Just In
- 13 hrs ago రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- 16 hrs ago మార్కెట్లో వీటికి తిరుగే లేదు.. కొత్త బైక్ కొనాలనుకుంటే ఈ లిస్ట్ అస్సలు మిస్ అవ్వకండి
- 18 hrs ago వారెవ్వా.. యూట్యూబర్స్ వాడే కార్లు ఇలా ఉన్నాయా!.. ఓ లుక్కేసుకోండి
- 18 hrs ago రూ. 10 లక్షల లోపు ధరలో విడుదల కాబోతున్న ప్రముఖ బ్రాండ్ల కార్లు ఇవే..
Don't Miss
- News తెలంగాణా కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు నేడే: కాంగ్రెస్ సిఈసి భేటీకి సీఎం రేవంత్ రెడ్డి!!
- Movies అల్లు అర్జున్తో త్రిప్తి డిమ్రి: ఎందుకు? ఎలా? కలుస్తున్నారో తెలిస్తే!
- Finance Telecom News: వినియోగదారులకు టెలికాం కంపెనీల వాత.. ముహూర్తం ఫిక్స్..
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్పై వేటు!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
భారతదేశంలో మొట్టమొదటి స్ట్రీట్ లైట్ ఈవి ఛార్జింగ్ స్టేషన్ ఇదే.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?
భారతదేశంలో రోజురోజకి పెట్రోల్ మరియు డీజిల్ రేట్లు పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న ధరలు వాహనదారులకు చాలా ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించడానికి చాలా వరకు రాయితీలు కల్పిస్తున్నాయి.
ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులు పెరుగుతున్నారు. కానీ ఇప్పటికి ఎలక్ట్రిక్ వాహనాలకు కావలసిన మౌలికసదుపాయాలు అందుబాటులో లేదు. ఈ కారణంగా ఇప్పటిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ సర్వీస్ లు ఏర్పాటు చేస్తున్నారు.
ఇందులో భాగంగానే ఛార్జింగ్ సర్వీస్ ప్రొవైడర్ మెజెంటా హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ సహకారంతో దేశంలోని మొట్టమొదటి స్ట్రీట్ లాంప్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జీని ఢిల్లీ మరియు ముంబైలలో ప్రారంభించింది. ఈ ఛార్జర్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది వీధి లైట్ యొక్క పోల్ పై అమర్చబడి ఉంటుంది.
MOST READ:పబ్లిక్ రోడ్డుపై బైక్ స్టంట్ ; వీడియో చూసి పోలీసులకు పట్టుబడ్డ బైకర్
ఎలక్ట్రిక్ వాహనాన్ని ఛార్జ్ చేయడానికి అన్ని పరికరాలు ఈ పోల్లోనే అమర్చబడి ఉంటాయి. అంతేగాని దీని కోసం ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్ నిర్మించబడలేదు. ఈ ఛార్జింగ్ పోల్ యొక్క ప్రయోజనం ఏమిటంటే దాని నిర్వహణ చాలా తక్కువగా ఉంది మరియు దీనికి స్థలం అవసరం లేదు.
మెజెంటా స్ట్రీట్ లాంప్ ఈవి ఛార్జింగ్ స్టేషన్ను గుర్తించడానికి కంపెనీ స్మార్ట్ఫోన్ అప్లికేషన్ను ప్రారంభించింది. దీనితో ఛార్జింగ్ పోల్ ఉన్న ప్రదేశాన్ని కనుగొనవచ్చు. అంతే కాకుండా ఇందులో ఛార్జింగ్ కోసం ఆన్లైన్ చెల్లింపు సౌకర్యం కూడా అందించబడింది. ఇంత తక్కువ ఖర్చుతో ఛార్జింగ్ స్టేషన్ను ఇతర నగరాల్లో కూడా ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది.
MOST READ:కార్లలో ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్ అంటే ఏమిటి, అదెలా పనిచేస్తుంది?
ఈ ఏడాది దేశంలో 100 కి పైగా ఛార్జింగ్ గ్రిడ్లను కంపెనీ ఏర్పాటు చేయబోతోంది. స్ట్రీట్ లైట్ పోల్లో ఈ ఛార్జింగ్ స్టేషన్లను నిర్మించడం చాలా సులభం అని, వాటిని ఇన్స్టాల్ చేయడానికి కూడా తక్కువ ఖర్చు అవుతుందని కంపెనీ తెలిపింది. ఈ స్టేషన్లలో ఏ ఆపరేటర్ లేదా అటెండెంట్ను ఉంచాల్సిన అవసరం లేదు.
దేశంలో కాలుష్యాన్ని తగ్గించడానికి మరియు పెట్రోల్ మరియు డీజిల్పై ఆధారపడటాన్ని తగ్గించడానికి అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి ఢిల్లీ ప్రభుత్వం స్విచ్ ఢిల్లీ ప్రచారాన్ని కూడా నిర్వహిస్తోంది.
MOST READ:విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించిన పిల్లి.. ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజమే
ఢిల్లీలో 2019 సంవత్సరంలో ఎలక్ట్రిక్ వాహన విధానం ప్రకటించబడింది. దీని కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం, త్రీ వీలర్ మరియు కారు కొనుగోలుకు రాయితీ ఇవ్వబడుతుంది. దేశంలోని చాలా చిన్న మరియు పెద్ద నగరాల్లో, ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ స్టేషన్లను తయారుచేసే పనులు వేగంగా జరుగుతున్నాయి.