Just In
- 21 min ago కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- 1 hr ago మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- 15 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 18 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
Don't Miss
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- News టీడీపీ ప్లాన్ బీ- వంగవీటి రాధాకు టికెట్?
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Movies Karthika Deepam 2 April 20th: దీపపై పగతో రగిలిపోతున్న నర్సింహ.. శౌర్యని ఇక్కడే చదివిస్తానంటున్న దశరద్!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
కోవిడ్-19 ఎఫెక్ట్: వారం రోజుల పాటు ఎమ్జి మోటార్స్ ప్లాంట్ మూసివేత!
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. కోవిడ్-19 సెకండ్ వేవ్ మునుపటి కంటే వేగంగా, విస్తరిస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తోంది. ఈ నేపథ్యంలో, దేశంలోని అనేక ప్రాంతాల్లో స్వచ్ఛందంగా లాక్డౌన్ విధిస్తున్నారు.
ఈ నేపథ్యంలో, చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్జి మోటార్ ఇండియా, గుజరాత్లోని తమ హలోల్ ప్లాంట్లో ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 29 నుండి మే 5 వరకు ఈ ప్లాంట్ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
దేశంలో 'కోవిడ్ గొలుసును విచ్ఛిన్నం చేసే' ప్రయత్నంలో భాగంగా, తమ ప్లాంట్లో ఉత్పత్తికి తాత్కాలికంగా బ్రేక్ ఇస్తున్నామని ఎమ్జి మోటార్ ఇండియా ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా ధృవీకరించారు.
MOST READ:రూ. 10 కోట్ల విలువైన కారులో ప్రయాణించిన యూట్యూబర్ ఏం చెప్పాడంటే?
సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కోవిడ్ గొలుసును విచ్ఛిన్నం చేయడానికి వడోదరలోని హలోల్ ప్లాంట్ను 7 రోజుల పాటు మూసివేయాలని తాము నిర్ణయించుకున్నామని, తమ ఉద్యోగులు ఈ కఠినమైన సమయాల్లో సురక్షితంగా ఉండటానికి మరియు సమాజాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి కట్టుబడి ఉన్నారని ఆయన తన ట్వీట్లో తెలిపారు.
ప్రస్తుతం గుజరాత్ కోవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎమ్జి మోటార్ ఇండియా తమ ఉద్యోగులు మరియు సమాజం పట్ల జాగ్రత్త వహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం వలన ఉత్పత్తికి అంతరాయం ఏర్పడి, వాహనాల వెయిటింగ్ పీరియడ్ మరింత పెరిగే అవకాశం ఉంది.
MOST READ:మారుతి సుజుకి మాజీ ఎండి 'జగదీష్ ఖత్తర్' మృతి; వివరాలు
గడచిన మార్చి 2021 నెలలో కంపెనీ తమ వాహనాల వెయిటింగ్ పీరియడ్కు సంబంధించి ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసినదే. భారత మార్కెట్లో తాము విక్రయిస్తున్న కార్లకు ఏర్పడుతున్న భారీ డిమాండ్ కారణంగా, వాటి వెయిటింగ్ పీరియడ్ కూడా భారీగా పెరిగిపోతోంది.
ప్రస్తుతం కొత్తగా తమ కార్లు కొనుగోలు చేసే కస్టమర్లు, వాటి డెలివరీ కోసం సుమారు 2-3 నెలలు వేచి ఉండాల్సి వస్తోందని కంపెనీ పేర్కొంది. ఎమ్జి మోటార్ ఇండియా ప్రస్తుతం దేశీయ మార్కెట్లో హెక్టర్, హెక్టర్ ప్లస్, గ్లోస్టర్ మరియు ఎమ్జి జెడ్ఎస్ ఈవీ అనే నాలుగు ఎస్యూవీలను విక్రయిస్తోంది.
MOST READ:అలెర్ట్: కర్ణాటకలో 14 రోజుల కఠిన ఆంక్షలతో కరోనా లాక్డౌన్
గుజరాత్లో ఉన్న హలోల్ ప్లాంట్లో ఎమ్జి మోటార్ ఈ నాలుగు మోడళ్లను తయారు చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాంట్ ఏటా 80,000 వాహనాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. గతంలో అమెరికన్ కార్ బ్రాండ్ జనరల్ మోటార్స్ ఈ ప్లాంట్ను ఆపరేట్ చేసేది. జనరల్ మోటార్స్ నుండి ఎమ్జి మోటార్ ఈ ప్లాంట్ను కొనుగోలు చేసింది.
ఇదిలా ఉంటే, ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రజలకు సహాయం చేయడం కోసం ఈ కంపెనీ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా, మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచడానికి ఎమ్జి మోటార్ కంపెనీ మోక్సీకి చెందిన దేవానందన్ గ్యాసెస్తో చేతులు కలిపింది. వడోదరలోని ప్రధాన వైద్య ఆక్సిజన్ ఉత్పత్తిదారులలో దేవానందన్ గ్యాసెస్ కూడా ఒకటి.
MOST READ:భారత మార్కెట్లో టాప్ 5 బెస్ట్ మైలేజ్ కార్లు.. వివరాలు