Just In
- 19 min ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 2 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
- 2 hrs ago సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- 5 hrs ago 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
Don't Miss
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- News మండుటెండల్లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి ఎన్నికల కష్టం!!
- Movies నీకెంత బలుపు? ఆర్కే నాయుడుపై సీనియర్ నటి సీరియస్
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
మహీంద్రా కస్టమర్లకు గుడ్ న్యూస్.. వెహికల్ వారంటీ టైమ్ ఇప్పుడు జులై 31 వరకు
భారత దేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా అధికంగా వ్యాపిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ఎంతోమంది ప్రజలు మరణిస్తున్నారు. అంతే కాకుండా ఎంతోమంది ప్రజలు ఈ కరోనా వైరస్ తో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించబడింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా విధించబడిన కరోనా లాక్ డౌన్ కారణంగా ఆటో మొబైల్ కంపెనీలు మరియు డీలర్షిప్లు మూసివేయబడ్డాయి. ఈ పరిస్థితిలో మహీంద్రా కస్టమర్లు ఇబ్బందిపడకూడదనే ఉదేశ్యంతో మహీంద్రా వారంటీ వ్యవధిని జూలై 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాలపై ఇప్పటికే వారెంటీని పొడిగించాయి. అంతే కాకుండా రోజు రోజుకి ఈ లాక్ డౌన్ వ్యవధి పొడిగిస్తున్న కారణంగా ఈ వారంటీ వ్యవధి కూడా పొడిగిస్తూ ఉంది. ఈ విధంగా పొడిగించడం వల్ల తమ వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి కంపెనీలు ఈ చర్య తీసుకోవడం ప్రారంభించాయి.
ఇప్పుడు ఇటువంటి కంపెనీల జాబితాలో తన కస్టమర్లకు ఉపశమనం కలిగిస్తూ థార్, బొలెరో, స్కార్పియో, ఎక్స్యువి 300, ఎక్స్యువి 500 వంటి మోడళ్లతో సహా జూలై వరకు తమ వారంటీని పొడిగిస్తున్నట్లు మహీంద్రా ప్రకటించింది.
మహీంద్రా కంపెనీ కంటే ముందు మారుతి సుజుకి, టాటా మోటార్స్, ఎంజి మోటార్, హ్యుందాయ్ వంటి కంపెనీలు కూడా వారెంటీలను పొడిగిస్తూ ప్రకటించిన విషయం తెలిసిందే. గత సంవత్సరం కూడా కరోనా విస్తరణ కారణంగా ఇదే విధమైన ప్రకటన చేయబడి దాదాపు వారంటీని 2 నెలల కంటే ఎక్కువ కాలం పొడిగించింది.
ప్రస్తుతం మరింత కఠినంగా మారుతున్న కరోనా పరిస్థితుల్లో మహీంద్రా కంపెనీ కూడా తమ వంతు సహాయం హేయడానికి ముందుకు వస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల హైదరాబాద్లో ఆక్సిజన్ ఆన్ వీల్స్ సర్వీస్ ప్రారంభించింది. దీని ద్వారా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏడు ఆసుపత్రులు మరియు వైద్య కేంద్రాల్లో ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేయబడతాయి.