Just In
- 1 hr ago తగ్గిన వాహనాల ఎగుమతులు.. అయినా టాప్లో మారుతి సుజుకి.. కారణాలివే.!!
- 15 hrs ago ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్ల్లో ఈ ఆప్షన్ ఉండదు.!!
- 16 hrs ago పుట్టిన రోజు కొత్త కారు కొన్న ప్రముఖ నటి.. ధర తెలిస్తే మీరూ కొనేస్తారు!
- 17 hrs ago ఈ కార్లు సేఫ్టీలో జీరో.. సేల్స్లో టాప్.. అయినా జనాలు వీటినే ఎందుకు కొంటున్నారు?
Don't Miss
- News ఈసీ హుకుం.. టీడీపీ, వైసీపీల పోస్టులతో పాటు ఆ పార్టీల పోస్టులను తొలగించిన ఎక్స్!!
- Movies ఎన్టీఆర్ను ఆ పరిస్థితుల్లో చూసి రాజమౌళి కంటతడి.. జన్మలో అలాంటి క్లైమాక్స్ పెట్టకుండా జక్కన్న షాకింగ్ నిర్ణయం!
- Sports KKR vs RR: కోహ్లీ, ధోనీలా ఆడి మ్యాచ్ గెలిపించాను: జోస్ బట్లర్
- Lifestyle 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకునే వారు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- Technology ఎలోన్ మస్క్ StarLink ఇంటర్నెట్ ఇండియా లాంచ్ త్వరలోనే! ప్రభుత్వం ఆమోదించింది
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
ఫ్రీ వ్యాక్సిన్ సర్వీస్ ప్రారంభించిన ఎంజి మోటార్.. కేవలం వారికీ మాత్రమే
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా ఉదృతంగా ఉంది. ఈ కారణంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో ఉన్న 18 నుంచి 44 సంవత్సరాల వయస్సు ఉన్నవారికి కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఈ వ్యాక్సిన్ కార్యక్రమం ఇప్పటికే దేశ వ్యాప్తంగా జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఆటో మొబైల్ కంపెనీలు తమ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇవ్వడానికి ఒక కార్యక్రమం ప్రారంభించింది.
ప్రముఖ వాహన తయారీసంస్థ అయిన ఎంజీ మోటార్ ఇటీవల తన ఉద్యోగుల కోసం దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ ప్రచారాన్ని ప్రారంభించింది. సంస్థ తన గురుగ్రామ్ మరియు హలోల్ తయారీ కర్మాగారాలతో పాటు అన్ని స్థానిక కార్యాలయాల్లోని ఉద్యోగులకు ఉచిత వ్యాక్సిన్లను అందిస్తోంది.
ఎంజి మోటార్ కంపెనీ ప్రారంభించిన ఈ కార్యక్రమం యొక్క మొదటి రోజు కంపెనీలోని దాదాపు 400 మంది ఉద్యోగులకు కోవిడ్ వ్యాక్సిన్ అందించడం జరిగింది. కంపెనీ ఈ ప్రచారం కోసం స్థానిక ప్రభుత్వ అధికారులతో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
MOST READ:రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన హెల్మెట్.. ఎలా అనుకుంటున్నారా?
కరోనా అధికంగా వ్యాపిస్తున్న కారణంగా ఎంజి మోటార్స్ కంపెనీ ఇటీవల తన తయారీ కర్మాగారంలో ఉత్పత్తిని 7 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఉత్పత్తిని నిలిపివేసిన ఈ సమయంలో తన తయారీ కర్మాగారంలో ఆక్సిజన్ను ఉత్పత్తి చేసి అవసరమైన హాస్పిటల్స్ కి పంపిణీ చేస్తుంది.
ఆక్సిజన్ ఉత్పత్తి కోసం కంపెనీ దేవా నందన్ గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్పై ఆధారపడింది. ఎంజి మోటార్ కంపెనీ సగటున గంటకు 15% ఎక్కువ ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది. రాబోయే కొద్ది రోజుల్లో ఈ మొత్తాన్ని 50% కి పెంచాలని కంపెనీ నిర్ణయించింది. కరోనా బాధితుల కుటుంబాలకు కూడా ఎంజీ మోటార్స్ సహాయం చేస్తోంది.
MOST READ:వావ్.. 19 వ శతాబ్దాల్లోనే ఇలాంటి ట్రైన్స్ సర్వీస్.. సూపర్ టెక్నాలజీ
ఈ సంస్థకు సేవా ఫర్ సోషల్ సర్వీసెస్ అనే విభాగం ఉంది. దీని ద్వారా ఆసుపత్రిలో కరోనాతో బాధపడుతున్న వారి కుటుంబాలకు కంపెనీ ఫుడ్ ప్యాకెట్స్ కూడా అందిస్తుంది. అంతే కాకుండా కంపెనీ కరోనా సోకిన వారికి కోసం ప్రత్యేకంగా రూపొందించిన హెక్టర్ అంబులెన్స్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇది మాత్రమే కాకుండా ఎంజి మోటార్ కంపెనీ కరోనావైరస్ బారిన పడిన ఉద్యోగుల కుటుంబాలకు ఆక్సిజన్ వంటి వాటిని అందిస్తోంది. కంపెనీ ఈ మహమ్మారి నుంచి తన కంపెనీ ఉద్యోగుల భద్రతకోసం తగిన చర్యలు తీసుకుంటోంది. అంతే కాకుండా పేద ప్రజలకు కూడా ఉదారంగా సేవలను అందిస్తోంది.
MOST READ:జెసిబి వల్ల బయటపడిన బీచ్లో చిక్కుకున్న థార్[వీడియో]
ఎంజి మోటార్ ఇండియా 1924 లో ఇంగ్లాండ్లో స్థాపించబడిన మోరిస్ గ్యారేజ్ కంపెనీ స్పోర్ట్స్ కార్లు, రోడ్స్టర్లు మరియు క్యాబ్రియోలెట్లు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. ఎంజి మోటార్ కంపెనీ వాహనాలను బ్రిటిష్ ప్రధానమంత్రులు, బ్రిటిష్ రాయల్టీతో సహా పలువురు ప్రముఖులు ఉపయోగించారు.
గుజరాత్లోని హలోల్లోని ఎంజి మోటార్ కంపెనీ అత్యాధునిక తయారీ కర్మాగారం సంవత్సరానికి 80,000 వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది చాలా విశాలమైన ఉత్పత్తి తయారీ కర్మాగార. ఈ ఉత్పత్తి కర్మాగారంలో సుమారు 2,500 మంది ఉద్యోగులున్నారు.
MOST READ:అక్కడ కరోనా లాక్డౌన్ మరింత పొడిగింపు.. ఈ సర్వీసులకు మాత్రం మినహాయింపు
ఎంజి మోటార్ కంపెనీ మార్కెట్లో ఎంజి హెక్టర్, హెక్టర్ ప్లస్, ఎంజి జెడ్ఎస్ ఈవి మరియు ఎంజి గ్లోస్టర్ వంటి కార్లను భారతదేశంలో విక్రయిస్తుంది. కంపెనీ యొక్క ఈ కార్లు మార్కెట్లో విడుదల హేసినా వెంటనే ఎంతో ప్రాచుర్యం చెందాయి. కావున మంచి అమ్మకాలతో కంపెనీ ఆశించిన ఫలితాలను తీసుకువస్తున్నాయి.