Just In
- 12 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 13 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 15 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 18 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- Movies Karthika Deepam 2 నా బిడ్డకు దూరంగా ఉండు.. కార్తీక్కు దీప షాక్
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కార్ కంపెనీల నుండి డీలర్లను కాపాడండి: ప్రభుత్వాన్ని కోరిన FADA
వాహన డీలర్ల వ్యాపారాన్ని కాపాడేందుకు కొత్త చట్టాలను రూపొందించాలని ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ఫెడరేషన్ (ఎఫ్ఎడిఏ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆటోమొబైల్ పంపిణీకి ఒక స్థాయిని సృష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతూ వాహన డీలర్స్ అసోసియేషన్ అక్టోబర్ 27న తీర్మానం చేసింది.
కార్ కంపెనీలు మరియు డీలర్లు వారి భాగస్వామ్యం ప్రారంభంలో వ్యాపార ఒప్పందంపై సంతకం చేస్తారని వాహన డీలర్స్ అసోసియేషన్ పేర్కొంది, ఇది ఇండియన్ కాంట్రాక్ట్ చట్టం ప్రకారం చెల్లుతుంది. అయితే, ఈ చట్టంలో డీలర్లకు స్పష్టమైన పరిష్కారం లేదు, ఫలితంగా డీలర్లు నష్టపోతున్నారు.
ఈ నేపథ్యంలో, FADA భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది మరియు భారత ప్రభుత్వం వెంటనే ఆటోమొబైల్ డీలర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ని అమలు చేయడం గురించి ఆలోచించాలని పేర్కొంది. ఇటువంటి చట్టం భారతదేశంలోని వాహన డీలర్ల హక్కులను పరిరక్షిస్తుంది. భారతదేశంలో డీలర్షిప్ ఒప్పందాలకు ఒక ప్రామాణిక పదం లేదు.
ఇందులో కొన్ని ఒప్పందాలు ఏడాది కంటే తక్కువ వ్యవధిలో ఉంటాయి. వాస్తవానికి, డీలర్షిప్ వ్యాపారాన్ని మూసివేయడానికి 3 నుండి 5 సంవత్సరాల మధ్య సమయం పడుతుంది. అయితే, ఈ స్వల్ప ఒప్పంద వ్యవధి కారణంగా, డీలర్లు పెట్టిన భారీ పెట్టుబడిని రికవరీ చేసుకునేందుకు డీలర్లకు తగిన అవకాశాలు ఇవ్వకపోవడం డీలర్లకు నష్టదాయకమని FADA చెబుతోంది.
భారతదేశంలో వాహన డీలర్లకు సరైన వాణిజ్య రక్షణ చట్టం లేకపోవడం డీలర్ల కంటే OEM లకే ఎక్కువ సౌలభ్యాన్ని ఇస్తుందని FADA తెలిపింది. కంపెనీలు తమ వ్యాపారాన్ని అకస్మాత్తుగా నిలిపివేసే సమయంలో డీలర్ల చర్చల సామర్థ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది మరియు ఉపాధిని కోల్పోయేలా చేస్తుంది.
ఇలా డీలర్షిప్ లను మూసివేయాల్సిన పరిస్థితి వస్తే, సదరు వాహన బ్రాండ్ కి చెందిన వాహనాలను కొనుగోలు చేసిన కస్టమర్లు కూడా సర్వీస్ మరియు మెయింటినెన్స్ విషయంలో సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి, నిలిపివేయబడిన కంపెనీ కారును కలిగి ఉన్న వినియోగదారులకు కూడా ఇది ఇబ్బందికరంగా ఉంటుంది.
భారతదేశంలో, డీలర్షిప్లో మిగిలి ఉన్న స్టాక్ మరియు విడిభాగాల కోసం కార్ కంపెనీలు మరియు వాహన డీలర్ల మధ్య కుదిరిన ఒప్పందంలో ఎలాంటి నియమాలు లేవు. దీని కారణంగా, కంపెనీ మూసివేయబడిన సందర్భంలో డీలర్ల వద్ద భారీ మొత్తంలో వాహనాలు మరియు విడిభాగాల స్టాక్ ఉన్నట్లయితే, ఆ నష్టాన్ని కూడా డీలర్లే భరించాల్సి ఉంటోంది.
ఇటీవల భారతదేశం నుండి అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ నిష్క్రమిస్తున్న ప్రకటించిన సంగతి తెలిసినదే. ఈ వార్త భారత ఆటోమొబైల్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. భారతదేశంలో వాహనాల ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ఫోర్డ్ ప్రకటించడంతో ఫోర్డ్ డీలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కంపెనీ తీసుకున్న అకస్మాత్ నిర్ణయం కారణంగా ఫోర్డ్ డీలర్లు మరియు భాగస్వాములకు జరిగే నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారని వారు వాపోతున్నారు. మనదేశం నుండి జనరల్ మోటార్స్, MAN ట్రక్స్, UM లోహియా మరియు హార్లే-డేవిడ్సన్ వంటి కంపెనీలు భారతదేశాన్ని విడిచిపెట్టిన తర్వాత, ఐదవ ఆటోమొబైల్ కంపెనీగా ఫోర్డ్ కూడా భారత్ ను విడిచి వెళ్లుతోంది.
భారతదేశంలో గత పదేళ్లుగా ఫోర్డ్ ఇండియా నష్టాల బాటలో ఉంది. ఈ నేపథ్యంలో, కంపెనీ హఠాత్తుగా దేశం విడిచి వెళ్తున్నట్లు ప్రకటించింది. డీలర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రపంచంలోని అనేక దేశాల్లో చట్టాలు రూపొందించబడ్డాయి, అయితే దురదృష్టవశాత్తూ భారతదేశంలోని ప్రస్తుత న్యాయ వ్యవస్థ డీలర్ల యొక్క ఈ నిర్దిష్ట ఆందోళనలను పరిష్కరించడానికి సరిపోదని FADA పేర్కొంది.
సనంద్ ప్లాంట్ లో చివరి కారును ఉత్పత్తి చేసిన Ford:
ఒకప్పుడు భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ (Ford), సరైన మార్కెట్ వ్యూహం లేకపోవడం మరియు మార్కెట్లో పెరుగుతున్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో విఫలం కావడంతో గత కొన్నేళ్లుగా ఇక్కడి మార్కెట్లో భారీగా నష్టపోతూ వచ్చింది. ఈ నేపథ్యంలో, కంపెనీ భారతదేశంలో తమ వ్యాపారాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
ఫోర్డ్ ఇండియాకు గుజరాత్ మరియు తమిళనాడు రాష్ట్రాలలో రెండు తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఫోర్డ్ తమిళనాడు ప్లాంట్ ను దక్కించుకునేందుకు టాటా మోటార్స్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అలాగే, సనంద్ ప్లాంట్ ను సొంతం చేసుకునేందుకు ఎమ్జి మోటార్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, కంపెనీ ఇప్పటికే తమ ఫ్యాక్టరీలను మూసివేసే ప్రక్రియను ప్రారంభించింది.
ఫోర్డ్ ముందుగా గుజరాత్ లో ఉన్న సనంద్ ప్లాంట్ లో కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తోంది. ఇటీవలే కంపెనీ ఈ ప్లాంట్ నుండి చివరి యూనిట్ ఉత్పత్తిని పూర్తి చేసింది. ఈ ప్లాంట్ నుండి బయటకు వచ్చిన చివరి ఉత్పత్తి ఫోర్డ్ ఆస్పైర్ (Ford Aspire). 2021 నాల్గవ త్రైమాసికం నాటికి సనంద్ ప్లాంట్ పూర్తిగా నిలిపివేయబడుతుందని కంపెనీ తెలిపింది.
కాగా, తమిళనాడు లోని చెన్నై ప్లాంట్లో కూడా ఉత్పత్తిని వచ్చే ఏడాది (2022) రెండవ త్రైమాసికం నాటికి నిలిపివేయబడుతుంది. చెన్నై ప్లాంట్లో కంపెనీ Ford EcoSport ఎస్యూవీని ఉత్పత్తి చేస్తోంది. సనంద్ ఫ్యాక్టరీలో Figo, Aspire మరియు Freestyle వాహనాలు తయారయ్యేవి.