భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ రోజు పెట్రోల్ ధర ఎంతంటే?

భారతదేశంలో వాహనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. వాహనాలు పెరుగుతున్న కారణంగా వాటికి ఇంధన డిమాండ్ కూడా బాగా పెరిగింది. కావున ప్రతిరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం మనం గమనించి ఉంటాము. ఇప్పుడు మళ్ళీ పెట్రోల్ మరియు డీజిల్ ధరలు మళ్లీ పెరగడం ప్రారంభించాయి.

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ రోజు పెట్రోల్ ధర ఎంతంటే?

పెట్రోల్ ధర మునుపటి కంటే గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇప్పుడు పెట్రోల్ పై 25 పైసల పెరుగుదల కారణంగా 2021 జనవరి 18 న ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ. 84.95 కు చేరుకుంది. ఇది నిజంగా రికార్డ్ ధర అనే చెప్పాలి. ఇంతలకు ముందు లీటర్ పెట్రోల్ ధర రూ. 84.

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ రోజు పెట్రోల్ ధర ఎంతంటే?

కరోనా లాక్ డౌన్ తరువాత ప్రతిరోజూ పెరుగుతున్న ఇంధన ధరలను ప్రభుత్వం నిలిపివేసింది. ప్రభుత్వ నిబంధనల తర్వాత దాదాపు ఒక నెల వరకు ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. కాని ఇప్పుడు మళ్ళీ ఇంధన ధరలు ప్రతిరోజూ పెరుగుదల దారి పట్టాయి. ఈ పెరుగుదల సామాన్యుడికి నిజంగా పెనుభారమనే చెప్పాలి.

MOST READ:ఒంటె వల్ల మరణించిన ప్రముఖ బైక్ రైడర్.. ఎవరో తెలుసా!

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ రోజు పెట్రోల్ ధర ఎంతంటే?

భారత రాజధాని నగరం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 84.95 కు కాగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ. 91.56 కు చేరుకుంది. ఇది దేశంలోనే అత్యంత గరిష్ట ధర. ధరల పెరుగుదల ప్రస్తుతం ఒక్క పెట్రోల్ కి మాత్రమే కాదు డీజిల్ కి కూడా వర్తిస్తుంది. కావున డీజిల్ ధరలు కూడా పెరిగాయి.

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ రోజు పెట్రోల్ ధర ఎంతంటే?

ఢిల్లీలో లీటరు డీజిల్ ధర ఇప్పుడు రూ. 71.13, ముంబైలో రూ. 81.87 కు చేరుకుంది. అంతకుముందు జనవరి 7 న పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా 23 పైసలు, 26 పైసలు పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. చమురు కంపెనీలు జనవరి 6 నుండి ప్రతిరోజూ పెంచడం ప్రారంభించాయి.

MOST READ:బైక్ రైడర్‌కి రూ. 1 లక్షకు పైగా జరిమానా.. కారణం మాత్రం ఇదే

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ రోజు పెట్రోల్ ధర ఎంతంటే?

2018 అక్టోబర్ 4 న ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 84 రూపాయలు. అదే రోజు లీటరు డీజిల్ ధర 75.45 రూపాయలు. ఈ ధరలు అమాంతం 2020 చివరి నాటికి పెరగడం ప్రారంభించాయి, అప్పటి నుంచి చాపకింద నీరులా పెరుగుతూనేపోతుంది.

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ రోజు పెట్రోల్ ధర ఎంతంటే?

ఇక బెంగళూరు యొక్క ఇంధన ధరల విషయానికి వస్తే 2021 జనవరి 18 న లీటర్ పెట్రోల్ ధర 87.82 రూపాయలు కాగా, లీటర్ డీజిల్ ధర 79.67 రూపాయలు. అదేవిధంగా చెన్నైలో లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ధరలు వరుసగా రూ .87.63, రూ .80.40 కు చేరాయి.

MOST READ:షూటింగ్ స్పాట్‌కి 12 కి.మీ సైకిల్‌పై వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్.. ఎందుకో మరి

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ రోజు పెట్రోల్ ధర ఎంతంటే?

కరోనా మహమ్మారి కారణంగా చమురు కంపెనీలు పెట్రోల్ మరియు డీజిల్ ధరల సవరణను నిలిపివేసాయి. ప్రధాన చమురు కంపెనీలైన భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందూస్తాన్ పెట్రోలియం రోజువారీ ఇంధన ధరల సవరణ అంతర్జాతీయ ధర మరియు విదేశీ మారకపు రేటుపై ఆధారపడి ఉంటుంది.

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ రోజు పెట్రోల్ ధర ఎంతంటే?

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉదయం 6 గంటల నుండి చమురు ధరలలో మార్పులను అమలు చేస్తుంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించడానికి, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతున్నారు. కావున ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ సదుపాయాన్ని కల్పించడం కోసం దేశంలోని మొత్తం 69,000 పెట్రోల్ పంపుల వద్ద ఛార్జింగ్ స్టేషన్ నిర్మించే ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఏది ఏమైనా రానున్న కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ఎక్కువవుతుంది.

MOST READ:పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్‌లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్

Most Read Articles

English summary
Petrol Price Touches Record High In Delhi At Rs. 84.95/Litre. Read in Telugu.
Story first published: Monday, January 18, 2021, 14:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X