Just In
- 1 min ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 1 hr ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 3 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 6 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- Lifestyle అరెంజ్ మ్యారెజ్ చేసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాల్సిందే..
- Sports IPL 2024 ఫిక్సింగ్ కలకలం.. నలుగురు అరెస్ట్!
- News బీఆర్ఎస్కు మరో షాక్: బీజేపీలోకి బేతి సుభాష్ రెడ్డి, ఈటలకు మద్దతు
- Movies పడక గదిలోకి వెళ్లందే ఆఫర్లు రావు.. టాప్ సింగర్పై మండిపడ్డ నటి కస్తూరి
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
2021 ఫిబ్రవరిలో పుంజుకున్న మహీంద్రా ట్రాక్టర్ అమ్మకాలు.. కారణం ఇదేనా!!
భారతదేశంలోని దాదాపు అన్ని వాహన తయారీదారులు ఫిబ్రవరిలో జరిపిన అమ్మకాల గణాంకాలను విడుదల చేశారు. ఇందులో భాగంగానే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కూడా తమ అమ్మకాల నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికల ప్రకారం మహీంద్రా యొక్క ద్విచక్ర వాహనాలు మరియు నాలుగు చక్రాల వాహనాల యొక్క అమ్మకాలు గత నెలలో స్వల్పంగా కోలుకున్నాయి.
ఈ వాహనాలతో పాటు మరోవైపు మహీంద్రా యొక్క వ్యవసాయ వాహనాల అమ్మకాలు కూడా పెరిగాయి. భారతదేశానికి చెందిన ట్రాక్టర్ తయారీ సంస్థ మహీంద్రా ట్రాక్టర్స్ తన ఫిబ్రవరి అమ్మకాల గణాంకాల విషయానికి వస్తే, కంపెనీ గత నెలలో దేశీయ మార్కెట్లో పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లను విక్రయించింది. మహీంద్రా అండ్ మహీంద్రా గత నెలలో వ్యవసాయ పరికరాల యొక్క దేశీయ అమ్మకాలలో 24% పెరిగింది.
ఫిబ్రవరి 2021 లో కంపెనీ దేశీయ మార్కెట్లో మొత్తం 27,170 యూనిట్ ట్రాక్టర్లను విక్రయించింది. ఫిబ్రవరి 2020 లో కంపెనీ మొత్తం 21,877 యూనిట్ల ట్రాక్టర్లను దేశీయ మార్కెట్లో విక్రయించినట్లు తెలిసింది.
MOST READ:డ్రైవింగ్ లైసెన్స్లోని ఈ చిత్రం భలే విచిత్రం..చూసారా..!
కంపెనీ అమ్మకాలపై వ్యాఖ్యానిస్తూ మహీంద్రా అండ్ మహీంద్రా ఎఫ్ఇఎస్ చైర్మన్ హేమంత్ సిక్కా, సకాలంలో పంటలు వేస్తున్న కారణంగా మార్కెట్లో ట్రాక్టర్ల డిమాండ్ పెరిగిందన్నారు. అంతే కాకుండా పంట ఉత్పత్తి మరియు పెరుగుతున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కారణంగా ట్రాక్టర్ పరిశ్రమ సానుకూలంగా వృద్ధి చెందుతోందని ఆయన అన్నారు.
ట్రాక్టర్ల ఎగుమతిలో కూడా కంపెనీ మంచి పనితీరు కనబరిచింది. మహీంద్రా & మహీంద్రా గత నెలలో మొత్తం 976 ట్రాక్టర్లను ఎగుమతి చేసింది. గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే ఇది దాదాపు 43% పెరుగుదల కనపరిచింది.
MOST READ:మంత్రి కాన్వాయ్ ఓవర్టేక్ చేయడంతో చిక్కులో పడ్డ పర్యాటకులు
ఫిబ్రవరి 2021 లో కంపెనీ దేశీయ అమ్మకాలు మరియు ఎగుమతుల ద్వారా మొత్తం 28,146 యూనిట్ ట్రాక్టర్లను విక్రయించింది. మహీంద్రా అండ్ మహీంద్రా గత ఏడాది ఫిబ్రవరి నెలలో 22,561 యూనిట్ల ట్రాక్టర్లను విక్రయించింది.
ఈ ఏడాది కంపెనీ అమ్మకాలు 25% పెరిగాయి. మరో ట్రాక్టర్ సంస్థ ఎస్కార్ట్స్ లిమిటెడ్ 10,690 యూనిట్ల ట్రాక్టర్లను విక్రయించింది. ఇది దేశీయ మార్కెట్లో కంపెనీ అమ్మకాల పరిమాణాన్ని 33% కి పెంచింది. మహీంద్రా అండ్ మహీంద్రా ప్రయాణీకుల వాహనాల అమ్మకాలలో 41% పెరుగుదల నివేదించింది.
MOST READ:ఇదేం సిత్రం.. ట్రక్కులో కట్టేసి తీసుకెళ్తున్న జావా 42 బైక్కి ఓవర్స్పీడింగ్ ఛలాన్!?
మహీంద్రా అండ్ మహీంద్రా గత నెలలో 15,391 యూనిట్ల ప్యాసింజర్ కార్లను విక్రయించింది. ఫిబ్రవరి 2020 లో కంపెనీ 10,938 యూనిట్ల ప్యాసింజర్ కార్లను విక్రయించింది. ఏది ఏమైనా కంపెనీ యొక్క అమ్మకాలు గత ఫిబ్రవరి నెలలో సానుకూలంగానే ఉన్నాయి.