Just In
- 5 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 8 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 11 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 14 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
2021 ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కైవసం చేసుకున్న "హ్యుందాయ్ ఐ20"
"2021 ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్" (ICOTY) ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. విడుదలైన ఈ ఫలితాల ప్రకారం, సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ యొక్క ఇటీవల విడుదల చేసిన మూడవ తరం హ్యుందాయ్ ఐ 20 కార్ 2021 ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ విజేతగా నిలిచింది.
ఇది మాత్రామే కాకుండా ఈ పోటీలో టాటా మోటర్స్ యొక్క టాటా నెక్సన్ ఈవి కి మొదటిసారిగా "2021 గ్రీన్ కార్ అవార్డు" లభించింది, మరియు ల్యాండ్ రోవర్ డిఫెండర్ 2021 ప్రీమియం కార్ అవార్డును కైవసం చేసుకుంది. గ్రీన్ కార్ అవార్డు విభాగాన్ని మొదటిసారిగా 2021 ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్లో చేర్చారు.
హ్యుందాయ్ ఐ 20 కార్ అత్యధికంగా 104 పాయింట్ల అగ్రస్థానంలో నిలిచి, ఇంతటి గొప్ప ఘానా విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇందులో కియా సొనెట్ 91 పాయింట్లు దక్కించుకుని రెండవ స్థానంలో నిలిచింది. మాధవ స్థానంలో మహీంద్రా థార్ 78 పాయింట్లతో నిలిచింది.
MOST READ:పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఖాయం అంటున్న పెట్రోలియం మంత్రి.. ఎప్పటినుంచో తెలుసా !
ఇందులో ఎలక్ట్రిక్ కార్ల విషయానికి వస్తే, టాటా నెక్సాన్ ఈవి మొత్తం 106 పాయింట్లతో ఎలక్ట్రిక్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. గ్రీన్ కార్ అవార్డు విభాగంలో, 99 పాయింట్లతో హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్, 93 పాయింట్లతో ఎంజి మోటార్స్ ఎంజి జెడ్ఎస్ ఈవి గ్రీన్ కార్ అవార్డు విభాగంలో రెండవ స్థానంలో నిలిచాయి.
ప్రీమియం కార్ విభాగంలో కూడా ల్యాండ్ రోవర్ డిఫెండర్ 108 పాయింట్లు సాధించింది. రెండవ స్థానంలో నిలిచిన మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఇకి 77 పాయింట్లు, మూడో స్థానంలో నిలిచిన బిఎమ్డబ్ల్యూ 2 సిరీస్కు 61 పాయింట్లు వచ్చాయి. వీటిని ఎంపిక చేయడంలో అత్యంత అనుభవజ్ఞులైన ఆటోమోటివ్ జర్నలిస్టులు ఉన్నారు.
ICOTY 2021 విజేత హ్యుందాయ్ ఐ 20 కు ప్రాతినిధ్యం వహిస్తున్న మిస్టర్. ఎస్.ఎస్. కిమ్ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఎండి & సిఇఒ మాట్లాడుతూ, సరికొత్త ఐ 20 'ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2021' అనే అత్యంత ప్రతిష్టాత్మక ఆటోమోటివ్ అవార్డును గెలుచుకున్నందుకు మాకు గౌరవంగా ఉంది.
అవార్డు గెలుచుకోవడం అనేది హ్యుందాయ్ బ్రాండ్పై వినియోగదారుల విశ్వాసం మరియు విశ్వాసాన్ని సూచిస్తుంది. సరికొత్త ఐ 20 ను ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2021 గా ఎంచుకున్నందుకు మా కస్టమర్లు, భాగస్వాములు, ప్రభుత్వం, మీడియా మరియు న్యాయనిర్ణేతలందరికి ధన్యవాదాలు అని ఆయన అన్నారు.
MOST READ:సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ కైవసం చేసుకున్న కొత్త హ్యుందాయ్ ఐ 20 యొక్క ప్రారంభ ధర దేశీయ మార్కెట్లో రూ. 6.80 లక్షలు కాగా, దాని దాని టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 11.18 లక్షలు (ఎక్స్- షోరూమ్) గా ఉంది.
ఐ 20 రెండు పెట్రోల్, ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో విక్రయించబడుతుంది. మొదటి ఇంజిన్ 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, ఇది 120 బిహెచ్పి శక్తిని ఇస్తుంది. రెండవది 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, ఇది 88 బిహెచ్పి శక్తిని ఇస్తుంది. చివరగా మూడవది 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, ఇది 100 బిహెచ్పి శక్తిని అందిస్తుంది. ఏది ఏమైనా హ్యుందాయ్ ఐ 20 విడుదలైన అతి తక్కువ కాలంలో ఇంత గొప్ప అవార్డు కైవసం చేసుకోవడం అనేది, చాలా గొప్ప విషయం.
MOST READ:కార్ టైర్ మారుస్తూ కనిపించిన డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి [వీడియో]