Just In
- 8 min ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- 14 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 15 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 17 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
Don't Miss
- Movies సుడిగాలి సుధీర్ అమ్మాయిల పిచ్చోడా? జబర్దస్త్ కమెడియన్ ఘాటుగా రియాక్షన్!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మీకు తెలుసా.. అపోలో టైర్స్ కంపెనీ ఇప్పుడు మన చిత్తూరులో
దేశీయ మార్కెట్లో ప్రముఖ టైర్ తయారీ సంస్థ అపోలో టైర్స్ కొత్త ఉత్పత్తి యూనిట్లలో భారీగా పెట్టుబడులు తగిన సన్నాహాలకు ఎదురుచూస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల కంపెనీ తన 7 వ టైర్ తయారీ కర్మాగారాన్ని అధికారికంగా ప్రారంభించింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో టైర్లకు భారీగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కొత్త వాహనాల అమ్మకాలలో భారీ వృద్ధితో, అపోలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన 7 వ యూనిట్ టైర్ ఉత్పత్తిని ప్రవేశపెట్టడంతో విదేశీ వ్యాపారంలో పోటీ పడాలని చూస్తోంది.
అపోలో టైర్స్ ఇప్పటికే కొత్త ఉత్పాదక కర్మాగారాలను కలిగి ఉంది. అపోలో టైర్స్ ప్రస్తుతం మొత్తం ఏడు టైర్ తయారీ యూనిట్లను కలిగి ఉంది. ఏడవ యూనిట్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు సమీపంలో ప్రారంభించబడింది.
MOST READ:గ్రామీణ ప్రజల కోసం 'మొబైల్ మెడికల్ వ్యాన్లు' ప్రారంభించిన హ్యుందాయ్: వివరాలు
ప్రపంచవ్యాప్తంగా అపోలో టైర్ కంపెనీలు మొత్తం 7 ఉన్నాయి. ఇందులో భారతదేశంలో మొత్తం 5 యూనిట్లు ఉన్నాయి. మిగిలిన రెండు కర్మాగారాలు ఒకటి ఆఫ్రికాలో మరొకటి ఐరోపాలో ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించిన ఈ కొత్త ప్లాంట్ చిత్తూరు జిల్లాలోని చిన్నపూర్ వద్ద ఉంది.
ఈ కొత్త ప్లాంట్ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. ఇది మొత్తం 256 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. ఈ కొత్త ప్లాంట్లో నెలకు కనీసం 5 లక్షల టైర్లను ఉత్పత్తి చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. 2022 చివరి నాటికి కొత్త ప్లాంట్లో 15 వేల ప్యాసింజర్ టైర్లు, 3000 ట్రక్ టైర్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
MOST READ:ప్రవహించే నదిలో మహీంద్రా ఎక్స్యూవీ300; వైరల్ అవుతున్న వీడియో
2016 మరియు 2017 ఆర్థిక సంవత్సరంలో కొత్త టైర్ యూనిట్ నిర్మాణం ప్రారంభించిన సంస్థ ఇప్పుడు నిర్మాణం పూర్తి చేసి ట్రక్ టైర్ ఉత్పత్తితో ముందుకు సాగే పనిలో ఉంది. ప్రారంభంలో కొత్త ప్లాంట్ను రూ. 1,800 కోట్ల వ్యయంతో 200 ఎకరాల్లో నిర్మించాలని యోచిస్తున్నారు.
ప్రస్తుతం టైర్ల డిమాండ్కు అనుగుణంగా 56 కాస్టింగ్ ఏరియాలు ఉన్న కొత్త యూనిట్కు రూ. 3,800 కోట్లు వెచ్చించనున్నారు. మాడ్యులర్ లేఅవుట్ కోసం ప్లాంట్ గ్రౌండ్-అప్ నుండి నిర్మించబడింది. ఈ సౌకర్యం వద్ద ఉన్న సామర్థ్యాన్ని తక్కువ సంఖ్యలో ఇంజనీరింగ్ సవాళ్లు మరియు తదుపరి పెట్టుబడులతో ప్రతిబింబించడానికి మరియు మార్చడానికి ఇది అనుమతిస్తుంది.
MOST READ:అమాంతం పెరుగుతున్న పెట్రోల్ & డీజిల్ ధరలు.. పెరిగిన ధరల వివరాలు ఇక్కడ చూడండి
భారతదేశంలో వాణిజ్య టైర్ రంగంలో అపోలో మార్కెట్ లీడర్, దేశంలో మొత్తం వాణిజ్య టైర్ అమ్మకాల్లో అపోలో టైర్ కంపెనీ దాదాపు 60% వాటాను కలిగి ఉంది. ఇప్పుడు ప్రారంభంభం కానున్న ఈ కొత్త ప్లాంట్ డిమాండ్ను తీర్చడంలో మరియు అపోలో మార్కెట్ స్థితిని మరింత బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. భారతీయ మార్కెట్ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో బ్రాండ్ వృద్ధికి ఈ కొత్త ప్లాంట్ ఒక బలమైన పునాది అవుతుంది.