Just In
- 8 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 9 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 11 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 13 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Movies Karthika Deepam 2 April 25th: దీపను టార్గెట్ చేసిన పారిజాతం.. దాడి చేస్తే దిక్కెవరు.. సుమిత్ర
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కుషాక్ ఎఫెక్ట్: జులైలో మూడు రెట్లు పెరిగిన స్కోడా సేల్స్.. 6,000 కి పైగా బుకింగ్స్..
చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా ఆటో ఇండియా, ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన కుషాక్ ఎస్యూవీ అమ్మకాల పరంగా అద్భుతాలు సృష్టిస్తోంది. స్కోడా కుషాక్ ఎఫెక్ట్తో కంపెనీ గత నెలలో భారీ అమ్మకాలను నమోదు చేసింది. జులై 2020తో పోలిస్తే, జులై 2021లో స్కోడా అమ్మకాలు మూడు రెట్లు పెరిగాయి.
స్కోడా ఆటో గత జూలై 2020 నెలలో 922 యూనిట్లను విక్రయించగా, జులై 2021లో 3,080 యూనిట్లను విక్రయించింది. ఈ సమయంలో అమ్మకాలు మూడు రెట్లు పెరిగినట్లు కంపెనీ నివేదించింది. స్కోడా కుషాక్ కాంపాక్ట్ ఎస్యూవీ విజయం వలనే అమ్మకాలు పెరిగాయని కంపెనీ తెలిపింది.
భారతదేశంలో తమ అమ్మకాలను గణనీయంగా పెంచుకోవాలనే లక్ష్యంతో కుషాక్ ఎస్యూవీని ప్రారంభించామని, తమ ప్రణాళిక రూపుదిద్దుకోవడం చాలా ప్రోత్సాహకరంగా ఉందని స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్ అన్నారు.
కరోనా మహమ్మారి నేపథ్యంలో, సవాలుతో కూడిన వాతావరణం ఉన్నప్పటికీ, తాము తమ వ్యూహాత్మక దృష్టికి అనుగుణంగా ఒక విజయవంతమైన ప్రయోగాన్ని నిర్వహించగలిగామమని, అమ్మకాల అంచనాలను చేరుకోగలిగామని ఆయన తెలిపారు.
స్కొడా కుషాక్ కోసం డీలర్షిప్లకు వచ్చే కస్టమర్ల సంఖ్య మరియు కస్టమర్ ఎంక్వైరీల సంఖ్య గణనీయంగా పెరిగిందని, అలాగే, భారతదేశంలో కొత్తగా స్కోడా డీలర్షిప్లను ఏర్పాటు చేసేందుకు డీలర్ భాగస్వాముల నుండి ఆసక్తి పెరిగిందని హోలిస్ చెప్పారు.
స్కోడా బ్రాండ్ని కొత్త మరియు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు తీసుకెళ్లేందుకు తాము అగ్రెసివ్ ప్రణాళికలను అనుసరిస్తున్నామని, దేశవ్యాప్తంగా, తమ శ్రేష్ఠత మరియు కస్టమర్-సెంట్రిసిటీ దృష్టిని పంచుకునే భాగస్వాముల కోసం తాము ఎదురు చూస్తున్నామని ఆయన అన్నారు.
స్కొడా కుషాక్ ఎస్యూవీ విషయానికి వస్తే, జూన్ 28వ తేదీన కంపెనీ ఈ కారుని భారత మార్కెట్లో విడుదల చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకూ స్కోడా కుషాక్ ఎస్యూవీ కోసం 6,000 యూనిట్లకు పైగా బుకింగ్లు వచ్చినట్లు కంపెనీ పేర్కొంది.
కేవలం రూ.10.49 లక్షల ప్రారంభ ధరకే స్కోడా తమ కుషాక్ ఎస్యూవీని మార్కెట్లో విడుదల చేసింది. ఇది యాక్టివ్, యాంబిషన్ మరియు స్టైల్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.17.59 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)గా ఉంది.
స్కోడా కుషాక్ 1.0-లీటర్, 3-సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్తో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్పి పవర్ను మరియు 175 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, కంపెనీ ఇందులో 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ను ఈ ఆగస్ట్ నెలలో మార్కెట్లో విడుదల చేయనుంది. ఇందులోని 1.5-లీటర్ ఇంజన్ గరిష్టంగా 150 బిహెచ్పి పవర్ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.
స్కోడా ఆటో గడచిన జూలై 2021 లో తన నెట్వర్క్ ఉనికిని దాదాపు 15 శాతం పెంచింది. ఈ ఏడాది ఆగస్టు 2021 నాటికి దేశవ్యాప్తంగా 100 కి పైగా నగరాల్లో తన ఉనికిని విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కొత్తగా 100 నగరాల్లో ఏర్పాటు చేయబోయే తమ టచ్పాయింట్లతో కలిపి కంపెనీ యొక్క సేల్స్ అండ్ సర్వీస్ సెంటర్ల సంఖ్య 170 కి చేరుకోనుంది.