Just In
- 14 hrs ago రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- 17 hrs ago మార్కెట్లో వీటికి తిరుగే లేదు.. కొత్త బైక్ కొనాలనుకుంటే ఈ లిస్ట్ అస్సలు మిస్ అవ్వకండి
- 19 hrs ago వారెవ్వా.. యూట్యూబర్స్ వాడే కార్లు ఇలా ఉన్నాయా!.. ఓ లుక్కేసుకోండి
- 19 hrs ago రూ. 10 లక్షల లోపు ధరలో విడుదల కాబోతున్న ప్రముఖ బ్రాండ్ల కార్లు ఇవే..
Don't Miss
- Movies భర్తకు విడాకులిచ్చి మరొకరితో డేటింగ్.. 38 ఏళ్ల ఏజ్లో జగతి మేడం రొమాన్స్ చూశారా?
- Finance IT News: CEO మైండ్ బ్లాంక్ చేసిన IT ఉద్యోగి.. నెట్టింట పోస్ట్ వైరల్.. ఆ ఒక్క మాటతో..
- News తెలంగాణా కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు నేడే: కాంగ్రెస్ సిఈసి భేటీకి సీఎం రేవంత్ రెడ్డి!!
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్పై వేటు!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
ఒక్క రోజులో 100 నిస్సాన్ మాగ్నైట్ కార్ల డెలివరీ; ఎక్కడో తెలుసా?
బెంగుళూరుకు చెందిన సన్నీ నిస్సాన్ డీలర్షిప్ ఒక్క రోజులో 100 మాగ్నైట్ కార్లను డెలివరీ చేసి రికార్డు సృష్టించింది. ఇదివరకు రాజమండ్రిలోని 'కంటిపుడి నిస్సాన్' డీలర్షిప్ ఒక్క రోజులో 36 మాగ్నైట్ కార్లను డెలివరీ చేసిన సంగతి తెలిసినదే.
నిస్సాన్ ఇండియా ఈ కారును డిసెంబర్ 2020లో భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆనెలలో సమయాభావం కారణంగా, కంపెనీ అధిక సంఖ్యలో వీటిని కస్టమర్లకు అందించలేకపోయింది. దీంతో ఈ జనవరి 2021 నెలలో కంపెనీ చాలా చోట్ల మాగ్నైట్ మెగా డెలివరీని ప్రారంభించింది.
ప్రస్తుతం నిస్సాన్, భారత మార్కెట్లో రెండు దేశీయ మోడళ్లను మాత్రమే విక్రయిస్తోంది. ఇందులో నిస్సాన్ కిక్స్ మరియు ఇటీవలే విడుదలైన మాగ్నైట్ ఉన్నాయి. మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్యూవీని గత నెలలో కేవలం రూ.4.99 లక్షల, (ఎక్స్-షోరూమ్, ఢల్లీ) ప్రారంభ ధరకే విడుదల చేశారు.
MOST READ:ఫలించిన కల; భారత్లో ప్రారంభమైన ఎయిర్ టాక్సీ సర్వీస్
ఆకర్షణీయమైన డిజైన్, సరసమైన ధర కారణంగా మార్కెట్లో ఈ ఎస్యూవీకి భారీ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటి వరకూ ఈ మోడల్ కోసం 33,000 యూనిట్లకు పైగా బుకింగ్లు వచ్చాయి. దీంతో దీని వెయిటింగ్ పీరియడ్ కూడా భారీగా పెరిగిపోయింది. కస్టమర్ ఎంచుకునే వేరియంట్ను బట్టి దీని వెయిటింగ్ పీరియడ్ 6-8 నెలల వరకూ ఉంటోంది.
ఈ నేపథ్యంలో, నిస్సాన్ మాగ్నైట్ కోసం వస్తున్న డిమాండ్ను తీర్చడానికి కంపెనీ తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసింది. నిస్సాన్ తమ చెన్నై ప్లాంట్లో అదనంగా మరో 1000 మంది సిబ్బందిని నియమించుకొని, మూడవ షిఫ్టును కూడా ప్రారంభించింది.
MOST READ:కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!
నిస్సాన్ మాగ్నైట్ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తోంది. ఇందులో ఒకటి 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 99 బిహెచ్పి పవర్ను మరియు 160 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్వుల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.
ఇకపోతే, రెండవది 1.0-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 72 బిహెచ్పి పవర్ను మరియు 96 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్ ఆప్షన్తో లభిస్తుంది.
MOST READ:ఒంటె వల్ల మరణించిన ప్రముఖ బైక్ రైడర్.. ఎవరో తెలుసా!
నిస్సాన్ మాగ్నైట్ ఈ విభాగంలో బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లతో లభిస్తోంది. ఇందులో ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్లు, ఎల్-ఆకారపు ఎల్ఈడి డిఆర్ఎల్లు, ఎలక్ట్రిక్ సన్రూఫ్, 16 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ మరియు వాటి ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లు మొదలైనవి ఉన్నాయి.
ఇందులోని ఇంటీరియర్ ఫీచర్లను గమనిస్తే, పూర్తి-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8 ఇంచ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, ట్రాక్షన్ కంట్రోల్స్, రియర్ ఎసి వెంట్స్ మొదలైనవి ఉన్నాయి.
MOST READ:బైక్ రైడర్కి రూ. 1 లక్షకు పైగా జరిమానా.. కారణం మాత్రం ఇదే
నిస్సాన్ ఇటీవలే బేస్ వేరియంట్ నిస్సాన్ మాగ్నైట్ ఎక్స్ఈ ధరను కంపెనీ రూ.50,000 మేర పెంచింది. తాజా ధర పెంపు తర్వాత మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ ప్రారంభ ధర రూ.5.49 లక్షలు, ఎక్స్షోరూమ్ (ఇండియా)గా ఉంది. ఈ ఒక్క వేరియంట్ ధర మినహా మిగిలిన వేరియంట్ల ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.