Just In
- 10 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 13 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 16 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 19 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బిఎమ్డబ్ల్యూ ఎకో ఫ్రెండ్లీ టైర్స్: ఎక్కువ మన్నిక మరియు పర్యావరణానికి కూడా సేఫ్!
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్డబ్ల్యూ ఇకపై భవిష్యత్తులో తమ కార్లలో ఉపయోగించే ప్రామాణిక టైర్ల స్థానంలో అధునాతన ఎకో ఫ్రెండ్లీ టైర్లను ఉపయోగించనున్నట్లు పేర్కొంది. ఎక్కువ కాలం మన్నేలా మరియు పర్యావరణంపై తక్కువ దష్ప్రాభావం చూపేలా ఈ టైర్లను రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది.
టైర్ల తయారీలో పేరు గాంచిన పీరెల్లి సంస్థ బిఎమ్డబ్ల్యూ కోసం న్యాచురల్ రబ్బర్తో ఎకో ఫ్రెండ్లీ టైర్లను రూపొందించింది. ఈ ఏడాది ఆగస్ట్ నాటికి మార్కెట్లోకి రానున్న బిఎమ్డబ్ల్యూ ఎక్స్5 ఎక్స్డ్రైవ్45ఈ ప్లగ్-ఇన్-హైబ్రిడ్ కారులో ఈ పీరెల్లీ 22 ఇంచ్ ఎకో ఫ్రెండ్లీ టైర్లను ఉపయోగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
అంతేకాదు, పరిశ్రమలో ఇలాంటి ఎకో ఫ్రెండ్లీ టైర్లను ఉపయోగిస్తున్న మొట్టమొదటి కంపెనీ కూడా బిఎమ్డబ్ల్యూ కావటం విశేషం. సర్టిఫైడ్ నేచురల్ రబ్బరుతో తయారు చేసిన టైర్ల వాడకం మన పరిశ్రమకు ప్రముఖ విజయమని కంపెనీ పేర్కొంది.
ఈ విధంగా తాము వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి జీవవైవిధ్యం మరియు అడవులను సంరక్షించడానికి తమ వంతు సహాయం చేస్తున్నామని బిఎమ్డబ్ల్యూ తెలిపింది. ఈ కొత్త 22 ఇంచ్ పి జీరో టైర్లు ఇప్పుడు ఫారెస్ట్ స్టీవార్డ్ షిప్ కౌన్సిల్ (ఎఫ్ఎస్సి) లేబుల్ అందుకున్న ప్రపంచంలోనే మొదటి టైర్లుగా మారాయి.
ఎఫ్ఎస్సి అనేది సహజ రబ్బరుతో తయారైన ఉత్పత్తులకు ధృవీకరణ ప్రమాణాలను అందించే స్వతంత్ర సంస్థ. ఈ ధృవీకరణ సాధించడానికి, పీరెల్లి తమ అమెరికన్ ప్లాంట్లో ఎఫ్ఎస్సి సర్టిఫైడ్ నేచురల్ రబ్బరు మరియు రేయాన్ను ఉపయోగించి ఈ టైర్లను తయారు చేసింది.
బిఎమ్డబ్ల్యూ కోసం పీరెల్లి పంపిణీ చేసిన ఈ టైర్లు, కంపెనీ యొక్క కఠినమైన పనితీరు అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేయబడ్డాయి. ముఖ్యంగా ఇవి తక్కువ రోలింగ్ నిరోధకతను మరియు తక్కువ స్థాయిలో శబ్ధాన్ని విడుదల చేస్తాయి.
ఈ సంస్థ చాలా సంవత్సరాలుగా ఎఫ్ఎస్సి సంస్థతో కలిసి పనిచేస్తోంది. బిఎమ్డబ్ల్యూ ఐ3 లో కూడా ఎఫ్ఎస్సి-సర్టిఫైడ్ కలపను ఉపయోగించారు. ఇది మొదటిసారి 2013లో మార్కెట్లో ప్రారంభించబడింది. ఈ సర్టిఫైడ్ కలప రాబోయే బిఎమ్డబ్ల్యూ ఐఎక్స్ కారులో కూడా ఉపయోగించబడుతుంది.
బిఎమ్డబ్ల్యూ ఎక్స్5 విషయానికి వస్తే, కంపెనీ ఈ బిఎమ్డబ్ల్యూ ఎక్స్5 ఎక్స్డ్రైవ్45ఈ కోసం పూర్తి జీవితచక్ర సిఓ2 ధృవీకరణను పూర్తి చేసినట్లు తెలిపింది. ఈ రోజుల్లో ప్రతి పెద్ద ఆటోమొబైల్ సంస్థ కుడా ఎలక్ట్రిక్ వాహనాలతో పాటుగా విభిన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇదే బాటను ఇప్పుడు చిన్న కంపెనీలు కూడా అనుసరిస్తున్నాయి.