Just In
- 9 hrs ago రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- 12 hrs ago మార్కెట్లో వీటికి తిరుగే లేదు.. కొత్త బైక్ కొనాలనుకుంటే ఈ లిస్ట్ అస్సలు మిస్ అవ్వకండి
- 14 hrs ago వారెవ్వా.. యూట్యూబర్స్ వాడే కార్లు ఇలా ఉన్నాయా!.. ఓ లుక్కేసుకోండి
- 14 hrs ago రూ. 10 లక్షల లోపు ధరలో విడుదల కాబోతున్న ప్రముఖ బ్రాండ్ల కార్లు ఇవే..
Don't Miss
- News ప్రధాని మోడీకి బల్గేరియా అధ్యక్షుడు రుమెన్ స్పెషల్ థ్యాంక్స్: ఎందుకంటే?
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్పై వేటు!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Movies బెజవాడలో ఈవీఎంల ట్యాంపరింగ్.. క్రికెటర్ శ్రీశాంత్కు సంబంధమేమిటంటే?
- Finance IPO News: మార్కెట్లోకి రాకేష్ జున్జున్వాలా ఐపీవో.. డబ్బు రెడీ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు..
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
కరోనా నివారణకు 1,500 కోట్లు విరాళం ప్రకటించిన టాటా గ్రూప్స్
కరోనావైరస్ రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో దేశం మొత్తం లాక్ డౌన్ చేయబడింది. అంతే కాకుండా చాలా వాణిజ్య కార్యకలాపాలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా చాలామంది సినీ పరిశ్రమవారు, ఆటో మొబైల్ కంపెనీలకు చెందిన వారు చాలా పెద్దమొత్తంలో విరాళాలను అందిస్తున్నారు.
ఆటో మొబైల్ తయారీ సంస్థలు కరోనాకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రభుత్వాలకు మరియు వైద్య పరికరాలు తయారు చేసి ఇవ్వడంలో సహాయపడుతున్నాయి. దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన సంస్థలలో ఒకటైన టాటా గ్రూప్ కూడా కరోనాతో పోరాడటానికి భారీగా విరాళం ప్రకటించింది.
టాటా సన్స్ మరియు టాటా ట్రస్ట్ కలిసి వైద్య సదుపాయాలను చేకూర్చడానికి భారీగా రూ. 1,500 కోట్లు విరాళాలను ప్రకటించారు. ఇది వెంటిలేటర్, ఫేస్ మాస్క్, టెస్టింగ్ కిట్ వంటి వాటిని తయారు చేయడంలో ఉపయోగిస్తారు. దేశంలోని ప్రముఖ ఆటో తయారీ సంస్థలలో ఒకటైన బజాజ్ గ్రూప్ కూడా రూ. 100 కోట్ల రూపాయల విరాళం ప్రకటించబడింది.
200 మందికి పైగా ఎన్జీఓలు ఆరోగ్య శాఖ డిమాండ్లను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్న టెస్టింగ్ కిట్, వెంటిలేటర్ మరియు ఐసియు యూనిట్లతో ఆరోగ్య సదుపాయాలను కల్పిస్తామని ప్రకటించారు.
బజాజ్ మాత్రమే కాదు, ఎంజి మోటార్ కంపెనీ రూ. 2 కోట్లు విరాళంగా ఇస్తే వైద్య సేవలకు అవసరమైన పరికరాల ఉత్పత్తిని ప్రారంభిస్తామని మహీంద్రా, మారుతి సుజుకి ప్రకటించాయి.
చైనాలో ప్రారంభమై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన కరోనావైరస్ 6.30 మిలియన్లకు పైగా ప్రజలకు సోకింది మరియు 29,000 మందికి పైగా మరణించింది. అంతే కాకుండా రోజు రోజుకి మరింత ఎక్కువగా ఈ వైరస్ ప్రభావానికి లోనవుతునే ఉన్నారు. ఇప్పటికే ప్రపంచంలోని అన్ని దేశాలు కలిసి వైరస్ నివారణకు పోరాడటానికి కృషి చేస్తున్నాయి.
MOST READ:వైద్య పరికరాల తయారీలో నేనే సైతం అంటున్న మెర్సిడెస్ బెంజ్
దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ కూడా ఒక ప్రధాన నిర్ణయాన్ని ప్రకటించింది, త్వరలో 1 మిలియన్ (10 లక్షల) ఫేస్ మాస్క్లను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది.
MOST READ:కరోనాపై అవగాహన కల్పించడానికి కరోనా హెల్మెట్ ధరించిన పోలీస్