Just In
- 9 min ago హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- 2 hrs ago బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
- 2 hrs ago జనరల్ టికెట్ ప్యాసింజర్స్తో ఫుల్ రష్గా రిజర్వ్డ్ కోచ్లు.. ప్రయాణికుడి కంప్లెయింట్, రైల్వే శాఖ సీరియస్
- 4 hrs ago ఫ్రీ బస్సులో వాటికి ప్రత్యేకంగా సీటు.. బామ్మ, మనవరాలికి షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
Don't Miss
- Movies స్కిట్ కోసం నాలుక కోసేసుకున్న జబర్దస్త్ కమెడియన్.. షాక్లో జడ్జిలు!
- Sports హార్దిక్పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- News బీజేపీకి అనపర్తి సీటు కేటాయింపు వెనుక వైసీపీ..!?
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Finance Rain Tax: ఆ నగరంలో ప్రజలపై వర్షం టాక్స్..! ఏప్రిల్ నుంచి దబిడిదిబిడేనా..??
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
భారత్లో 4 కొత్త జీప్ ఎస్యూవీలను విడుదల చేస్తాం: ఫియట్
భారత మార్కెట్లో తన ఉనికి చాటుకునేందుకు ఎఫ్సిఏ (ఫియట్ క్రైస్లర్ ఆటోమొబైల్స్) తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ మేరకు దేశీయ మార్కెట్లో తమ స్థానిక ఉత్పత్తి శ్రేణిని విస్తరించనున్నట్లు ఎఫ్సిఏ ప్రకటించింది. నాలుగు కొత్త జీప్ ఎస్యూవీల ఉత్పత్తి కోసం 250 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వెచ్చించనున్నట్లు కంపెనీ ధృవీకరించింది.
తమ సరికొత్త లోకల్ వెహికల్ లైనప్లో 2021 మేడ్ ఇన్ ఇండియా జీప్ కంపాస్ కూడా ఉంటుందని, స్థానికంగా ఉత్పత్తి చేయబడే ఈ జీప్ కంపాస్ ప్రపంచంలోనే మొట్టమొదటి మూడు-వరుసల సీటింగ్ కలిగిన జీప్ ఎస్యూవీ అవుతుందని ఎఫ్సిఏ ఇండియా పేర్కొంది.
మేడ్ ఇన్ ఇండియా కంపాస్తో పాటుగా తమ ఐకానిక్ జీప్ వ్రాంగ్లర్ మరియు నెక్స్ట్ జనరేషన్ గ్రాండ్ చెరోకీ మోడళ్లను కూడా భారత మార్కెట్లో ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. జీప్ బ్రాండ్కు గ్రాండ్ చెరోకీ ఫ్లాగ్షిప్ మోడల్గా ఉంది, ఇది ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకానికి ఉంది.
MOST READ:ఒక ఛార్జ్తో 100 కి.మీ డ్రైవింగ్.. ధర తక్కువ & డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేదు
ఈ రెండు వాహనాలను కూడా రంజాంగావ్లోని ఎఫ్సిఏ జాయింట్ వెంచర్ తయారీ కేంద్రంలోనే స్థానికంగా అసెంబుల్ చేయనున్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి ఈ నాలుగు కొత్త ఉత్పత్తులు భారత రోడ్లను తాకే అవకాశం ఉంది.
ఈ విషయం గురించి ఎఫ్సిఏ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ పార్థ దత్తా మాట్లాడుతూ, తాము వెచ్చించే 250 మిలియన్ డాలర్ల కొత్త పెట్టుబడి ద్వారా రంజాంగావ్ నుండి వచ్చే కొత్త జీప్ ఎస్యూవీలు భారత కార్ మార్కెట్లోని పలు విభాగాల్లో గట్టి పోటీని ఇస్తాయని అన్నారు.
MOST READ:లిమోసిన్ కారుగా మారిన మారుతి వ్యాగన్ ఆర్.. ఎలా అనుకుంటున్నారా.. ఇది చూడండి
ఎఫ్సిఏ జాయింట్ వెంచర్ ఉత్పాదక కేంద్రంలో ఉత్పత్తి చేయబడిన వాహనాల్లో స్థానికంగా తయారైన విడిభాగాల సంఖ్యను పెంచాలని నిశ్చయించుకున్నమని, భారతదేశంలో తమ ప్రణాళికలు మరియు ఉత్పత్తుల ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉంటామని దత్తా అన్నారు.
ఇదిలా ఉంటే, జీప్ ఇండియా దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న కంపాస్ ఎస్యూవీలో ఓ కొత్త 2021 మోడల్ను జనవరి 7వ తేదీన ఆవిష్కరించనుంది. మునుపటి మోడల్తో పోలిస్తే ఈ కొత్త 2021 జీప్ కంపాస్ను సరికొత్త డిజైన్ మరియు విలాసవంతమైన ఫీచర్లతో రీడిజైన్ చేసినట్లుగా అనిపిస్తోంది. అంతేకాకుండా ఇందులో కొత్త కలర్ ఆప్షన్స్ కూడా ప్రవేశపెట్టనున్నారు.
MOST READ:లవ్బర్డ్ ; భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ కార్.. మీరు చూసారా..!
భారత మార్కెట్ కోసం జీప్ కంపాస్లో కంపెనీ ఓ 7-సీటర్ వెర్షన్ను కూడా అభివృద్ధి చేస్తోంది. ఈ లగ్జరీ సెవన్ సీటర్ జీప్ కంపాస్ను హెచ్6 అనే కోడ్నేమ్తో డెవలప్ చేస్తున్నారు. ఇది 2022లో ప్రారంభించబడుతుందని అంచనా.