Just In
- 12 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 14 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 16 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 18 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- Movies Karthika Deepam 2 నా బిడ్డకు దూరంగా ఉండు.. కార్తీక్కు దీప షాక్
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కరోనా భయం లేదు; భారత్లో పెరగనున్న సెకండ్ హ్యాండ్ కార్ సేల్స్
దేశంలో కోవిడ్ -19 మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతున్నప్పటికీ, సెకండ్ కార్ల వ్యాపారం మాత్రం జోరందుకునే అవకాశాలు మెండుగా ఉంటాయని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఆశిస్తోంది. ఈ సంక్షోభం వలన మెర్సిడెస్ బెంజ్ సర్టిఫైడ్ ప్రీ-ఓన్డ్ కార్ల విభాగం ప్రభావితం కాదని కంపెనీ తెలిపింది.
అయితే, సెకండ్ హ్యాండ్ కార్ల విభాగపు వృద్ధి కొత్త కార్ల విభాగంతో పోల్చుకుంటే తక్కువగా ఉండనుంది. ఈ ఏడాది పండుగ సీజన్లో ప్రీ-ఓన్డ్ కార్ల అమ్మకాలతో పాటు, బ్రాండ్ న్యూ కార్ల అమ్మకాలు కూడా ప్రోత్సాహకర రీతిలో ఉండొచ్చని మెర్సిడెస్ బెంజ్ అంచనా వేస్తోంది.
ఈ విషయంపై మెర్సిడెస్ బెంజ్ ఇండియా యొక్క ఎమ్డి మరియు సీఈఓ మార్టిన్ ష్వెంక్ మాట్లాడుతూ, "మూడు కోణాల నక్షత్రాన్ని సొంతం చేసుకోవాలనుకునే యువ మరియు మొదటిసారి కొనుగోలుదారులు, ఈ ఉత్పత్తులను ఎక్స్పీరియెన్స్ చేసేందుకు సాధారణంగా కొత్త కార్ల కంటే ముందుగా సర్టిఫైడ్ ప్రీ-ఓన్డ్ కార్లను ఎంచుకుంటారు. కాబట్టి ప్రీ-ఓన్డ్ కార్ల అమ్మకాలు పెరుగుతాయని మేము ఆశిస్తున్నాము అలాగని ఇది కొత్త కార్లకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని మేము అనుకోవటం లేదు" అని చెప్పారు.
MOST READ: భారత్లో కరోనా భయంతో ఉత్పత్తి పెంచిన మారుతి సుజుకి సప్లయర్స్
కంపెనీ ప్రకారం, భారత మార్కెట్లో ప్రీ-ఓన్డ్ కార్ల వ్యాపారానికి పటిష్టమైన అవకాశాలు ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ ఈ మార్కెట్లో తొమ్మిది సంవత్సరాలకు పైగా పూర్తి చేసుకుంది. ఈ సమయంలో అనేక మంది కొత్త కస్టమర్లను తమ బ్రాండ్ వైపుకు ఆకర్షించింది.
మెర్సిడెస్ బెంజ్ తమ కొత్త కార్ కస్టమర్లకు అందించే సేవలు, ఫైనాన్షియల్ ఆఫర్లు, బ్రాండ్ ఎక్స్పీరియెన్స్ను తమ ప్రీ-ఓన్డ్ కస్టమర్లకు కూడా అందిస్తోంది. అంటే దీని అర్థం, భారత్లోని సెకండ్ హ్యాండ్ వాహన మార్కెట్లో కూడా కస్టమర్లు లగ్జరీ బ్రాండ్ను ఎక్స్పీరియెన్స్ చేస్తున్నారన్నమాట.
MOST READ: భారత్లో ఎమ్జి హెక్టర్ విడుదల తేదీ ఖరారు - ఫీచర్లు, వివరాలు
అంతేకాకుండా, ఈ సంస్థ తన ఆన్లైన్ పోర్టల్లో కూడా సర్టిఫైడ్ ప్రీ-ఓన్డ్ కార్ల విభాగాన్ని జోడించింది. ఇది కంపెనీ ఆన్లైన్ అమ్మకాల ప్లాట్ఫామ్లో ప్రీ-ఓన్డ్ కార్లపై కస్టమర్లలో బలమైన ఆసక్తిని కనబరిచింది. మెర్సిడెస్ బెంజ్ సర్టిఫైడ్ గత ఐదేళ్లలో 20,500 యూనిట్ల ప్రీ-ఓన్డ్ కార్లను విక్రయించింది. ప్రీ-ఓన్డ్ కార్ల విభాగంలో అసాధారణమైన 20 శాతం సంచిత వృద్ధిని మెర్సిడెస్ సర్టిఫైడ్ నమోదు చేసుకుంది.
ప్రస్తుత మార్కెట్ పరిస్థితి గురించి ష్వెంక్ మాట్లాడుతూ, "మాక్రో-ఎకనామిక్ హెడ్విండ్స్, కోవిడ్-19 సంబంధిత సవాళ్లు మరియు మొదటి మరియు రెండవ త్రైమాసికాల్లో వాల్యూమ్ మోడల్స్ అందుబాటులో లేకపోవడం వల్ల మా అమ్మకాలు ప్రభావితమయ్యాయి. ఇక నుండి గడచిన త్రైమాసికపు నష్టాన్ని భర్తీ చేయడానికి మాకు చాలా కష్టంగా ఉంటుంద"ని అన్నారు.
MOST READ: సుశాంత్ సింగ్ రాజ్పుత్ బైక్లు, కార్లు ఎలా ఉన్నాయో చూసారా ?
తమ ఆన్లైన్ సేల్స్ ప్లాట్ఫామ్పై కంపెనీకి మంచి స్పందన లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితుల నేపథ్యంలో కాంటాక్ట్లెస్ లావాదేవీలు, సామాజిక దూరం కారణంగా, వినియోగదారులు ఆన్లైన్లో కార్లను సురక్షితంగా కొనుగోలు చేయడాన్ని ఎంచుకుంటున్నారని, తమ సంస్థ ఇప్పటికే డిజిటల్ రిటైల్ ప్లాట్ఫామ్ ద్వారా 100కు పైగా బుకింగ్లను అందుకుందని ష్వెంక్ చెప్పారు.
ఇక మెర్సిడెస్ బెంజ్కి సంబంధించిన ఇత వార్తల్లోకి వెళితే.. ఈ ఏడాది తమ ఉనికిని పెంచుకునేందుకు కంపెనీ ఇప్పటికే భారత మార్కెట్లో కొన్ని కొత్త కార్లను విడుదల చేసింది. తాజాగా.. ఈ జర్మన్ బ్రాండ్ నుంచి సరికొత్త 2020 మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ ఫ్లాగ్షిప్ ఎస్యూవీని కంపెనీ విడుదల చేసింది. భారత మార్కెట్లో దీని ధర రూ.99.9 లక్షలు, ఎక్స్షోరూమ్ (ఇండియా)గా ఉంది - మరిన్ని వివరాలకు ఈ లింకుపై క్లిక్ చేయండి.
మెర్సిడెస్ బెంజ్ ప్రీ-ఓన్డ్ వ్యాపారంపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
ఈ జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ప్రీ-ఓన్డ్ కార్ మార్కెట్లో అద్భుతమైన పురోగతిని చవిచూసింది. తొలిసారిగా లగ్జరీ కారును సొంతం చేసుకోవాలనుకునే కస్టమర్లు కొత్త కారు కొనుగోలుతో పోల్చితే తక్కువ ధర ఉన్నందున ప్రీ-ఓన్డ్ కారుకు మారే అవకాశం ఉంది. మరోవైపు మెర్సిడెస్ బెంజ్ కూడా కొత్త/పాత అన్న తేడా లేకుండా కస్టమర్లందరికీ ఒకేరకమైన సేవలు అందిస్తున్న నేపథ్యంలో కొత్త కార్లను కొనేవారు అలాగే సెకండ్ హ్యాండ్ కార్లను కొనేవారు ఒకేరకమైన బ్రాండ్ ఎక్స్పీరియెన్స్ని పొందుతున్నారు.