Just In
- 1 hr ago మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- 14 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 18 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 20 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
Don't Miss
- News అభ్యర్దుల మార్పు పై చంద్రబాబు కీలక నిర్ణయం - ఆ నేతలకు పిలుపు..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Movies Karthika Deepam 2 April 20th: దీపపై పగతో రగిలిపోతున్న నర్సింహ.. శౌర్యని ఇక్కడే చదివిస్తానంటున్న దశరద్!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
జాతీయ రహదారుల నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించిన కేంద్ర ప్రభుత్వం, ఎందుకో తెలుసా..?
భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 1.50 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంటోంది.
సాధారణంగా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించటానికి వీలుగా కొత్త మోటారు వాహన చట్టం 2019 సెప్టెంబర్లో అమలులోకి వచ్చింది.
2019 కొత్త మోటార్ వాహన చట్టం యొక్క కొత్త నిబంధనల ప్రకారం, ట్రాఫిక్ ఉల్లంఘించినవారికి భారీ జరిమానా విధించబడుతుంది. దీనివల్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు కొంతవరకు తగ్గాయి.
MOST READ:హార్లే డేవిడ్సన్ స్ట్రీట్ 750 బైకులపై భారీ డిస్కౌంట్
భారతదేశంలో రోడ్డు ప్రమాదాలకు కారణం ట్రాఫిక్ ఉల్లంఘనలు మాత్రమే కాదు, రోడ్డు ప్రమాదాలు జరగడానికి మరో ప్రధాన కారణం ఉంది. అవి సరైన రోడ్లు లేకపోవడం లేక క్షీణించిన రోడ్లు. కాబట్టి నాణ్యమైన రోడ్ల నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ చూపుతోంది. రహదారి నిర్మాణం వెనుక ప్రధాన లక్ష్యం ఏమిటంటే ప్రమాదాలను నివారించడం మరియు దేశ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం.
దేశ ఆర్థికాభివృద్ధిలో రోడ్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) 2019-20 ఆర్థిక సంవత్సరంలో 3,979 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించింది. ఇంతకు ముందెన్నడూ ఇంత పొడవైన రోడ్లు నిర్మించలేదు. కాబట్టి ఇది ఒక గొప్ప విజయంగా పరిగణించబడుతుంది.
MOST READ:కరోనా రోగుల కోసం డ్రైవ్-త్రూ టెస్టింగ్ సౌకర్యం, ఎక్కడో తెలుసా..?
గతంలో 2018-19 ఆర్థిక సంవత్సరంలో 3,380 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించారు. జాతీయ రహదారుల నిర్మాణం ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రహదారి రవాణా, రహదారుల శాఖ ప్రతిరోజూ 60 కిలోమీటర్ల రహదారులను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం తెలియజేశారు.
కోవిడ్ -19 వైరస్ వ్యాప్తి తరువాత దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడం కోసం జాతీయ రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఆర్థిక వ్యవస్థను పెంచడానికి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని నితిన్ గడ్కరీ అన్నారు.
MOST READ:ప్రముఖ హీరోయిన్స్ ఉపయోగించే 1990 నాటి లగ్జరీ కార్లు
దీని గురించి మాట్లాడుతూ నితిన్ గడ్కరీ 30 కిలోమీటర్ల పొడవైన రోడ్లు నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, అంతే కాకుండా రోజుకి 60 కిలోమీటర్ల 60 కిలోమీటర్ల పొడవైన రహదారిని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము అని ఆయన చెప్పారు.
మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వల్ల దేశంలో ఉద్యోగావకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. కోవిడ్ -19 వైరస్ ప్రపంచంలోని అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది.
MOST READ:లాక్డౌన్ లో కర్ఫ్యూ పాస్ పొందాలనుకుంటున్నారా, అయితే ఇలా చేయండి