Just In
- 8 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 9 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 11 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 14 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Movies డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అకడమిక్ సిలబస్ లో చేరనున్న ట్రాఫిక్ సేఫ్టీ రూల్స్ ; ఎక్కడో తెలుసా ?
భారతదేశంలో రోజు రోజుకి పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించడంలో భాగంగా రాజస్థాన్ ప్రభత్వం మోటారు ట్రాఫిక్ చట్టం 2019ను అమలు చేసింది. మోటారు ట్రాఫిక్ చట్టం 2019 ప్రకారం ట్రాఫిక్ ఉల్లంఘనలకు జరిమానా పెంపును రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్వాగతించారు.
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలంటే జరిమానాలు పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. జరిమానాలు పెంచినట్లయితే ఖచ్చితంగా రోడ్డు నియమాలను పాటించే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఈ విధంగా మేలు చేయడం జరిగింది.
రాజస్థాన్ ప్రభుత్వ ఉన్నతాధికారుల సంభాషణలో పాల్గొన్న ముఖ్యమంత్రులు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో రహదారి భద్రత అమలయ్యేలా చూడనున్నారు. చిన్న వయస్సు నుండే పిల్లలకు ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పిస్తామని కూడా చెప్పారు.
MOST READ:టాటా నానో కారును ఢీ కొట్టి దెబ్బతిన్న హోండా సిటీ కార్ ; [వీడియో]
పాల ఉత్పత్తిదారులకు 15 వేల హెల్మెట్లను పంపిణీ చేయడానికి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం చర్యలు తీసుకుంది. జిల్లా స్థాయిలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో రహదారి భద్రతా కార్యకలాపాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రులు సూచించారు.
జిల్లా కేంద్రాల్లో డ్రైవింగ్ శిక్షణా సంస్థలను ప్రారంభిస్తామని చెప్పారు. అధిక-నాణ్యత గల హెల్మెట్లు ప్రమాదం జరిగినప్పుడు ప్రమాద రేటును దదౌ 50% వరకు తగ్గించే అవకాశం ఉంటుంది.
MOST READ:ఇదే రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ స్థానాన్ని రీప్లేస్ చేసే మోడల్!
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గురించి రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, కావున వాటిని ప్రభుత్వాలు తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలను 50% తగ్గించడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని రవాణా శాఖ నిర్ణయించినట్లు రాజస్థాన్ రవాణా మంత్రి ప్రతాప్ సింగ్ ఖాచారివాస్ తెలిపారు. ప్రమాదాల నుండి ప్రజలను రక్షించడానికి రాష్ట్రంలో 2019 మోటారు వాహన చట్టం అమలుచేయబడుతోంది. రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు కచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించినట్లయితే రోడ్డు ప్రమాదాలను దాదాపు తగ్గించవచ్చు.
MOST READ:ఇలాంటివి కేవలం 19 కార్లను మాత్రమే తయారు చేస్తారు - వివరాలు