Just In
- 8 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 9 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 10 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 11 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
భారతదేశంలో సరికొత్త మైలురాయిని చేరుకున్న టాటా మోటార్స్!
భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ తయారీ కంపెనీల్లో ఒకటైన టాటా మోటార్స్, వాహనాల ఉత్పత్తిలో ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నట్లు ప్రకటించింది. భారతదేశంలో ఇప్పటి వరకూ 4 మిలియన్ ప్యాసింజర్ కార్లను ఉత్పత్తి చేసినట్లు కంపెనీ తెలిపింది. టాటా మోటార్స్ గడచిన మూడు దశాబ్దాలుగా ప్యాసింజర్ కార్లను ఉత్పత్తి చేస్తూ, దేశీయ మార్కెట్లో అనేక రకాల మోడళ్లను అందుబాటులోకి తెచ్చింది.
టాటా మోటార్స్ దేశంలో 4 మిలియన్ వాహనాల ఉత్పత్తి మైలురాయిని పురస్కరించుకొని కంపెనీ తమ వినియోగదారులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ #WeLoveYou4Million పేరిట కొత్త ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. టాటా మోటార్స్ 1991లో అప్పట్లో అత్యంత పాపులర్ వాహనాల్లో ఒకటైన టాటా సియెర్రాతో భారత్లో తమ ప్రయాణాన్ని ప్రారంభించింది.
టాటా ఇండికా, సియెర్రా మరియు సుమో వంటి ఇతర కార్లను ప్రవేశపెట్టడంతో, కంపెనీ 2005-06లో 1 మిలియన్ ప్యాసింజర్ వాహనాల ఉత్పత్తి మైలురాయిని చేరుకుంది. సరసమైన ప్రయాణీకుల కార్ల చరిత్రను తిరిగి రాసిన సఫారి మరియు టాటా నానో వంటి కార్లను ప్రవేశపెట్టిన తరువాత 2015లో టాటా మోటార్స్ తదుపరి 2 మిలియన్ల ఉత్పత్తిని అధిగమించింది.
MOST READ:చీపురు పట్టి రోడ్డు శుభ్రం చేసిన ట్రాఫిక్ పోలీస్.. ఎందుకో తెలుసా ?
టాటా నానో మార్కెట్లో ఎంట్రీ లెవల్ విభాగపు అవసరాలను తీర్చగా, భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన మొదటి లైఫ్స్టైల్ ఎస్యూవీలలో టాటా సఫారి ఒకటిగా నిలిచింది. కాగా ఇప్పుడు టాటా ప్రయాణీకుల విభాగం నుండి దేశంలో భారత ఆర్మీ వాహన సముదాయంలో భాగంగా చేరింది.
టాటా మోటార్స్ 2014లో ప్రవేశపెట్టిన బోల్ట్ మరియు జెస్ట్ వంటి వాహనాలు కంపెనీ ప్రోడక్ట్ లైనప్లో అతిపెద్ద పురోగతిని తెచ్చిపెట్టాయి. ఈ మోడళ్లకు సక్సెసర్లుగా వచ్చిన టాటా టియాగో, టిగోర్ మోడళ్లు కంపెనీ అమ్మకాలను పెంచడంలో సహకరించాయి.
MOST READ:ఇండియాలో మల్టీస్ట్రాడా 950 ఎస్ లాంచ్ డేట్ ఫిక్స్ చేసిన డుకాటీ, ఎప్పుడో తెలుసా?
ప్రస్తుతం టాటా మోటార్స్ భారత మార్కెట్లో టియాగో, టిగోర్, నెక్సాన్, హారియర్ మరియు ఆల్ట్రోజ్ కార్లు మాత్రమే ఉన్నాయి. ఇవి న్యూ ఫరెవర్ బిఎస్6 సిరీస్ ప్రోడక్ట్ లైనప్లో భాగంగా ఉన్నాయి. టాటా మోటార్స్ ఇప్పుడు తక్కువ సురక్షితమైన ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోను కలిగి ఉంది. టాటా మోటార్స్ 2015 మరియు 2020 మధ్య ఐదేళ్లలో 1 మిలియన్ కార్లను ఉత్పత్తి చేసింది.
టాటా మోటార్స్ నుండి అత్యధికంగా అమ్ముడుపోతున్న నెక్సాన్ కాంపాక్ట్ ఎస్యూవీ గ్లోబల్ ఎన్సిఎపి క్రాష్ టెస్ట్లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. ఈ క్రాష్ టెస్టులో 5కి 5 స్టార్లు తెచ్చుకున్న భారతదేశపు మొదటి కార్ల తయారీ సంస్థ కూడా టాటా మోటార్స్ కావటం విశేషం. అంతేకాకుండా, టాటా మోటార్స్ 67 శాతం మార్కెట్ వాటాతో భారతదేశంలో అతిపెద్ద ఈవీ (ఎలక్ట్రిక్ వాహన) తయారీదారుగా ఉంది.
MOST READ:నడి రోడ్డుపై పోలీస్ చెంప చెళ్లుమనిపించిన మహిళ.. ఎందుకో తెలుసా
గడచిన 3 దశాబ్దాలలో, టాటా మోటార్స్ అందించిన ఉత్పత్తులు ఎప్పటికప్పుడు మారుతు న్న టెక్నాలజీకి అనుగుణంగా గణనీయంగా అభివృద్ధి చెందాయి. డిజైన్, అభివృద్ధి, ధ్రువీకరణ మరియు ఉత్పాదక దశల నుండి స్వదేశీ సామర్థ్యాలను అభివృద్ధి చేసిన మొదటి భారతీయ సంస్థ టాటా మోటార్స్. ఈ కంపెనీ ఒకే రూఫ్ క్రింద అమ్మకాలు మరియు సేవా కార్యకలాపాలను అందిస్తోంది.
టాటా మోటార్స్ ఇన్-హౌస్ డిజైన్ మరియు సిమ్యులేషన్ స్టూడియోలను కలిగి ఉంది, ఇవి వేగవంతమైన ప్రోటోటైపింగ్, డిజిటల్ ఉత్పత్తి అభివృద్ధి, పూర్తిస్థాయి ఎమిషన్ టెస్టింగ్ సదుపాయాలు మరియు క్రాష్ టెస్ట్ సదుపాయాన్ని అమలు చేస్తాయి. టాటా మోటార్స్ పూణేలోని చిఖాలిలో, గుజరాత్లో సనంద్ మరియు పూణేలోని రంజాంగావ్ వద్ద FIAPL ప్లాంట్ వంటి అత్యాధునిక ఉత్పాదక సదుపాయాలను కలిగి ఉంది.
MOST READ:ఎలక్ట్రిక్ వాహనాన్ని డ్రైవ్ చేసిన మైనర్ బాలుడు.. తర్వాత ఏం జరిగిందో తెలుసా ?
ఈ చారిత్రాత్మక సంఘటన గురించి టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ, "భారతదేశంలో వృద్ధి చెందిన స్వదేశీ ఆటోమోటివ్ బ్రాండ్గా, మా ప్రయాణీకుల వాహనాల విభాగానికి ఈ ప్రముఖ మైలురాయిని చేరుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. టాటా మోటార్స్ ప్రారంభమైనప్పటి నుండి నిబద్ధతగా 'అత్యుత్తమ తరగతి భద్రత, డిజైన్ మరియు పనితీరు కలిగిన ఉత్పత్తులను పరిచయం చేయడంలో మా ఛైర్మన్ ఎమెరిటస్ మిస్టర్ రతన్ టాటా గారి దృష్టిని జీవం పోసింది."
"గత 30 ఏళ్లుగా, మేము కస్టమర్ అవసరాలను తీర్చడానికి మాత్రమే కాకుండా, ఆయా విభాగాలలో కొత్త బెంచ్మార్క్లను కూడా ఏర్పాటు చేసిన ఐకాన్లను రూపొందించాము. మా "న్యూ ఫరెవర్" రేంజ్ ప్యాసింజర్ వాహనాలే కస్టమర్లపై మాకున్న నిబద్ధతను మరింత బలపరుస్తాయి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండేందుకు ఈవీలతో కూడా సుస్థిరత ప్రయాణాన్ని ప్రారంభించాము మరియు స్థిరమైన రవాణా వైపు భారతదేశ ప్రయాణాన్ని నడిపిస్తున్నాము" అని అన్నారు.
టాటా మోటార్స్ 4 మిలియన్ ఉత్పత్తి మైలురాయిపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
టాటా మోటార్స్ గత కొన్ని సంవత్సరాలుగా డిజైన్ మరియు ఫీచర్ల పరంగా చాలా అడ్వాన్స్డ్ అయిందనే చెప్పాలి. కంపెనీ తమ ప్యాసింజర్ కార్ల డిజైన్ మరియు ఎక్స్పీరియెన్స్ను గణనీయంగా పెంచింది. ప్రస్తుత 2020 సంవత్సరం టాటా మోటార్స్కు నిశ్శబ్ద సంవత్సరంగా ఉన్నప్పటికీ, బ్రాండ్ నుండి వచ్చే ఏడాది అనేక కొత్త మోడళ్లు విడుదలయ్యే అవకాశం ఉంది.