Just In
Don't Miss
- News ముస్లింలోను ఓబీసీ జాబితాలో చేర్చిన ప్రభుత్వం
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Finance Railway News: రైలు ప్రయాణికులకు శుభవార్త..! టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు తగ్గింపు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Movies నాతో ఆ పని చేస్తావా? ఒక రాత్రికి ఎంత తీసుకుంటావ్.. జబర్ధస్త్ బ్యూటీ ఏమన్నదో చూశారంటే!
ఫోక్స్వ్యాగన్ కస్టమర్ టచ్ పాయింట్ ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా.. ఎక్కడో తెలుసా?
ప్రముఖ వాహన తయారీ సంస్థ ఫోక్స్వ్యాగన్ ఇండియా హైదరాబాద్లోని మెహదీపట్నం వద్ద కొత్త కస్టమర్ టచ్పాయింట్ను ప్రారంభించింది. ఈ కొత్త కస్టమర్ టచ్ పాయింట్ జ్యోతి నగర్ వద్ద ఉంది. ఈ కొత్త 3 ఎస్ స్పెషలిటీ ఆటో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ నిహార్ మోడి నాయకత్వంలో నడుస్తుంది.
కొత్త కస్టమర్ టచ్పాయింట్ను ప్రారంభించడం గురించి ఆటో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ నిహార్ మోడి మాట్లాడుతూ, "తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని మా నెట్వర్క్ను ఫోక్స్వ్యాగన్ మెహదీపట్నం చేర్చడంతో, మా వినియోగదారులకు మరింత అందుబాటులో ఉంటుందని మేము భావిస్తున్నాము.
మా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్, ఇంటిగ్రేటెడ్ సేల్స్ అండ్ సర్వీస్ స్పెషలిటీ, మా కస్టమర్లకు వారి సౌలభ్యం మరియు అమ్మకాలను మెరుగుపరచడానికి మరియు మెయింటెనెన్స్ సర్వీస్ పొందటానికి వీలు కల్పిస్తుంది.
MOST READ:బ్రేకింగ్ న్యూస్.. త్వరలో పెరగనున్న మహీంద్రా థార్ ధర : వివరాలు
ఫోక్స్వ్యాగన్ ప్రారంభించిన ఈ కొత్త సదుపాయంలో 3 కార్ల ప్రదర్శన ఉంటుంది, ఇది కొత్త మరియు వాడిన కార్ల విభాగంలో వినియోగదారులకు సరికొత్త ఉత్పత్తి సమర్పణలను ప్రదర్శించడంలో సహాయపడుతుంది. ఈ సౌకర్యం అమ్మకాల తర్వాత సర్వీస్ అందిస్తుంది, ఇందులో మెయింటెనెన్స్ మరియు స్పైర్ పార్ట్శ్ ఉంటాయి.
అన్ని మరమ్మత్తు మరియు నిర్వహణ పనులు కస్టమర్ సౌలభ్యం మరియు మద్దతు కోసం అత్యంత నైపుణ్యం మరియు శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులచే చేయబడతాయి. వోక్స్వ్యాగన్ ఇండియాకు దేశవ్యాప్తంగా 137 సేల్స్ మరియు 116 సర్వీస్ టచ్ పాయింట్లు ఉన్నాయి. అంతే కాకుండా 2020 చివరి నాటికి వీటిని 150 కి పెంచాలని కంపెనీ యోచిస్తోంది.
MOST READ:టాటా మోటార్స్ కొత్త స్టైల్లో పరిచయం చేసిన సేఫ్టీ బబుల్ ; ఎందుకో తెలుసా !
ఈ కొత్త సదుపాయాన్ని ప్రారంభించడంపై వోక్స్వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా బ్రాండ్ హెడ్ ఆశిష్ గుప్తా మాట్లాడుతూ, "హైదరాబాద్ లోని మెహదీపట్నం వద్ద కొత్త సదుపాయాన్ని ప్రారంభించడంతో, దేశవ్యాప్తంగా మా కస్టమర్ టచ్ పాయింట్లను విస్తరించడానికి వోక్స్వ్యాగన్ ట్రాక్లో ఉంది.
వచ్చే ఏడాది టైగన్ ప్రారంభించటానికి కంపెనీ సన్నాహాలను సిద్ధం చేస్తోంది. మా కస్టమర్లకు అనుకూలమైన వాటిని ప్రవేశపెట్టడానికి మేము నిర్విరామంగా కృషి చేస్తున్నాము.
ఈ కొత్త సర్వీస్ పాయింట్ దక్షిణ ప్రాంతంలోని మా వినియోగదారులకు అద్భుతమైన అమ్మకాలు మరియు సేవా అనుభవాన్ని అందించగలమని మేము భావిస్తున్నాము. ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాలలో వోక్స్వ్యాగన్ టచ్ పాయింట్ ప్రారంభించడం వల్ల వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. దీని వల్ల కంపెనీ యొక్క అమ్మకాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
MOST READ:బెంగళూరు నుంచి శాన్ఫ్రాన్సిస్కో డైరెక్ట్ ప్లైట్ సర్వీస్.. ఎప్పటినుంచే తెలుసా ?