Just In
- 39 min ago త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- 3 hrs ago హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- 4 hrs ago JNCAP క్రాష్ టెస్ట్లో అదరగొట్టిన స్విఫ్ట్.. స్కోర్ ఎంతో తెలుసా?
- 4 hrs ago కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
Don't Miss
- Sports IPL 2024: ధోనీపై గంభీర్ అక్కసు.. మండిపడుతున్న చెన్నై ఫ్యాన్స్!
- News అపార్ట్ మెంట్ లో మహిళ స్నానం చేస్తుంటే సెక్యూరిటీ గార్డు ?, పిల్లర్ కు కట్టేసి పిండేసి, అంతే !
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Movies నాగార్జున ఇంటికి కోడలుగా రాబోతున్న మరో హీరోయిన్
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
రైల్వే స్టేషన్ల వద్ద ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ పాయింట్ల ఏర్పాటు చేసిన మెజెంటా!
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ వేగంగా విస్తరిస్తోంది. దీనికి తగినట్లుగానే దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం చార్జింగ్ మౌళిక సదుపాయాలు కూడా మెరుగుపడుతున్నాయి. తాజాగా, భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ ఛార్జ్ పాయింట్ ఆపరేటర్ అయిన మెజెంటా మరియు సెంట్రల్ రైల్వేలు సంస్థలు కలిసి ఇప్పుడు రైల్వే స్టేషన్ల వద్ద EV ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం ప్రారంభించాయి. ఈ తరహా మొదటి చార్జింగ్ స్టేషన్ ను పరేల్ రైల్వే స్టేషన్ వద్ద ఏర్పాటు చేశారు.
పరేల్ వద్ద ఏర్పాటు ఛార్జింగ్ స్టేషన్లను భారత ప్రభుత్వ పరిశ్రమ మరియు మైనింగ్ మంత్రి సుభాష్ దేశాయ్ ప్రారంభించారు. పరేల్ రైల్వే స్టేషన్లోని కొత్త పబ్లిక్ ఛార్జింగ్ సిస్టమ్ స్ట్రీట్ లైట్ ఇంటిగ్రేటెడ్ EV ఛార్జింగ్ స్టేషన్లను కలిగి ఉంది. పరేల్లోని ఛార్జింగ్ స్టేషన్లు భవిష్యత్తులో అధిక వేగంతో ఛార్జింగ్ చేయడానికి DC ఫాస్ట్ ఛార్జర్లను కూడా కలిగి ఉంటాయి. మెజెంటా మరియు సెంట్రల్ రైల్వేలు మరో రెండు వారాల్లో దాదర్ మరియు బైకుల్లా రైల్వే స్టేషన్లలో కొత్త ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నాయి.
ఈ మూడు స్టేషన్లలోని AC మరియు DC ఛార్జర్లు ద్విచక్ర, త్రిచక్ర మరియు నాలుగు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్కు మద్దతు ఇస్తాయి. పరేల్ రైల్వే స్టేషన్లో నూతన ఛార్జింగ్ స్టేషన్ను ప్రారంభించిన సందర్భంగా సుభాష్ దేశాయ్ మాట్లాడారు. ఈ సందర్భంగా పరిశ్రమ మరియు మైనింగ్ మంత్రి సుభాష్ దేశాయ్ మాట్లాడుతూ, EVలు సజావుగా పనిచేయడానికి ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కొరతను పరిష్కరిస్తూ సెంట్రల్ రైల్వేలతో కలిసి మెజెంటా 'హరిత కార్యక్రమాలు మరియు EV ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం మాకు సంతోషంగా ఉందని అన్నారు.
ఈ పబ్లిక్ చార్జింగ్ పాయింట్ల వలన వాహనాల చార్జింగ్ సమస్య నుండి ఉపశమనం లభిస్తుందని, రైల్వే స్టేషన్లకు సమీపంలోని కీలక ప్రదేశాలలో EV లను ఉపయోగించే వారికి ఇవి అనుకూలంగా ఉంటాయని అన్నారు. మెజెంటా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సహ వ్యవస్థాపకుడు మాక్సన్ లెవిస్ మాట్లాడుతూ.. ముంబై రైల్వే స్టేషన్లలో EV ఛార్జర్లను ఇన్స్టాల్ చేయడం అనేది వ్యక్తిగత స్థాయిలో తనకున్న కల నిజమైందని, ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ విషయంలో ఆందోళన ఉంటే ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ ప్రారంభమైందని చెప్పలేమని అన్నారు.
ముంబైలోని సామాన్యులకు అనుకూలమైన ప్రదేశాలలో ఒకటైన రైల్వే స్టేషన్లలో ఈవీ ఛార్జింగ్ని అందుబాటులో ఉంచడం కంటే మెరుగైనది మరొకటి ఉండదని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరైన డాక్టర్ కిరణ్ సి పటేల్ మాట్లాడుతూ, ఎలక్ట్రిక్ వాహనాల కోసం సిద్ధంగా ఉన్న భారతదేశం గురించి తన దార్శనికతను సాధ్యమయ్యేలా చేయడానికి, మెజెంటా కుటుంబంతో అనుబంధం కలిగి ఉన్నందుకు తానెంతో గర్వపడుతున్నానని చెప్పారు.
రైల్వే స్టేషన్లో వీధి దీపాల ఆధారిత EV ఛార్జింగ్ స్టేషన్ యొక్క ఈ చొరవ చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే ఇది 'మేడ్ ఇన్ ఇండియా అండ్ మేడ్ ఫర్ ఇండియా నినాదంతో తయారు చేయబడింది. పరేల్ వద్ద కొత్తగా ఏర్పాటు చేయబడిన మెజెంటా ఛార్జింగ్ స్టేషన్లు అలాగే, దాదర్ మరియు బైకుల్లాలో రాబోయే కొత్త చార్జింగ్ స్టేషన్లు 24x7 ప్రజల ఉపయోగం కోసం అందుబాటులో ఉంటాయి. EV ఛార్జర్ కోసం చూస్తున్న కస్టమర్లు ChargeGrid యాప్ని ఉపయోగించి వాటిని కనుగొనవచ్చు.
ఈ యాప్ రిమోట్ మానిటరింగ్ను అనుమతిస్తుంది మరియు లొకేషన్లో ఛార్జర్లను పర్యవేక్షించడానికి, నిర్వహించడానికి మరియు ఆపరేట్ చేయడానికి స్టేషన్ మార్షల్ను కలిగి ఉండవలసిన అవసరాన్ని కూడా తొలగిస్తుంది. ఇది ఆటోమేటెడ్ చెల్లింపు వ్యవస్థను కూడా కలిగి ఉంటుంది. మెజెంటా గ్రూప్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 108 నగరాల్లో 4,500 ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే పనిలో ఉంది.
మెజంటా ఏర్పాటు చేయనున్న చార్జింగ్ స్టేషన్లలో REIL తో పాటు FAME-2 పథకం కింద 2950 ఛార్జర్లు ఉన్నాయి. అంతేకాకుండా, HPCL మరియు ఇతర పెట్రోల్ స్టేషన్లలో 1200 కంటే ఎక్కువ ఛార్జర్లు, FERN హోటల్స్లో 82, ఢిల్లీ ప్రభుత్వం సహకారంతో రెసిడెన్షియల్ ఛార్జర్లు మరియు బెంగళూరు అపార్ట్మెంట్ ఫెడరేషన్ సహకారంతో రెసిడెన్షియల్ ఛార్జర్లు కూడా ఉన్నాయి. 2026 నాటికి తమ రోడ్లపైకి వచ్చే అవకాశం ఉన్న రెండు మిలియన్ ఎలక్ట్రిక్ వాహనాల (EV) అవసరాలను తీర్చడానికి 400,000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే ప్రభుత్వ చొరవకు మెజెంటా మద్దతు ఇస్తుందని ఛార్జర్లు పేర్కొన్నారు.
డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
మెజెంటా మరియు సెంట్రల్ రైల్వే సంస్థలు కలిసి ఏర్పాటు చేస్తున్న ఈ స్ట్రీట్ లైట్ కాన్సెప్ట్ చార్జింగ్ పాయింట్లు ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులు ప్రధానంగా ఎదుర్కుంటున్న చార్జింగ్ సమస్యను పరిష్కరించనున్నాయి. చాలా మంది ముంబైవాసులు లోకల్ రైలు వ్యవస్థను ఉపయోగిస్తున్నందున, ఈ ఛార్జర్ల ఉనికి ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలకు మరింత అలవాటు పడటానికి మరియు వాటిని ఛార్జ్ చేయడానికి అందుబాటులో ఉన్న అనేక ఎంపికలను హైలైట్ చేయడానికి సహాయపడుతుందని ఆశిస్తున్నాము.