Just In
- 9 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 11 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 14 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 15 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మోటారిస్టులకు గుడ్న్యూస్.. అక్టోబర్ 31 వరకూ వెహికల్ డాక్యుమెంట్స్ వ్యాలిడిటీ పొడగింపు
మోటారిస్టులకు భారత రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఓ తీపికబురు వెల్లడించింది. వచ్చే అక్టోబర్ 31, 2021 వరకు వాహన పత్రాల చెల్లుబాటును పొడిగిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశంలో కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన అంతరాయం కారణంగా గడువు ముగిసిన వాహన పత్రాల చెల్లుబాటు కాలాన్ని మరింత పొడిగించాలని ఎమ్ఓఆర్టిహెచ్ నిర్ణయించింది.
ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఓ అధికారిక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో, వాహనానికి సంబంధించిన అన్ని పత్రాల చెల్లుబాటును అక్టోబర్ 31, 2021 వరకు పొడిగించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదివరకు పత్రాల చెల్లుబాటు ఈ గడువు సెప్టెంబర్ 30, 2021 వరకు ఉండేది.
మోటార్ వాహనాల చట్టం, 1988 మరియు కేంద్ర మోటార్ వాహనాల నియమాల 1989 కి సంబంధించిన డాక్యుమెంట్ల చెల్లుబాటు పొడిగింపు గురించి మార్చి 2019 లో, కేంద్ర రోడ్డు రవాణా మరియు హైవేల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ఒక నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసినదే.
గత ఏడాది మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ లో ఫిట్నెస్ సర్టిఫికెట్, పర్మిట్ (అన్ని రకాలు), డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ లేదా ఇతర సంబంధిత డాక్యుమెంట్లను ప్రజలు కరోనావైరస్ మహమ్మారి కారణంగా విధించిన లాక్డౌన్ వలన, వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోయారు మరియు సకాలంలో వాటిని రెన్యువల్ చేయించుకోలేకపోయారు.
ఈ నేపథ్యంలో, గతేడాది మార్చ్ నుండి ఈ పత్రాల గడువును పలుమార్లు పొడగిస్తూ వచ్చారు. ఇదివరకటి నోటిఫికేషన్ ప్రకారం, ఈ పత్రాల గడువు సెప్టెంబర్ 30, 2021 లేదా అంతకు ముందు ముగియాల్సి ఉంది. కాగా, ఇప్పుడు ఈ పత్రాల చెల్లుబాటును అక్టోబర్ 31, 2021 వరకు పొడిగించబడింది.
ఈ నేపథ్యంలో, తమ వాహన పత్రాలను పునరుద్ధరించుకోలేని వారు, ఈ పత్రాలను అక్టోబర్ 31 లోపు పునరుద్ధరించవచ్చు. ఈ వాహన పత్రాల జాబితాలో డ్రైవింగ్ లైసెన్స్, పర్మిట్లు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లతో పాటుగా మోటారు వాహనాల చట్టం 1988 మరియు సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1989 కిందకు వచ్చే అన్ని పత్రాలు ఉంటాయి.
ఇదిలా ఉంటే, ఇటీవల కేంద్ర రోడ్డు రవాణా మరియు హైవేల మంత్రిత్వ శాఖ భారత రోడ్లపై పాత మరియు అధిక కాలుష్యం కలిగించే వాహనాలను తొలగించడానికి స్వచ్చంద వాహన స్క్రాపేజ్ పాలసీని ప్రకటించిన సంగతి తెలిసినదే. పర్యావరణానికి మరియు ప్రజలు హాని కలిగించే పాత వాహనాలను రోడ్లపై తిరగకుండా చేసి, తద్వారా రహదారుల భద్రతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ వెహికల్ స్క్రాపేజ్ పాలసీని పరిచయం చేసింది.
ఇలా పాత వాహనాలను స్క్రాప్ చేసిన వినియోగదారులకు కార్ కంపెనీలు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు, సదరు వాహన యజమానికి కొనుగోలు చేసే కొత్త వాహనంపై అదనపు తగ్గింపులను మరియు రోడ్డు పన్నులో రాయితీలను అందించడం జరుగుతుంది. ఈ వెహికల్ స్క్రాపేజ్ విధానం కింద, మంత్రిత్వ శాఖ ప్రోత్సాహకాల జాబితాను కూడా విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ప్రకారం, "పాత వాహనం యొక్క స్క్రాపింగ్కు ప్రోత్సాహకంగా, వాహన యజమానులకు స్క్రాపింగ్ ఏజెన్సీ నుండి ఓ సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది, దాని ఆధారంగా కొత్త వాహనంపై రోడ్డు పన్ను నుండి మినహాయింపు ఇవ్వబడుతుంది." సమాచారం ప్రకారం, ఈ రాయితీ ప్రైవేట్ వాహనాలకు 25 శాతం వరకు మరియు రవాణా లేదా వాణిజ్య వాహనాల కోసం 15 శాతం వరకు ఉంటుంది.
పాత వాహనాలకు 8 రెట్లు పెరగనున్న రిజిస్ట్రేషన్ రెన్యువల్ చార్జీలు
ఇదిలా ఉంటే, పాత వాహనాలను పూర్తిగా తొలగించేందుకు కేంద్రం నడుం బిగించింది. ఈ కొత్త వెహికల్ స్క్రాపేజ్ పాలసీ కింద, కేంద్ర ప్రభుత్వం పాత వాహనాల (15 ఏళ్లకు పైబడినవి) యొక్క రిజిస్ట్రేషన్ రెన్యువల్ మరియు ఫిట్నెస్ టెస్ట్ ఫీజులను భారీగా పెంచనుంది. తాజా సమాచారం ప్రకారం, ఏప్రిల్ 1, 2022 వ తేదీ నుండి, 15 సంవత్సరాల కంటే పాతబడిన బైక్, కారు లేదా బస్సు/వాణిజ్య వాహనాల రీ-రిజిస్ట్రేషన్ కోసం చెల్లించాల్సిన ఫీజు ప్రస్తుత ఫీజు కన్నా సుమారు 8 రెట్లు ఎక్కువగా ఉండనుంది.
అంటే, వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి, కొత్త ఫీజు రేట్లు అమలులోకి రానున్నాయన్నమాట. ఇకపై 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ద్విచక్ర వాహనం రిజిస్ట్రేషన్ రెన్యువల్ కోసం రూ. 300 కి బదులుగా, రూ. 1,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఒకవేళ మీరు 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న కారును నడుపుతుంటే, రిజిస్ట్రేషన్ రెన్యువల్ కోసం రూ. 5,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
బస్సులు లేదా ట్రక్కుల వంటి 15 సంవత్సరాలకు పైబడిన ప్రభుత్వ మరియు వాణిజ్య వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ల రెన్యువల్ కూడా ప్రస్తుత ధర కంటే ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉండనున్నాయి. ఇలాంటి వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజు సుమారు రూ. 10,000 నుండి రూ. 12,500 వరకూ ఉంటుంది. దిగుమతి చేసుకున్న ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజు రూ. 10,000 వరకూ మరియు నాలుగు చక్రాల వాహనాలకు రూ. 40,000 వరకూ ఖర్చు అవుతుంది.