Just In
- 11 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 11 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 13 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 14 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Movies Guppedantha Manasu March 29th: మను ఇక్కడే ఉంటాడంటున్న వసు.. వద్దంటూ గొడవ చేస్తున్న అనుపమ!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చేరుకునేందుకు రెనో ఇండియా కొత్త ప్లాన్స్!
ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో, ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త కాంపాక్ట్ ఎస్యూవీ 'కైగర్'కు కస్టమర్ల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ మోడల్ మార్కెట్లో విడుదలైనప్పటి నుండి రెనో ఇండియా అమ్మకాలు భారీగా పెరిగాయి.
ఈ నేపథ్యంలో, రెనో ఇండియా దేశీయ విపణిలో తమ నెట్వర్క్ పరిధిని విస్తరించుకొని, దేశంలోని మారుమూల గ్రామీణ మార్కెట్లలో సైతం తమ కార్లను అందుబాటులో ఉంచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే, రెనో ఇండియా సిఎస్సి గ్రామీణ్ ఈస్టోర్తో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో తన ఉనికిని బలోపేతం చేయడానికి సిఎస్సి గ్రామీణ్ ఈస్టోర్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు రెనో ఇండియా ప్రకటించింది. రెనో ప్రస్తుతం భారత మార్కెట్లో క్విడ్, ట్రైబర్, కైగర్ మరియు డస్టర్ వంటి కార్లను విక్రయిస్తోంది.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సిఎస్సి గ్రామీణ్ ఈస్టోర్తో భాగస్వామ్యం కుదుర్చుకున్న మొట్టమొదటి నాలుగు చక్రాల వాహనాల తయారీ సంస్థ రెనో ఇండియా కావటం. ఇరు సంస్థల మధ్య కుదిరిన భాగస్వామ్యంలో భాగంగా, పెనో తమ ఉత్పత్తులను సిఎస్సి గ్రామీణ్ ఈస్టోర్లో లిస్ట్ చేయడం జరుగుతుంది.
ఈ భాగస్వామ్యంలో భాగంగా, రెనో ఇండియా సిఎస్సి గ్రామీన్ ఈస్టోర్లో లిస్ట్ చేసిన తమ వాహనాలను విలేజ్ లెవల్ ఎంటర్ప్రెన్యూర్స్ (విఎల్ఈ) ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని సంభావ్య వినియోగదారులకు అందుబాటులో ఉంచబడుతాయి.
గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ ఆర్డరింగ్ మరియు డెలివరీని ప్రోత్సహించడానికి సిఎస్సి (ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో) నిర్వహిస్తున్న ఈ-కామర్స్ ప్లాట్ఫామే ఈ సిఎస్సి గ్రామీన్ ఈస్టోర్. ఇది గ్రామీణ భారతదేశంలో డిజిటల్ చేరికను రియాలిటీ చేస్తుంది.
రెనో ఇండియా తెలిపిన వివరాల ప్రకారం, కంపెనీ తమ ఉత్పత్తులను విఎల్ఈలకు సరఫరా చేయడానికి ఒక యంత్రాంగాన్ని తీసుకువస్తుందని, ఇది ఎంపిక చేసిన సిఎస్సి రూరల్ ఇస్టోర్లో ఉత్పత్తులను జాబితా చేయడంలో సహాయపడుతుందని తెలిపింది. విఎల్ఈలు గ్రామీణ ప్రాంతాలకు సమీపంలో ఉండే సంబంధిత రెనో అధీకృత డీలర్షిప్ల సపోర్ట్ ద్వారా కస్టమర్ ఎండ్ ఎంక్వైరీలను ప్రోత్సహిస్తారు.
ఈ విషయం గురించి రెనో ఇండియా కంట్రీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్రామ్ మామిల్లాపల్లె మాట్లాడుతూ.. తమ సంస్థ గ్రామీణ మార్కెట్లలో విపరీతమైన సామర్థ్యాన్ని చూస్తుందని మరియు గ్రామీణ మార్కెట్లో తమ ఉనికిని పెంచుకోవడానికి ఒక వినూత్నమైన మరియు సమగ్ర వ్యూహంతో అగ్రెసివ్గా వ్యవరిస్తోందని అన్నారు.
ఇటీవలి కాలంలో దేశంలో వచ్చిన డిజిటల్ పరివర్తన భౌతిక సరిహద్దులు మరియు అవరోధాలను చెదరగొట్టడంలో విప్లవాత్మక మార్పును తెచ్చిపెట్టింది. ఇది వివిధ గ్రామీణ మరియు పాక్షిక పట్టణ మార్కెట్లను సాధారణ వేదికపైకి తీసుకురావడానికి సహాయపడింది.
రెనో ఇండియా గ్రామీణ ప్రాంతాల్లో తమ ఉనికిని పెంచుకునేందుకు గ్రామీణ మరియు చిన్న పట్టణాల నుండి 500 మంది విద్యావంతులైన యువకులను నియమించుకుంది. ఆయా ప్రాంతాల్లో రెనో కార్లను మార్కెటింగ్ చేయటానికి వారికి తగిన శిక్షణ ఇచ్చి, గ్రామీణ సేల్స్ ఇంజనీర్లు మార్చారు. ఇది దేశంలో తమ పరిధిని పెంచడానికి మరియు గ్రామీణ మార్కెట్లో బలమైన నెట్వర్క్ను సృష్టించడానికి కంపెనీ చేపట్టిన మరొక చొరవ అని ఆయన అన్నారు.