Just In
- 11 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 12 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 13 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 14 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Movies Guppedantha Manasu March 29th: మను ఇక్కడే ఉంటాడంటున్న వసు.. వద్దంటూ గొడవ చేస్తున్న అనుపమ!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బ్రేకింగ్ న్యూస్.. ఉబర్ సేవలు ఇకపై వీరికి మాత్రమే
భారతదేశంలో కరోనా ఎక్కువగా విస్తరిస్తున్న కారణంగా భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించబడింది. ప్రస్తుతం ఇండియాలో లాక్ డౌన్ రెండవ దశ అమలులో ఉంది. ఇది 2020 మే 03 వరకు రెండవ దశ లాక్ డౌన్ ఉంటుంది. బహుశా కరోనా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో మే 03 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో చాలా ఆటో సంస్థలు ప్రభుత్వానికి మద్దతుగా చెస్థులు కలిపాయి. ఇందులో భాగంగా ప్రజలకు తమ సేవలను అందిస్తున్నాయి. ఈ లాక్ డౌన్ లో రాత్రి పగలు ఎక్కువగా శ్రమిస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు ఉబర్ తన సేవలను అందించడానికి ముందుకు వచ్చింది.
ఉబర్ మెడికల్ సర్వీస్ ద్వారా అత్యవసర సేవలను అందించడానికి మహారాష్ట్ర ప్రభుత్వానికి రూ. 1 కోట్ల ఉచిత సేవలను అందించనుంది. కరోనాకు చికిత్స చేస్తున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బంది మరియు ప్రభుత్వ అధికారులకు ఉబర్ ఈ ఉచిత సేవను అందించనుంది.
అంతే కాకుండా ఉబర్ ఇతర అవసరమైన వస్తువులను సరఫరా చేయనున్నట్లు కూడా ప్రకటించింది. ఆరోగ్య సేవల్లో ఉపయోగం కోసం ఈ ఉబర్ వాహనాలు ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. డ్రైవర్ మరియు ప్రయాణీకుల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ఉబర్ మెడిక్ టాక్సీ కారు పైకప్పు నుండి నేల వరకు ప్లాస్టిక్ షీట్లను ఏర్పాటు చేసింది.
MOST READ:భారత్ లో ప్రారంభం కానున్న నెక్జు మొబిలిటీ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్
దీని గురించి ఉబెర్ సీఈఓ దారా ఖోస్రోషాహి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్త ఉబర్ వాహనాలు దాదాపు 10 మిలియన్ ఉచిత రైడ్లు మరియు ఫుడ్ డెలివరీ చేయడానికి తమ సేవలను అందిస్తోంది.
డ్రైవర్లకు భద్రతను అందించడానికి భద్రతా విధానాలలో కూడా శిక్షణ పొందుతారు మరియు ప్రతి ట్రిప్ మధ్య కార్లను స్వైప్ చేయడానికి శానిటైజర్లు మరియు క్రిమిసంహారక మందులు అందించనున్నారు.
MOST READ:లారా దత్త రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడపడం చూసారా ?
లాక్ డౌన్ సమయంలో ఉబర్ తన డ్రైవర్లు మరియు క్యాబ్ భాగస్వాములకు సహాయం చేయడానికి డ్రైవర్ కేర్ ఫండ్ను సృష్టించింది. ఈ ఫండ్ ద్వారా కంపెనీ దేశంలోని 55,000 మంది ఉబెర్ డ్రైవర్లకు దాదాపు రూ. 20 కోట్లు కేటాయించనుంది.
ఈ నిధిని రూ. 50 కోట్లకు పెంచాలని ఉబర్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వారం చివరి నాటికి రూ. 20 కోట్లు సమీకరించనున్నట్లు ఉబర్ సెంట్రల్ ఆపరేషన్స్ హెడ్ పవన్ వైష్ తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని డబ్బును సమీకరిస్తామని కూడా చెప్పారు.
MOST READ:గుడ్ న్యూస్.. త్వరలో లాంచ్ కానున్న ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్
దేశవ్యాప్తంగా అమలులో ఉన్న లాక్ డౌన్ నుంచి ఆరోగ్య సంరక్షణ, బ్యాంకింగ్ మరియు మీడియా వంటి అవసరమైన సేవలకు మినహాయింపు ఇస్తుంది. ఓలా మరియు ఉబర్ సేవలను రద్దు చేశాయి, కాబట్టి ఈ సంస్థల ఆదాయం నిలిచిపోయింది. కాకపోతే ఈ సేవలు ఆరోగ్య కార్యకర్తల కోసం మరియు అత్యవసర సమయాల్లో రోగులను తరలించడానికి కూడా ఉబర్ తమ సేవలను కొనసాగిస్తోంది.