Just In
- 30 min ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 2 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 3 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 5 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- News పవన్ కళ్యాణ్, చంద్రబాబుల కేసుల చిట్టా ఇదే!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Movies నీకెంత బలుపు? ఆర్కే నాయుడుపై సీనియర్ నటి సీరియస్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
చిల్డ్రన్స్ డెవలప్మెంట్ కోసం హైదరాబాద్ ఎంజి సెంటర్ సభ్యులు చేయూత
భారతదేశంలోని చాలా వాహనతయారీదారు అప్పుడపుడు తమ ఉదారతను చాటుకుంటుంటారు. కరోనా మహమ్మరి నేపథ్యంలో చాలా కంపెనీలు ఇటువంటి సహాయాలు చేయడానికి ముందుకువచ్చాయి. ఇందులో ఒకటి ఎంజి మోటార్ కంపెనీ. ఎంజి మోటార్ కంపెనీ తమ హెక్టర్ వాహనాలను అంబులెన్సులుగా మార్చి చాలా హాస్పిటల్స్ కి అందించారు. దీనికి సంబందించిన సమాచారం ఇదివరకటి కథనాలలో తెలుసుకున్నాం..
ఇప్పుడు ఎంజి మోటార్ కంపెనీ యొక్క హైదరాబాద్ కి చెందిన "ఎంజి మోటార్ కార్ క్లబ్" యూనిట్ పిల్లల అభివృద్ధి కోసం మరో అడుగు ముందుకు వేశారు. నివేదికల ప్రకారం ఆంద్రప్రదేశ్ లోని గండికోట ప్రాధమిక పాఠశాలకు తమ వంతు చేయూతను అందించారు. ఎంజి 'మోటార్ కార్ క్లబ్ ఇండియా' యొక్క హైదరాబాద్ సెంటర్ సభ్యులు గండికోట గ్రాండ్ కాన్యన్లో ప్రయాణించి పిల్లల అభివృద్ధికి తోడ్పడ్డారు.
ఇది నిజంగా ప్రశంసించదగ్గ విషయం. ఇక్కడ ఫోటోలను గమనించినట్లయితే ఎంజి మోటార్ కార్ క్లబ్ సభ్యులు స్కూల్స్ వద్ద ఉండటం కూడా చూడవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఈ యూనిట్ సభ్యులు ఇలాంటి కార్యక్రమాలు ఇంతకు ముందు కూడా చేశారు.
2021 మార్చి 7 న ఎంజి మోటార్స్ షోరూం, వడోదర ఎంజిసిసి ఇండియా మరియు కాయకల్ప్ లయన్స్ బ్లైండ్ గర్ల్స్ స్కూల్ కోసం ఒక కార్యక్రమం కూడా నిర్వహించారు.
ఎంజి మోటార్ కంపెనీ భారతదేశంలో ప్రవేశించిన అతి తక్కువ కాలంలోనే అత్యధిక ప్రజాధారణపొందింది. ఈ కంపెనీ నుంచి వచ్చిన ఉత్పత్తులు మార్కెట్లో మంచి అమ్మకాలతో దూసుకెళ్తున్నాయి. కంపెనీ కూడా తమ ఉత్పత్తులలో లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలతో అందిస్తుంది.
MOST READ:కవాసకి ఆఫ్-రోడ్ బైక్లపై అదిరిపోయే ఆఫర్లు.. త్వరపడండి, కేవలం పరిమిత కాలం వరకు మాత్రమే
ఎంజి మోటార్ కంపెనీ ఇటీవల భారత మార్కెట్లో కొత్త ఉత్పత్తులను కూడా ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఉత్పత్తులు కూడా చాలామంది వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఇవి మునుపటి మెడల్స్ కంటే కొంత అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉన్నాయి.
చైనా కార్ దిగ్గజం ఎమ్జి మోటార్స్, భారత మార్కెట్ కోసం తమ సరికొత్త ఎమ్జి జెడ్ఎస్ పెట్రోల్ వెర్షన్ ఎస్యూవీని 'ఆస్టర్' అని పిలిచే అవకాశం ఉంది. ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి ఇది భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.
MOST READ:టైర్లు లేని ఈ ట్రాక్టర్, వ్యవసాయానికి బలేగుంది గురూ..!
ఎంజి మోటార్ కంపెనీ యొక్క గత ఫిబ్రవరి నెల అమ్మకాలు కూడా చాలా మెరుగుపడ్డాయి. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 2021లో ఎంజి మోటార్ ఇండియా మొత్తం 4,329 యూనిట్ల వాహనాలను విక్రయించి కంపెనీ అత్యధిక రిటైల్ అమ్మకాల గణాంకాలను నమోదు చేసినట్లు ప్రకటించింది.