Just In
- 1 hr ago ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- 2 hrs ago కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- 4 hrs ago రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- 5 hrs ago కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (వీడియో)
Don't Miss
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Movies Yuva Movie Collections పునీత్ రాజ్కుమార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. యువ మూవీకి రికార్డు కలెక్షన్లు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
జులై 2021లో 50 పెరిగిన మారుతి సుజుకి కార్ సేల్స్
భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, గడచిన జులై నెల అమ్మకాల జాబితాను విడుదల చేసింది. జూలై 2020 అమ్మకాలతో పోల్చుకుంటే, జులై 2021 నెలలో కంపెనీ అమ్మకాలు ఏకంగా 50 శాతం మేర వృద్ధిని సాధించినట్లు కంపెనీ ప్రకటించింది.
మారుతి సుజుకి గడచిన జూలై 2021 లో మొత్తం 1,62,462 యూనిట్ల అమ్మకాలను నివేదించింది. ఇందులో 1,36,500 యూనిట్లు భారతదేశంలో విక్రయించగా, కంపెనీ ఓఈఎమ్ పంపిణీలో భాగంగా 4,738 యూనిట్లను విక్రయించింది. మిగిలిన 21,224 యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది.
జూన్ 2020లో మారుతి సుజుకి ఇండియా మొత్తం అమ్మకాలు 1,08,064 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ సమయంతో పోలిస్తే, గత నెలలో కంపెనీ అమ్మకాలు 50.33 శాతం వార్షిక వృద్ధిని సాధించాయి. గత నెలలో దేశీయ అమ్మకాలు 39 శాతం పెరిగి 1,41,238 యూనిట్లుగా నమోదయ్యాయి. జులై 2020 లో ఇవి 1,01,307 యూనిట్లుగా ఉన్నాయి.
మారుతి సుజుకి ఎంట్రీ లెవల్ మోడల్స్ అయిన ఆల్టో మరియు ఎస్ - ప్రెసో 17,258 యూనిట్ల నుండి 19,685 యూనిట్లకు పెరిగాయి. అలాగే, వ్యాగన్ఆర్, స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్ మరియు టూర్ ఎస్ వంటి చిన్న కార్ల అమ్మకాలు 51,529 యూనిట్ల నుండి 70,268 యూనిట్లకు పెరిగాయి.
మినీ మరియు కాంపాక్ట్ విభాగాలు కలిసి గత నెలలో మొత్తం 90,000 యూనిట్ల విక్రయాలను నమోదు చేశాయి. ఈ సమయంలో సియాజ్ మిడ్-సైజ్ సెడాన్ అమ్మకాలు కూడా 1,303 యూనిట్ల నుండి 1,450 యూనిట్లకు పెరిగాయి.
ఇకపోతే, ఎర్టిగా, ఎక్స్ఎల్6, విటారా బ్రెజా మరియు ఎస్-క్రాస్లను వంటి యుటిలిటీ వాహనాల అమ్మకాలు 19,177 యూనిట్ల నుండి 32,272 యూనిట్లకు పెరిగాయి. ఈ సమయంలో సూపర్ క్యారీ ఎల్సివి అమ్మకాలు 2,768 యూనిట్లుగా నమోదయ్యాయి.
ఇదిలా ఉంటే, మారుతి సుజుకి తమ రెండవ తరం సెలెరియో కారును భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ కారు మార్కెట్లోకి రానుంది. కొత్త సెలెరియో ప్రస్తుత మోడల్ కంటే పెద్దదిగా ఉండబోతోంది. మునుపటితో పోలిస్తే, ఈ మోడల్లో భారీ డిజైన్ అప్గ్రేడ్స్ ఉండనున్నట్లు సమాచారం.
టాప్-ఎండ్ వేరియంట్ సెలెరియో కారులో ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన సుజుకి స్మార్ట్ప్లే టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇంజన్ విషయంలో కూడా మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. మాన్యువల్ మరియు ఏఎమ్టి గేర్బాక్స్ ఆప్షన్లతో 1.0-లీటర్ త్రీ-సిలిండర్ పెట్రోల్ మరియు 1.2-లీటర్ డ్యూయల్-జెట్ పెట్రోల్ ఇంజన్లను ఇందులో ఉపయోగించనున్నట్లు సమాచారం.