Just In
- 8 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 10 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 11 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 13 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Movies Karthika Deepam 2 April 25th: దీపను టార్గెట్ చేసిన పారిజాతం.. దాడి చేస్తే దిక్కెవరు.. సుమిత్ర
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఒక్క నెలలో 2 వేలు కోట్లకు పైగా ఫాస్ట్ట్యాగ్ వసూల్.. చూసారా !
నేషనల్ హైవే అథారిటీ అఫ్ ఇండియా ప్రకారం వాహనాలకు ఫాస్ట్ట్యాగ్ తప్పనిసరి. 2021 జనవరి 01 నుంచి ఫాస్ట్ట్యాగ్ తప్పని సరి అని హైవే అథారిటీ అఫ్ ఇండియా ప్రకటించింది. కానీ ఇప్పడు ఆ గడువును పెంచుతూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఇప్పుడు ఫాస్ట్ట్యాగ్ 2021 ఫిబ్రవరి 15 నుంచి తప్పని సరిగా ఉండాలి.
రోజు రోజుకి ఫాస్ట్ట్యాగ్ వినియోగదారుకు ఎక్కువవుతున్నారు. ఈ కారణంగా టోల్ వసూలు కూడా ఎక్కువవుతోంది. 2020 డిసెంబర్ నాటికి భారతదేశంలో మొత్తం రూ. 2,303.79 కోట్ల టోల్గేట్ వసూలు చేసినట్లు తెలిసింది. ఇది కేవలం ఫాస్ట్ట్యాగ్ నుంచి వసూలు చేసిన డబ్బు.
ఫాస్ట్ట్యాగ్ వసూలు 2020 నవంబర్ తో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు 201 కోట్లు. ఈ గణాంకాలను జనవరి 5 న నేషనల్ హైవే అథారిటీ అఫ్ ఇండియా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వెల్లడించారు. ఫాస్ట్ట్యాగ్ వల్ల వసూలవుతున్న డబ్బు రోజురోజుకి పెరుగుతోంది.
MOST READ:ఇదొక 'చెత్త' లంబోర్ఘిని కార్.. అవును మీరు చదివింది కరెక్టే..
ఇప్పుడు చాలామంది వాహనదారులు ఫాస్ట్ట్యాగ్ సేవలను ఉపయోగించుకుంటున్నారు. ఈ కారణంగా ఎక్కువ టోల్ వసూలు అవుతుంది. ఫాస్ట్ట్యాగ్ గడువు ఇప్పుడు ఫిబ్రవరి 15 కి పొడిగించడం వల్ల, అప్పటి వరకు ఫాస్ట్ట్యాగ్ లేని వాహనాలు టోల్గేట్ల వద్ద టోల్ ఫీజు నగదు రూపంలో చెల్లించవచ్చు.
ఈ గడువును మళ్ళీ పొడిగించే అవకాశం ఉండదు, కాబట్టి ఫిబ్రవరి 15 లోపు వాహనాల్లో ఫాస్ట్ట్యాగ్ను పొందటం మంచిది. ఫాస్ట్ట్యాగ్ ద్వారా వచ్చే ఆదాయంపై జాతీయ రహదారి అథారిటీ (ఎన్హెచ్ఏఐ) ప్రతి నెల పత్రికా ప్రకటన ద్వారా విడుదల చేస్తుంది.
MOST READ:మైలేజ్ తగ్గుతోందా? బహుశా ఇవే కారణాలు కావచ్చు!
2020 నవంబర్ తో పోల్చితే డిసెంబరులో ఫాస్ట్ట్యాగ్ ద్వారా వసూలైన మొత్తం రూ. 120 కోట్లు ఎక్కువ అని ఇటీవల విడుదలైన ప్రకటన వల్ల తెలుస్తోంది. ఫాస్ట్ట్యాగ్ ద్వారా టోల్ ఫీజు వసూలు పెంచడం కూడా జాతీయ రహదారి అథారిటీని ప్రోత్సహించింది. ఈ సంఖ్య భారతదేశంలో పెరుగుతున్న ఫాస్ట్ట్యాగ్ వినియోగాన్ని చూపిస్తుంది.
ఫాస్ట్ట్యాగ్ ద్వారా టోల్ ఫీజు చెల్లించడం వల్ల టోల్ గేట్లలో చాలావరకు రద్దీని తగ్గించవచ్చు. సాధారణంగా అయితే నగదు చెల్లించాల్సి వచ్చినప్పుడు టోల్ గేట్ లో ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వచ్చేది. కానీ ఫాస్ట్ట్యాగ్ ఉపయోగించడం వల్ల వేచి ఉండాల్సిన సమయం దాదాపు తగ్గుతుంది.
MOST READ:ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ డెలివరీ ప్రారంభించిన ఏప్రిలియా ; వివరాలు
ప్రధానంగా టోల్ గేట్ లో వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి ఈ ఫాస్ట్ట్యాగ్లను ప్రవేశపెట్టారు. ఫాస్ట్ట్యాగ్ను స్వీకరించడం వల్ల వాహనాలు తొందరగా వెళ్ళటమే కాకుండా, కొంతవరకు ఇంధనాన్ని కూడా అదా చేయవచ్చు. ఇప్పుడు ఫాస్ట్ట్యాగ్ వల్ల టోల్గేట్ల వద్ద సిబ్బందిని సంప్రదించాల్సిన అవసరం లేదు. ఇది కరోనావైరస్ సంక్రమణను కూడా దూరం చేస్తుంది.