Just In
- 51 min ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 1 hr ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 2 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- 3 hrs ago కూతురికి రూ.2 కోట్ల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి.. ఫిదా చేస్తున్న వీడియో
Don't Miss
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Movies అడ్డంగా బుక్ అయిన నాగచైతన్య, శోభితా ధూళిపాళ.. ఆ దేశంలో హాలీడే ట్రిప్.. పట్టేసిన నెటిజెన్లు!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కరోనా నివారణకు 1,500 కోట్లు విరాళం ప్రకటించిన టాటా గ్రూప్స్
కరోనావైరస్ రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో దేశం మొత్తం లాక్ డౌన్ చేయబడింది. అంతే కాకుండా చాలా వాణిజ్య కార్యకలాపాలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా చాలామంది సినీ పరిశ్రమవారు, ఆటో మొబైల్ కంపెనీలకు చెందిన వారు చాలా పెద్దమొత్తంలో విరాళాలను అందిస్తున్నారు.
ఆటో మొబైల్ తయారీ సంస్థలు కరోనాకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రభుత్వాలకు మరియు వైద్య పరికరాలు తయారు చేసి ఇవ్వడంలో సహాయపడుతున్నాయి. దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన సంస్థలలో ఒకటైన టాటా గ్రూప్ కూడా కరోనాతో పోరాడటానికి భారీగా విరాళం ప్రకటించింది.
టాటా సన్స్ మరియు టాటా ట్రస్ట్ కలిసి వైద్య సదుపాయాలను చేకూర్చడానికి భారీగా రూ. 1,500 కోట్లు విరాళాలను ప్రకటించారు. ఇది వెంటిలేటర్, ఫేస్ మాస్క్, టెస్టింగ్ కిట్ వంటి వాటిని తయారు చేయడంలో ఉపయోగిస్తారు. దేశంలోని ప్రముఖ ఆటో తయారీ సంస్థలలో ఒకటైన బజాజ్ గ్రూప్ కూడా రూ. 100 కోట్ల రూపాయల విరాళం ప్రకటించబడింది.
200 మందికి పైగా ఎన్జీఓలు ఆరోగ్య శాఖ డిమాండ్లను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్న టెస్టింగ్ కిట్, వెంటిలేటర్ మరియు ఐసియు యూనిట్లతో ఆరోగ్య సదుపాయాలను కల్పిస్తామని ప్రకటించారు.
బజాజ్ మాత్రమే కాదు, ఎంజి మోటార్ కంపెనీ రూ. 2 కోట్లు విరాళంగా ఇస్తే వైద్య సేవలకు అవసరమైన పరికరాల ఉత్పత్తిని ప్రారంభిస్తామని మహీంద్రా, మారుతి సుజుకి ప్రకటించాయి.
చైనాలో ప్రారంభమై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన కరోనావైరస్ 6.30 మిలియన్లకు పైగా ప్రజలకు సోకింది మరియు 29,000 మందికి పైగా మరణించింది. అంతే కాకుండా రోజు రోజుకి మరింత ఎక్కువగా ఈ వైరస్ ప్రభావానికి లోనవుతునే ఉన్నారు. ఇప్పటికే ప్రపంచంలోని అన్ని దేశాలు కలిసి వైరస్ నివారణకు పోరాడటానికి కృషి చేస్తున్నాయి.
MOST READ:వైద్య పరికరాల తయారీలో నేనే సైతం అంటున్న మెర్సిడెస్ బెంజ్
దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ కూడా ఒక ప్రధాన నిర్ణయాన్ని ప్రకటించింది, త్వరలో 1 మిలియన్ (10 లక్షల) ఫేస్ మాస్క్లను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది.
MOST READ:కరోనాపై అవగాహన కల్పించడానికి కరోనా హెల్మెట్ ధరించిన పోలీస్