Just In
- 14 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 15 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 16 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 17 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Movies బాయ్ ఫ్రెండ్తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వారంటీ & సర్వీస్ ప్యాకేజ్ ఇప్పుడు 2021 జులై 31 వరకు; నిస్సాన్ ఇండియా
భారతదేశంలో కరోనా మహమ్మారి చాలా వేగంగా వ్యాపిస్తున్న కారణంగా దేశం మొత్తం కరోనా లాక్ డౌన్ విధించడం జరిగింది. ఈ కారణంగా దేశంలో దాదాపు అన్ని ఆటో పరిశ్రమలలో ఉత్పత్తి నిలిపివేయడం జరిగింది. అంతే కాకుండా ప్రభుత్వాలకు తమ వంతు సహాయంగా కంపెనీలలో ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తూ అందించడం జరుగుతోంది.
అయితే ఇదిలా ఉండగా కంపెనీలు తమ కస్టమర్లకు సర్వీస్ మరియు వారంటీ వాటికి ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదనే నెపంతో వీటికి సంబంధించిన సర్వీసుల వ్యవధి మొత్తం రెండు నెలలు పొడిగిస్తూ ప్రకటించింది. కావున ఇందులో భాగంగానే నిస్సాన్ ఇండియా ఇటీవల తమ కస్టమర్లకు వారంటీ మరియు ఫ్రీ సర్వీస్ వంటి వ్యవధిని పెంచారు.
కంపెనీ ఇచ్చిన అధికారిక సమాచారం ప్రకారం, కంపెనీ అందించే సర్వీసులన్నీ కూడా ఇప్పుడు రెండు నెలలు పొడిగించారు. ఇందులో వారంటీ, ఫ్రీ సర్వీస్టీ మరియు నిస్సాన్ ప్రామిస్ అని పిలువబడే బ్రాండ్ యొక్క చెల్లింపు నిర్వహణ ప్యాకేజీలు ఉన్నాయి.
నిస్సాన్ ప్రామిస్ ప్యాకేజీలో ప్రీ-పెయిడ్ మెయింటెనెన్స్ ప్యాకేజీలు, ఎక్స్టెండెడ్ వారంటీ మరియు రోడ్-సైడ్ అసిస్టెన్స్ సర్వీస్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఈ చెల్లుబాటు వ్యవధిని 2021 జూలై 31 వరకు పెంచినట్లు కనిపిస్తోంది.
నిస్సాన్ ఇండియా నుండి అధికారిక సమాచారం ప్రకారం కరోనా సమయంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటామని, మరియు కస్టమర్లకు కావలసిన సర్వీసులు సకాలంలో అందించడానికి ప్రయత్నిస్తామని కూడా తెలిపారు. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్ డౌన్ అమలులో ఉంది.
MOST READ:శభాష్ సోనాలిక.. కరోనా సమయంలో కూడా సిబ్బందికి అండగా
ఈ భయానకమైన కరోనా వైరస్ సెకండ్ వేవ్ మునుపటిక్నటే కూడా ఎక్కువ విజృంభించి ఎంతోమంది ప్రాణాలు బలిగొంటోంది. ఈ సమయంలో తమ కంపెనీలలోని తమ శ్రామిక శక్తిని కాపాడటానికి, తయారీదారులు ప్లాంట్లు, కార్పొరేట్ కార్యాలయాలు, షోరూమ్లు మరియు సేవా కేంద్రాలలో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు.
కంపనీలు స్థానిక లాక్డౌన్ మార్గదర్శకాలకు అనుగుణంగా సర్వీస్ సెంటర్ లు మొత్తం మూసివేయబడ్డాయి. ఈ సమయంలో, నిమెయింటెనెన్స్ ప్యాకేజి గడువు ఉన్న వినియోగదారుల వాహనాలు సేవలను పొందలేరు. ఇప్పుడు ఈ ప్యాకేజీలపై ప్రకటించిన పొడిగింపు దేశంలో లాక్డౌన్ ముగిసిన తర్వాత వినియోగదారులకు వారి సమస్యలను క్రమబద్ధీకరించడానికి ఖచ్చితంగా సహాయపడుతుంది.
MOST READ:లాక్డౌన్ రూల్స్ గాలికొదిలేసిన ముఖ్యమంత్రి కొడుకు.. ఎవరో తెలుసా..?
కరోనా సమయంలో కూడా నిస్సాన్ వర్చువల్ రియాలిటీ ప్లాట్ఫామ్తో పూర్తిగా డిజిటల్ కార్ల కొనుగోలు అనుభవాన్ని అందించడంతో కార్ల అమ్మకాలు యదా విధిగా జరుగుతాయి. ప్రస్తుతం లాక్ డౌన్ లో కూడా కారు కొనాలని చూస్తున్న కస్టమర్లు ఇప్పుడు ఇంటి నుంచే కొనుగోలు చేసేస్ అవకాశాన్ని నిస్సాన్ ఇండియా తెలిపింది.