Just In
- 1 hr ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 4 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 6 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 10 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Movies Tenent Review: మర్డర్ మిస్టరీ మెప్పించిందా? సత్యం రాజేష్కు హిట్ పడిందా? టెనెంట్ రివ్యూ
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అలెర్ట్; 1.8 లక్షలకు పైగా వాహనాలకు రీకాల్ ప్రకటించిన Maruti Suzuki.. ఇందులో మీ కార్ ఉందా..!!
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీలలో ఒకటి Maruti Suzuki (మారుతి సుజుకి). Maruti Suzuki ఒకప్పటినుంచి కూడా తిరుగులేని బ్రాండ్ ఆ చెలామణి అవుతుంది. కంపెనీ ప్రవేశపెట్టిన బ్రెజ్జా, స్విఫ్ట్ వంటి మోడల్స్ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తోంది.
ఇటీవల వెల్లడైన కంపెనీ నివేదికల ప్రకారం ఆటో మొబైల్ పరిశ్రమలో అత్యధిక అమ్మకాలను చేపట్టిన కంపెనీగా రికార్డ్ సృష్టించింది. ఇంత ప్రాచుర్యమున్న కంపెనీ ఇటీవల 1.80 లక్షలలకు పైగా వాహనాలను రీకాల్ ప్రకటించింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
ఇటీవల Maruti Suzuki (మారుతి సుజుకి) యొక్క సియాజ్, ఎర్టిగా, విటారా బ్రెజ్జా, ఎస్-క్రాస్ మరియు ఎక్స్ఎల్ 6 వంటి దాదాపు 1,81,754 యూనిట్ల కార్లను రీకాల్ చేసింది. కంపెనీ యొక్క 2018 మే 04 నుంచి 2020 అక్టోబర్ 27 వరకు తయారైన అన్ని పెట్రోల్ వాహనాలను రీకాల్ చేసింది.
కంపెనీ రీకాల్ ప్రకటించడానికి ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే Maruti Suzuki యొక్క వాహనాలలో మోటార్ జనరేటర్ యూనిట్లోని లోపం చెక్ చేయడం. అంతహీ కాకుండా కంపెనీ ఇటీవల నీటితో నిండిన ప్రదేశాలకు దూరంగా ఉండాలని తెలిపింది. దీనివల్ల కారులోని ఎలక్ట్రిక్ పరికరాలు తడిసిపోయే ప్రమాదం ఉంది, కావున నీటితో నిండిన ప్రదేశాలకు దూరంగా ఉండాలని కంపెనీని కోరింది.
ఈ రీకాల్ ద్వారా వాహనాలు దెబ్బతిన్న వినియోగదారులందరికీ Maruti Suzuki (మారుతి సుజుకి) త్వరలో తెలియజేస్తుంది. అంతే కాకుండా రీకాల్ గురించి అధికారిక సమాచారాన్ని కంపెనీ యొక్క వెబ్సైట్లోని 'Imp Customer Info' (ఇంప్ కస్టమర్ ఇన్ఫో) విభాగానికి వెళ్లడం ద్వారా కస్టమర్లు తమ వాహనాలు ప్రభావితమయ్యాయా లేదా అని కూడా తెలుసుకోవచ్చు.
కంపెనీ వెబ్సైట్లోని 'Imp Customer Info' వెళ్లడం ద్వారా, కస్టమర్లు తమ వాహనం యొక్క ఛాసిస్ నంబర్ను ఎంటర్ చేసి తమ వాహనం ప్రభావితమైందా లేదా అని తనిఖీ చేయవచ్చు. ఇందులో భాగంగానే Maruti Suzuki కంపెనీ నవంబర్ నుండి దీనికి ప్రభావితమైన కార్లకు సంబంధించిన భాగాలను భర్తీ చేయనుంది.
Maruti Suzuki కంపెనీ ప్రకటించిన ఈ రీకాల్ కి ప్రభావితమైన వాహనాలకు ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇద్హి పూర్తగా కంపెనీ ఉచితంగా అందిస్తుది. కావున మీ వాహనానికి రీకాల్ అవసరమా లేదా ఏ విషయాన్ని మీరు కూడా తెలుసుకుని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
Maruti Suzuki ఇంతకుముందు కూడా దాదాపు 40,453 యూనిట్లను రీకాల్ చేసింది. ఎదుకంటే అప్పుడు హెడ్లైట్ల లోపం కారణంగా రీకాల్ చేయవలసి వచ్చింది. ఆ సమయంలో హెడ్లైట్ల లోపం ఉన్న అందరూ కూడా దీనిని వినియోయించుకున్నారు.
సాధారణంగా వాహనాలు కొనేముందు, కస్టమర్లు బ్రాండ్ చూస్తారు. ఎందుకంటే ఆ బ్రాండ్ మీద వారికున్న నమ్మకం. అయితే ఇలాంటి రీకాల్స్ వల్ల బ్రాండ్పై వినియోగదారులకున్న నమ్మకం దెబ్బతింటుంది. అయితే ఇటీవలి కాలంలో అనేక కంపెనీలు తమ వాహనాలు రీకాల్ చేస్తున్నాయి.
2020 లో భారతదేశంలో మొత్తం 3,80,615 యూనిట్ల వాహనాలు రీకాల్ చేశారు. అయితే 2021 లో ఇప్పటివరకు సుమారు 5 లక్షల వాహనాలను రీకాల్ చేశారు. అంటే దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో రీకాల్ ప్రకటించే వాహనాల సంఖ్య మరింత పెరిగే సూచనలు కపిస్తున్నాయి.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆటోమొబైల్ పరిశ్రమను వేధిస్తున్న సెమీ కండక్టర్స్ చిప్స్ కొరత కారణంగా Maruti Suzuki తమ వాహనాల ఉత్పత్తిని తగ్గించనుంది. సెమీ కండక్టర్స్ చిప్స్ కొరత కొరత కారణంగా Maruti Suzuki (మారుతి సుజుకి) ఇప్పటికే గడచిన ఆగస్ట్ 2021 నెలలో తీవ్ర ఉత్పత్తి అంతరాయాన్ని ఎదుర్కొనగా, ఇప్పుడు సెప్టెంబర్ నెలలో కూడా అదే పరిస్థితి ఏర్పడనుంది.
గ్లోబల్ చిప్ కొరత సెప్టెంబర్ లో హర్యానా మరియు గుజరాత్ రాష్ట్రాల్లోని కంపెనీ ప్లాంట్లలో ఉత్పత్తిని ప్రభావితం చేస్తుందని మారుతి సుజుకి తెలిపింది. వచ్చే నెలలో సాధారణ ఉత్పత్తి కంటే రెండు ప్లాంట్లలో ఉత్పత్తి వాల్యూమ్లు 60 శాతం తక్కువగా ఉండవచ్చని కంపెనీ నివేదించింది.
మారుతి సుజుకి దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీదారు మరియు అటువంటి పరిస్థితిలో, ఇటువంటి తప్పులు వేలాది, మిలియన్ల మంది కస్టమర్ల జీవితాలను ప్రమాదంలో పడేస్తాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి సంఘటనలు పెరిగాయి. ఇలాంటి సంఘటనలు అమ్మకాలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. కావున అమ్మకాలు తగ్గే అవకాశం ఉంటుంది. దీనిని కంపెనీలు దృష్టిలో ఉంచుకోవాలి.