Just In
- 34 min ago కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (వీడియో)
- 1 hr ago టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- 2 hrs ago ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- 3 hrs ago దిశా పటానీ కార్ల ప్రపంచం చూసారా.. చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే..
Don't Miss
- News అష్టదిగ్బంధనం - బీఆర్ఎస్ భవిష్యత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
- Movies Till Square Review: నాన్ స్టాప్ ఫన్ అండ్ లాఫింగ్ రైడ్.. టిల్లు స్క్వేర్ మూవీ రివ్యూ!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
షాకింగ్ న్యూస్.. చిప్ కొరత కారణంగా సంచలన నిర్ణయం తీసుకున్న BMW.. అదేంటో తెలుసా?
కరోనా మహమ్మారి ప్రభావం కొంతవరకు తగ్గుముఖం పట్టి ఆటో మొబైల్ పరిశ్రమలు మళ్ళీ సాధారణ స్థాయికి వచ్చే తరుణంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్ల తయారీదారులు చిప్ కొరతతో పోరాడుతున్నారు. ఇది నిజంగా దురదృష్టకరం అనే చెప్పాలి. ఈ కారణంగా ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ బిఎండబ్ల్యు (BMW) ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
ప్రస్తుతం ప్రపంచ ఆటో మొబైల్ పరిశ్రమ ఎదుర్కొంటున్న చిప్ కొరత కారణంగా బిఎండబ్ల్యు దాని కొన్ని మోడళ్ల నుండి టచ్స్క్రీన్ ఫంక్షన్ను తాత్కాలికంగా తీసివేయనుంది. ఇప్పటికే చాలామంది వాహన తయారీదారులు గత కొన్ని నెలలుగా తీవ్రమైన చిప్ కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ కారణంగా కార్ డెలివరీలు నిరంతరం ఆలస్యం అవుతున్నాయి.
అంతే కాకుండా కొన్ని పరికరాల కారణంగా కార్లు డెలివరీ పూర్తిగా నిలిపివేయబడుతుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కార్ల విక్రయాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. అయితే ఈ సమస్యను బిఎండబ్ల్యు కంపెనీ ఎదుర్కోవడానికి తన సొంత మార్గాన్ని ఎంచుకుంది. ఇందులో భాగంగానే ప్రస్తుత ఉత్పత్తి స్థాయిని కొనసాగించడానికి అనేక మోడళ్లలో టచ్స్క్రీన్ ఫంక్షన్ను తొలగిస్తోంది.
బిఎండబ్ల్యు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల, కంపెనీ తన మోడళ్లను ఈ టచ్స్క్రీన్ ఫంక్షన్ లేకుండానే డెలివరీ చేయనుంది. ఇందులో భాగంగానే బీఎండబ్ల్యూ కంపెనీ ప్రస్తుతం టచ్స్క్రీన్ లేకుండా బీఎండబ్ల్యూ 3 సిరీస్, ఎక్స్5, ఎక్స్6, ఎక్స్7 మరియు జెడ్4 వంటి మోడళ్లను డెలివరీ చేయనుంది.
అంతే కాకుండా కంపెనీ వాటితో పాటు, BMW 4 సిరీస్ కూపే, కన్వర్టిబుల్ మరియు గ్రెయిన్ కూపే వంటి మోడల్స్ కూడా కొంతకాలం టచ్స్క్రీన్ ఫీచర్ను తీసివేయడానికి పూనుకుంది. కావున ఈ ఫీచర్ లేని కారణంగా, కార్లలో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ను ఆపరేట్ చేయడానికి కస్టమర్లు సెంటర్ కన్సోల్ యొక్క iDrive కంట్రోలర్ను ఉపయోగించాల్సి ఉంటుంది.
బిఎండబ్ల్యు వినియోగదారులు పార్కింగ్ అసిస్ట్ ప్యాకేజీని ఎంచుకున్నప్పుడు BMW బ్యాకప్ అసిస్టెంట్ కూడా అందుబాటులో ఉండదు. ఈ ఫీచర్ సహాయంతో, కారు తిరిగి వచ్చిన మార్గంలో ఆటోమేటిక్గా రివర్స్ అవుతుంది. ఇప్పుడు ఈ కారు కస్టమర్లకు కూడా డబ్బు అందుతుందా లేదా అనే దాని గురించి ఎటువంటి అధికారిక సమాచారం అందలేదు.
సెమీకండక్టర్ చిప్లు ఆటోమొబైల్ పరిశ్రమలో ముఖ్యమైన భాగంగా మారాయి. కావున ఇవి లేకపోతే ఉత్పత్తి కూడా చాలా వరకు నిలిచిపోతుంది. వాహనాల్లో సెమీకండక్టర్ చిప్ల వినియోగం ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. కొత్త వాహనాలు వేగంగా మరింత ఎలక్ట్రానిక్ ఫీచర్లతో అమర్చబడుతున్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ, డ్రైవర్-అసిస్ట్ ఫీచర్స్, నావిగేషన్ మెటీరియల్స్ మరియు హైబ్రిడ్-ఎలక్ట్రిక్ సిస్టమ్లు వంటి అన్నింటిలోనూ ఈ చిప్లు చాలా అవసరం.
సెమీకండక్టర్ చిప్లు లేకపోతే కార్లలో ఆధునిక ఫీచర్స్ ఎక్కువగా అందుబాటులో ఉండవు. అయితే ప్రపంచం అభివృద్ధిచెందుతున్న తరుణంలో ఆధునిక ఫీచర్స్ చాలా అవసరం, ఈ ఆధునిక ఫీచర్స్ ఉన్న వాహనాలను ఎక్కువమంది వినియోగదారులు కొనుగోలుచేయడానికి ఆసక్తి చూపుతారు.
ప్రపంచ కార్ల తయారీదారులతో పాటు, భారతీయ కార్ కంపెనీలు కూడా ఈ సెమీకండక్టర్ల కొరతను ఎదుర్కొంటున్నాయనే విషయం అందరికి తెలుసు. భారతదేశంలో మారుతీ సుజుకీతో పాటు, టాటా మోటార్స్, మహీంద్రా మరియు టయోటా వంటి పెద్ద కంపెనీలు సెమీకండక్టర్ (చిప్) కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ కారణంగానే కొత్త వాహనాల కోసం వెయిటింగ్ పీరియడ్ పెరుగుతుండడంతో పాటు పండుగ సీజన్పై కూడా తీవ్ర ప్రభావం పడింది. అంతే కాకుండా ఇది కంపెనీల యొక్క అమ్మకాలపైన కూడా ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే పరిస్థితి మరింత తీవ్రతరం అవుతుంది.
ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని చిప్ల కొరతను అధిగమించేందుకు కంపెనీలు తమ ఉత్పత్తులను సవరించడంతోపాటు సెమీకండక్టర్ తయారీదారుల నుంచి నేరుగా చిప్లను కొనుగోలు చేసే పద్ధతిని అవలంబిస్తున్నాయి. ఇది మాత్రమే కాకుండా, కంపెనీలు చిప్ను మార్చడం ద్వారా లేదా బదులుగా ఇతర చిప్లను ఉపయోగించడం ద్వారా చిప్ కొరతను కొంతవరకు తగ్గించుకుంటున్నారు.
ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమలో ఎలక్ట్రానిక్ చిప్ల కొరత వాహనాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తోంది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ చిప్ల కొరత కారణంగా యూరప్, అమెరికా మరియు ఆసియా వంటి దేశాల్లో వాహనాల తయారీ చాలా వరకు తగ్గిపోతోంది. ఇటువంటి పరిస్థితిలో, కొత్త కారు బుక్ చేసుకునే వారు మరియు డెలివరి చేసుకునే వారు కొత్త కారుని పొందటానికి ఎక్కువ కాలం వేచి ఉండక తప్పదు.
ప్రస్తుతం బిఎండబ్ల్యు కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కస్టమర్లు ఎలా స్వాగతిస్తారో ఖచ్చితంగా తెలియదు. కావున ఈ పరిస్థితి ఎలా ఉండబోతుందో ముందు ముందు తెలుస్తుంది. ఇదివరకే మహీంద్రా కంపెనీ కూడా తన వాహనాలను టచ్స్క్రీన్లు లేకుండా డీలర్షిప్లకు పంపిణీ చేసింది. అయితే అవి నిలిపివేయబడ్డాయి, కావున బిఎండబ్ల్యు పరిస్థితి ఎలా ఉంటుందో త్వరలో తెలుస్తుంది.