిహెచ్పి ని ఉత్పత్తి చేసే 41 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కారు ఒకే ఛార్జీపై గరిష్టంగా 300 నుండి 350 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. రెనాల్ట్ జోయి ఎలక్ట్రిక్ కారు ప్రామాణిక మరియు వేగవంతమైన ఛార్జింగ్ సాంకేతికతను కలిగి ఉంటుంది.
రెనాల్ట్ జోయి ఎలక్ట్రిక్ కారుని భారత మార్కెట్లోకి తీసుకురావాలనే ప్రణాళికలు ఇంకా ప్రారంభ దశలో ఉన్నాయి. ఈ సంస్థ వచ్చే ఏడాదిలో జోయి పై విస్తృతమైన పరీక్షలను అమలు చేస్తుంది. తరువాత అప్డేట్ చేసి రహదారులకు అనువైనదిగా మలచడం జరుగుతుంది.
ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క కొలతలను గమనించినట్లయితే, పొడవు 4,087 మిమీ, వెడల్పు 1,787 మిమీ మరియు ఎత్తు 1,562 మిమీ, వీల్బేస్ 2,588 మిమీ వరకు ఉంటుంది. దాని ఇంటీరియర్ క్యాబిన్ స్పేస్ భారతీయ మార్కెట్లో సాంప్రదాయక ప్రీమియం హ్యాచ్బ్యాక్ సమర్పణల మాదిరిగానే ఉంటుంది.
Read More:సుదీప్కు బిఎమ్డబ్ల్యూ ఎం 5 స్పోర్ట్స్ కార్ను గిఫ్ట్ గా ఇచ్చిన సల్మాన్ ఖాన్
భారతదేశంలో రెనాల్ట్ జోయి ఎలక్ట్రిక్ వాహనం ప్రవేశపెట్టడంపై ఆలోచనలు:
భారతదేశంలో దాదాపు చాలా తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలవైపు పరుగులు తీస్తూ వున్నాయి. ఇందులో రెనాల్ట్ మాత్రం వెనుకబడి ఉంది. ఈ విధంగా వెనుకబడి ఉండటం రానాల్ట్ కి ఇష్టం లేదు. రెనాల్ట్ నుంచి కూడా త్వరలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలనే సంకల్పంతో జోయి ను పరిచయం చేయడానికి యోచిస్తోంది.
Read More:ఇప్పుడే చూడండి...కొత్త లుక్ తో రాబోతున్న మారుతి సుజుకి 800
రెనాల్ట్ బ్రాండ్ నుండి ఒక సారి ఎలక్ట్రిక్ వాహనాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టినట్లైతే చాలా తయారీ దారులకు ప్రత్యర్థిగా ఉండబోతోంది. అంటే మారుతి వాగన్ ఆర్ ఎలక్ట్రిక్, టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ మరియు మహీంద్రా ఎక్స్యువి 300 ఎలక్ట్రిక్ వంటి వాటికి రెనాల్ట్ జోయి ప్రత్యర్థిగా ఉండవలసి ఉంటుంది.
Source: Autocar India