Just In
- 6 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 8 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 11 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 12 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కొత్త 2021 రేంజ్ రోవర్ ఎవోక్ విడుదల; ధర రూ.64.12 లక్షలు
బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ తమ సరికొత్త 2021 రేంజ్ రోవర్ ఎవోక్ ఎస్యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ లగ్జరీ ఎస్యూవీ ప్రారంభ ధరను రూ.64.12 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది.
భారతదేశంలో కొత్త రేంజ్ రోవర్ ఎవోక్ బుకింగ్స్ను ఆన్లైన్లో ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. అంతేకాకుండా, నేటి నుండే ఈ ఎస్యూవీ డెలివరీలు కూడా ప్రారంభం అవుతాయని కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ తెలిపింది.
ఈ కొత్త 2021 మోడల్ ఎవోక్ ఎస్యూవీ ప్రఖ్యాత రేంజ్ రోవర్ లగ్జరీ బ్రాండ్ యొక్క అధునాతన డిజైన్ డీటేలింగ్స్, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు మోడ్రన్ లగ్జరీ ఇంటీరియర్ ఫీచర్లతో అప్గ్రేడ్ చేసినట్లు కంపెనీ పేర్కొంది.
ఈ కారు గురించి జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ సూరి మాట్లాడుతూ.. రేంజ్ రోవర్ ఎవోక్ తన ప్రత్యేకమైన, ఆధునిక మరియు స్మార్ట్ డిజైన్తో ఎల్లప్పుడూ తలలు తిప్పుకునేలా చేస్తుందని, ఈ కారులో కొత్త ఇంటీరియర్ డిజైన్, సరికొత్త ల్యాండ్ రోవర్ టెక్నాలజీలు మరియు శక్తివంతమైన ఇంజన్లను ప్రవేశపెట్టడంతో, ఇది మునుపటి కన్నా మరింత శక్తివంతంగా మరియు సమర్థవంతంగా ఉంటుందని అన్నారు.
కొత్త 2021 రేంజ్ రోవర్ ఎవోక్ ఆర్-డైనమిక్ ఎస్ఈ వేరియంట్ (ఇంజినియం 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్) మరియు ఎస్ వేరియంట్ (2.0 లీటర్ డీజిల్ ఇంజన్) ఆప్షన్లలో లభిస్తుంది. భారతదేశంలో కొత్త రేంజ్ రోవర్ ఎవోక్ ధర ఎక్స్-షోరూమ్ ధర రూ.64.12 లక్షల నుండి ప్రారంభమవుతుంది.
ఈ పవర్ఫుల్ ఎస్యూవీలోని 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 184 కిలోవాట్ శక్తిని మరియు 365 ఎన్ఎమ్ టార్క్ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులోని 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ 150 కిలోవాట్ల శక్తిని మరియు 430 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.
రేంజ్ రోవర్ ఎవోక్ లగ్జరీ ఎస్యూవీలో కంపెనీ 3డి సరౌండ్ కెమెరా, పిఎమ్ 2.5 ఫిల్టర్తో క్యాబిన్ ఎయిర్ అయోనైజేషన్, ఫోన్ సిగ్నల్ బూస్టెరాండ్తో కూడిన వైర్లెస్ డివైస్ ఛార్జింగ్ మరియు కొత్త పివి ప్రో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లను అందిస్తోంది.
ఈ ఎస్యూవీలో మొట్టమొదటిసారిగా డీప్ గార్నెట్ / ఎబోనీ అని పిలువబడే కొత్త డ్యూయల్ టోన్ ఇంటీరియర్ కలర్ ఆప్షన్ను ప్రవేశపెట్టారు. కొత్త రేంజ్ రోవర్ ఎవోక్ ఈ విభాగంలో వోల్వో ఎక్స్సి60 మరియు మెర్సిడెస్ జిఎల్సి వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.