Just In
- 7 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 8 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 9 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 10 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Movies ఆ పార్టీ ఎంపినే గెలిపించండి.. ప్యాకేజ్ తీసుకొని చెప్పడం లేదు.. రేణు దేశాయ్ సంచలన పోస్ట్
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మీ పాత వాహనాలను ఇలా చేసి, రెనో కార్లపై భారీ తగ్గింపును పొందండి
వెహికల్ స్క్రాప్ పాలసీ కింద రెనాల్ట్ ఇండియా వినియోగదారులకు సరికొత్త బెనీఫీట్స్ అందించనున్నట్లు ప్రకటించింది. ఇటీవల, రెనాల్ట్ మహీంద్రా క్రియో రీసైక్లింగ్ సంస్థ సహాయంతో రిలీవ్ స్క్రాపింగ్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. దీని కింద పాత కార్లను స్క్రాప్ చేస్తే, అటువంటి వినియోగదారులకు కొత్త కార్లపై డిస్కౌంట్లను అందిస్తుంది.
రెనాల్ట్ కంపెనీ ఇప్పుడు తమ పాత వాహనాలను స్క్రాప్ చేస్తే వారికి ట్రైబర్, క్విడ్ మరియు డస్టర్ వంటి కార్ల కొనుగోలుపై మంచి ఆఫర్లను అందిస్తోంది. ప్రస్తుతం ఈ అవకాశం ఢిల్లీ ఎన్సిఆర్, చెన్నై, ముంబై, పూణే మరియు బెంగళూరులలో మాత్రమే అందుబాటులో ఉంది.
రెనాల్ట్ యొక్క కొత్త కారుపై డిస్కౌంట్ తమ పాత కారును స్క్రాప్ చేయడం ద్వారా లభిస్తుంది. ఇది మాత్రమే కాదు, కస్టమర్లు తమ బైక్లు లేదా స్కూటర్లను కూడా స్క్రాప్ చేయాలనుకుంటే, రెనాల్ట్ కొత్త కారుపై డిస్కౌంట్ ఇస్తుంది. స్క్రాప్ పాలసీ ప్రకారం, పాత వాహనాన్ని స్క్రాప్ చేయడానికి కొత్త వాహనంపై కేంద్ర ప్రభుత్వం 4 నుండి 6 శాతం వరకు రాయితీ ఇస్తుండగా, వాహన సంస్థ 5 శాతం అదనపు తగ్గింపును ప్రకటించింది.
MOST READ:ఉద్యోగం నుంచి తీసేశారని బీభత్సం సృష్టించిన మాజీ ఉద్యోగి.. ఇంతకీ ఏం చేసాడో తెలుసా?
స్క్రాప్ పాలసీ క్రింద కొత్త వాహనం యొక్క ప్రయోజనం దాని ధర మరియు స్క్రాప్ చేయబడిన వాహనం యొక్క స్క్రాపింగ్ రేటుపై ఆధారపడి ఉంటుంది. స్క్రాపేజ్ పాలసీ ప్రకారం, 20 ఏళ్లు పైబడిన ప్రైవేట్ వాహనాలు మరియు 15 సంవత్సరాల కంటే పాత కమర్షియల్ వాహనాలు స్క్రాప్ చేయబడతాయి.
స్క్రాప్ విధానం ప్రకారం ఓల్డ్ మెటల్ రీసైక్లింగ్, వాయు కాలుష్యం తగ్గడం, వాహనాల ఎక్కువ ఇంధన సామర్థ్యం చమురు దిగుమతులు మరియు పెట్టుబడులు తగ్గడానికి దారితీస్తుంది. వెహికల్ స్క్రాప్ విధానంతో దేశంలో ఆటోమొబైల్ తయారీదారుల వ్యాపారం 30 శాతం పెరిగి రూ. 10 లక్షల కోట్లకు చేరుకుంటుంది.
MOST READ:భారత్లో మళ్ళీ మొదలైన కరోనా లాక్డౌన్; లెక్కకు మించి వాహనాలు జప్తు, ఎక్కడంటే?
వెహికల్ స్క్రాపింగ్ విధానం ప్రకారం, పాత మరియు ఎక్కువ కాలుష్యానికి కారణమైన వాహనాలను గుర్తించడం ద్వారా ప్రభుత్వం గ్రీన్ టాక్స్ విధిస్తుంది. కావున వాహనాలకు ఎప్పటికప్పుడు పొల్యూషన్ టెస్ట్ చేయడం తప్పనిసరి. ఇందుకోసం ప్రభుత్వం ప్రైవేటు భాగస్వాముల సహాయంతో దేశవ్యాప్తంగా ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్ లను ప్రారంభిస్తోంది.
స్క్రాపింగ్ విధానం రావడంతో భారతదేశంలో కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశం లభించింది. స్క్రాపింగ్ విధానం ప్రకారం కేంద్ర ప్రభుత్వం రూ .10,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది, ఇది 50,000 ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఈ విధానం ప్రకారం సుమారు ఒక కోటి సంఖ్యగల పాత హెవీ, మీడియం మరియు తేలికపాటి వాహనాలు స్క్రాప్ చేయబడతాయి.
ఇంధన దిగుమతుల వ్యయాన్ని తగ్గించడానికి పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ మిశ్రమానికి కేంద్రం ప్రభుత్వం అనుమతించింది. దీనికి ముందు, పెట్రోల్లో కేవలం 10 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని కలపడానికి మాత్రమే అనుమతి ఉండేది. ఇందుకోసం బ్లెండెడ్ పెట్రోల్తో నడిచే వాహనాలను ఉత్పత్తి చేయాలని ఆటోమొబైల్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
బ్లెండెడ్ పెట్రోల్ వాడకం వల్ల దేశంలో ప్రతి సంవత్సరం రూ .1 లక్ష కోట్ల వరకు ఆదా అవుతుందని ఒక నివేదిక తెలిపింది. భారతదేశంలో, ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి, ఇంధనాలను 85% వరకు బయటి దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాము. నేషనల్ బయో ఇంధన విధానం 2018 ప్రకారం, 2030 నాటికి పెట్రోల్లో ఇథనాల్ బ్లెండింగ్ను 20 శాతం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం దేశంలో బయో ఫ్యూయెల్ ఉత్పత్తిని రికార్డు స్థాయికి పెంచే ఆలోచనలు కూడా ఉన్నాయి.
MOST READ:యువకుడితో పోరాడిన 82 ఏళ్ల వృద్ధుడు.. కారణం తెలిస్తే శభాష్ అంటారు