Just In
- 4 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 6 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 7 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 9 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Movies Karthika Deepam 2 April 25th: దీపను టార్గెట్ చేసిన పారిజాతం.. దాడి చేస్తే దిక్కెవరు.. సుమిత్ర
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మతిపోగొడుతున్న హ్యుందాయ్ మార్చ్ నెల డిస్కౌంట్స్.. దేనిపై ఎంతో చూసారా..!
భారత మార్కెట్లో హ్యుందాయ్ కంపెనీ తన శాంట్రో, గ్రాండ్ ఐ నియోస్, ఆరా, ఎలంట్రా, కోన వంటి మోడళ్లపై మార్చి నెల ప్రారంభంలోనే భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. కంపెనీ ఈ కార్లపై దాదాపు రూ. 1.50 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. దీనితో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, వైద్య నిపుణులు వంటి వారికి కూడా ప్రత్యేక తగ్గింపు ఇస్తున్నారు.
హ్యుందాయ్ ఎంట్రీ లెవల్ కారు అయిన శాంట్రోపై ఇప్పుడు దాదాపు రూ. 50 వేల వరకు డిస్కౌంట్ ఇవ్వబడుతోంది. కంపెనీ ఈ కారును రూ. 4.67 లక్షల ప్రారంభ ధర వద్ద అందుబాటులోకి తెచ్చింది. దీని టాప్ వేరియంట్ ధర రూ. 5.99 లక్షల వరకు ఉంటుంది. హ్యుందాయ్ శాంట్రో అమ్మకాలు గత కొన్ని నెలలుగా తగ్గుముఖం పడుతున్నాయి.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్కు ఇప్పుడు రూ. 60 వేల వరకు తగ్గింపును అందిస్తున్నారు. టాప్ వేరియంట్కు రూ. 7.33 లక్షల వరకు వుండే ఈ కారు ప్రస్తుతం రూ. 5.19 లక్షల ధరలకు లభిస్తోంది. ఈ కారణంగా దీని అమ్మకాలు మెల్లగా ముందుకు వెళ్తున్నాయి.
MOST READ:భారత్లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్
మార్చి నెలలో కంపెనీ సెడాన్ ఆరాపై రూ. 70,000 వరకు తగ్గింపును అందిస్తున్నారు. టాప్ వేరియంట్కు రూ. 7.43 లక్షల వరకు వుంది . అయితే ఇది ఇప్పుడు రూ. 5.92 లక్షల ధరకు అందుబాటులోకి తెస్తున్నారు. అదే విధంగా హ్యుందాయ్ ఎలంట్రాపై రూ. 1 లక్ష వరకు డిస్కౌంట్ ఇవ్వబడుతోంది.
హ్యుందాయ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కోనపై కంపెనీ మార్చిలో రూ. 1.50 లక్షల వరకు తగ్గింపు ఇస్తున్నారు. ఇది కంపెనీలో అత్యల్పంగా అమ్ముడవుతున్న మోడల్. ఈ కారును రూ. 23.75 లక్షల ధరలకు అందుబాటులోకి తెస్తున్నారు. దీని టాప్ వేరియంట్ ధర ఇప్పుడు రూ. 23.94 లక్షల వరకు ఉంటుంది.
MOST READ:త్వరపడండి.. అక్కడ ఒక కేజీ కేక్ కొంటె ఒక లీటర్ పెట్రోల్ ఫ్రీ
హ్యుందాయ్ కంపెనీ ఈ ఆఫర్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగులతో సహా అనేక వర్గాల ఉద్యోగులకు రూ. 8000 వరకు రిబేటు ఇవ్వబడుతోంది. కంపెనీ క్రెటా ఎస్యూవీ, కొత్త ఐ 20, కొత్త వెర్నా, వెన్యూ, టక్సన్, యాసెంట్ వంటి మోడళ్లపై మార్చి 2021 లో డిస్కౌంట్ ఇవ్వడం లేదు.
హ్యుందాయ్ యొక్క క్రెటా ఎస్యూవీ గత నెలలో కంపెనీని అత్యధికంగా అమ్ముడైన మోడల్గా నిలిచింది. హ్యుందాయ్ అమ్మకాలు అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు కొంతవరకు పెరిగాయి. అయినప్పటికీ జనవరి 2021 నాటికి అమ్మకాలలో తగ్గుదల నమోదైంది. క్రెటా అమ్మకాలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. ఏది ఏమైనా ఈ డిస్కౌంట్స్ అమ్మకాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.
MOST READ:మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విజేతకు 5 లీటర్ల పెట్రోల్ గిఫ్ట్గా ఇచ్చారు, ఎందుకో తెలుసా!