Just In
- 1 hr ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 1 hr ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 3 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 4 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- News అమిత్ షా ఓ గూండా, రౌడీ, అయినా పక్కనే పెట్టుకున్న ప్రధాని మోదీ, సీఎం కొడుకు సంచలనం!
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
విడుదలైన మహీంద్రా 2021 ఏప్రిల్ సేల్స్.. స్వల్పంగా పెరిగిన వృద్ధి
భారతదేశంలో వాహన తయారీదారులందరూ దాదాపుగా తమ కంపెనీ యొక్క 2021 ఏప్రిల్ అమ్మకాలు యొక్క నివేదికను విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగానే దేశీయ ఆటో మొబైల్ సంస్థ అయిన మహీంద్రా & మహీంద్రా కంపెనీ 2021 ఏప్రిల్ అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. మహీంద్రా యొక్క 2021 ఏప్రిల్ అమ్మకాలను గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత నెలలో 36,437 యూనిట్ల వాహనాలను విక్రయించింది. ఈ వాహనాల్లో ప్యాసింజర్ వెహికల్, కమర్షియల్ వెహికల్స్ మరియు వ్యవసాయానికి ఉపయోగపడే వాహనాలు ఉన్నాయి.
2021 మార్చి నెల అమ్మకాలతో పోలిస్తే కంపెనీ అమ్మకాలలో ప్రస్తుతం 9.5 శాతం పెరిగాయి. అంటే దీని ప్రకారం కంపెనీ గత నెలలో 18,186 యూనిట్ల యుటిలిటీ వాహనాలను విక్రయించింది. ఇందులో భాగంగానే ఇప్పుడు కార్ల అమ్మకాలు విషయానికి వస్తే, 99 యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే విక్రయించినట్లు తెలిసింది.
MOST READ:డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ లో తప్పకుండా పాటించాల్సిన రూల్స్, ఇవే
మహీంద్రా కంపెనీ యొక్క 2 టన్నుల నుంచి 3.5 టన్నుల బరువు గల కమర్షియల్ వాహనాల అమ్మకాల విషయానికి వస్తే, ఈ కేటగిరిలో మొత్తం 12,210 యూనిట్లను విక్రయించి, సబ్ 2 టి రంగంలో 1,561 యూనిట్లు అమ్మకాలు జరిపింది. అయితే ఈ విభాగంలో మహీంద్రా బొలెరో ముందంజలో ఉంది.
కంపెనీ 3.5 టన్నుల కంటే ఎక్కువ బరువు గల భారీ వాణిజ్య వాహనాలను 333 యూనిట్లు విక్రయించింది. అదే సమయంలో, 3-వీలర్ విభాగంలో 2,043 యూనిట్లు అమ్ముడయ్యాయి. కంపెనీ యొక్క ఎగుమతుల విషయానికి వచ్చినట్లైతే, ఈ విభాగంలో అమ్మకాలు మునుపటి సంవత్సరంతో పోలిస్తే ఈ ఏప్రిల్లో మెరుగ్గా ఉన్నాయి.
MOST READ:2021 ఏప్రిల్ నెలలో రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాల హవా
మహీంద్రా ఈ విభాగంలో గత నెలలో 2,005 యూనిట్లను విక్రయించింది, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 174 శాతం పెరిగింది. మహీంద్రా వ్యవసాయ పరికరాల విషయానికి వస్తే, ప్రస్తుత అమ్మకాలు గతనెల అమ్మకాలకేనట కొంత మెరుగ్గా అనిపిస్తున్నాయి.
మహీంద్రా అండ్ మహీంద్రా గత ఏడాది ఇదే నెలలో 4,716 యూనిట్లను విక్రయించగా, కంపెనీ గత నెలలో 26,130 యూనిట్లను విక్రయించింది. అదే సమయంలో, 2020 ఏప్రిల్ నాటికి కంపెనీ 1,393 యూనిట్ల వాహనాలను ఎగుమతి చేసింది.
MOST READ:మీకు తెలుసా.. విమానం ఎత్తులో ఎగిరేటపుడు పైలెట్స్ మాట్లాడకూడదు.. ఎందుకంటే?
ఏప్రిల్ 2021 అమ్మకాల గురించి మహీంద్రా & మహీంద్రా యొక్క ఆటోమోటివ్ డివిజన్ సిఇఒ వీజయ్ నక్రా మాట్లాడుతూ ప్రస్తుతం దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లో కంపెనీకి బలమైన డిమాండ్ ఉంది. కానీ కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న కారణంగా సరఫరా మరియు ఉత్పత్తి చాలా నెమ్మదిగా జరుగుతోంది.
మహీంద్రా కంపెనీ తన వినియోగదారుల ఉపయోగార్థం డిజిటల్ మరియు కాంటాక్ట్ లెస్ సేల్స్ మరియు సర్వీస్ అసిస్ట్ వంటివి అందిస్తూనే ఉందని ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే ప్రబలుతున్న మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని కాంటాక్ట్ లెస్ సేల్స్ ఇపుడు చాలా అవసరం కావున ఇవన్నీ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.
MOST READ:పోలీస్ స్టేషన్ ముందే బైక్ స్టంట్ చేసిన యువకుడు.. తర్వాత ఏమైందంటే?
దేశీయ మార్కెట్లో మహీంద్రా వాహనాలకు చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. గత సంవత్సరం భారత మార్కెట్లో విడుదలైన మహీంద్రా కంపెనీ యొక్క థార్ అత్యధిక అమ్మకాలను చవిచూస్తోంది. అంతే కాకుండా ఈ థార్ ఇప్పటికే ఎక్కువ బుకింగ్స్ కూడా పొందింది. కావున ఇప్పుడు దీని డెలివరీ కూడా చాల రోజులు పెట్టె అవకాశం ఉంది.