Just In
- 9 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 11 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 12 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 15 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Movies డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
టొయోటా కార్ల విషయంలో పెరగనున్న వెయిటింగ్ పీరియడ్.. కారణం ఏంటంటే..?
జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా, భారతదేశంలో అందించే కొన్ని కార్ల వెయిటింగ్ పీరియడ్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం, కంపెనీ తీసుకున్న తాజా నిర్ణయమే. అదేంటంటే, టొయోటా వచ్చే నవంబర్ నెలలో తమ ఉత్పత్తి లక్ష్యం (ప్రొడక్షన్ టార్గెట్) లో 15 శాతం తగ్గించాలని నిర్ణయించింది. విడిభాగాల కొరత కారణంగా, కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇది వరకు టొయోటా ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 2021 నెలలో 1 మిలియన్ కార్ల (10 లక్షల కార్లను) ఉత్పత్తి చేయాలని లక్ష్యం పెట్టుకుంది. కానీ, ఇప్పుడు టొయోటా ఈ లక్ష్యాన్ని 8.50 లక్షల నుండి 9 లక్షల కార్లకు తగ్గించాలని నిర్ణయించింది. టొయోటా విడుదల చేసిన ఒక ప్రకటనలో కంపెనీ ఈ విషయాన్ని వెల్లడించింది.
కోవిడ్-19 సంక్షోభం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అనే ఆటోమొబైల్ కంపెనీలు ఇప్పటీ విడిభాగాల కొరతను ఎదుర్కుంటున్నాయి. వీటిలో టొయోటా కూడా ఉంది. ఈ విడిభాగాల కొరత నేపథ్యంలో, టొయోటా తమ వాహనాల ఉత్పత్తిని తగ్గించడానికి నిర్ణయం తీసుకుంది.
టొయోటా విడుదల చేసిన ఒక ప్రకటనలో జపాన్లో వాహనాల ఉత్పత్తిని దాదాపు 50,000 కార్లు తగ్గిస్తుందని పేర్కొనబడింది. అదే సమయంలో, విదేశీ వాహనాల ఉత్పత్తి సుమారు 50,000 నుండి 1 లక్షల యూనిట్లు తగ్గించబడుతుందని అంచనా వేయబడింది. ఇంతకుముందు, టొయోటా గత సెప్టెంబర్లో కూడా కార్ల ఉత్పత్తిని తగ్గించింది.
టొయోటా గత సెప్టెంబర్ నెలలో ఉత్పత్తిని దాదాపు 3 శాతం తగ్గించింది. మార్చి 21, 2022 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గానూ టొయోటా తన మొత్తం ఉత్పత్తి లక్ష్యాన్ని 9 మిలియన్ కార్ల (90 లక్షల కార్లు) నుండి మార్చలేదని పేర్కొంది. టొయోటా సెప్టెంబర్ మరియు అక్టోబర్లో నెలల్లో చిన్న తరహా ఉత్పత్తి కోతలు స్థిరంగా ఉంచడానికి సహాయపడిందని కూడా తెలిపింది.
టొయోటా ఉత్పత్తి తగ్గింపు చర్యల కారణంగా, కార్ల వెయిటింగ్ పీరియడ్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి టొయోటా ఈ విడిభాగాల కొరతను అధిగమించేందుకు చురుకుగా ప్రయత్నిస్తోంది. కానీ విడిభాగాల కొరత టొయోటాకే పరిమితం కాదు. ప్రపంచంలోని అనేక ప్రముఖ కంపెనీలు కూడా ఈ విడిభాగాల కొరతతో బాధపడుతున్నాయి.
ఇటీవలి కాలంలో సెమీకండక్టర్స్ చిప్స్ కార్ల తయారీలో ముఖ్యమైన భాగాలలో ఒకటి గా మారింది. వీటి కొరత ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇది ప్రపంచంలోని చాలా కంపెనీల కార్ల ఉత్పత్తిని ప్రభావితం చేసింది. ఈ సమస్య వలన భారతదేశంలోని కార్ కంపెనీలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా తమ కొత్త తరం థార్ ఎస్యూవీ విషయంలో సుదీర్ఘ వెయిటింగ్ పీరియడ్ ఉండటానికి కూడా ఈ సెమీకండక్టర్ల కొరతే ప్రధాన కారణం. కొత్త తరం మహీంద్రా థార్ ఎస్యూవీకి భారతదేశంలో మంచి ఆదరణ లభించింది. కానీ, అధిక డిమాండ్ కి తగినట్లుగా సప్లయ్ లేదు. దీంతో మహీంద్రా ఈ డిమాండ్ను తీర్చలేకపోయింది.
సెమీకండక్టర్ల కొరత కారణంగా కొత్త తరం మహీంద్రా థార్ ఎస్యూవీ కోసం వెయిటింగ్ పీరియడ్ గణనీయంగా పెరుగుతోంది. సెమీకండక్టర్ కొరత సమస్య ఎప్పుడు ముగుస్తుందనేది ఖచ్చితంగా తెలియట్లేదు. ఆటోమొబైల్ పరిశ్రమ నిపుణల ప్రకారం, ఈ సమస్య దీర్ఘకాలం పాటు కొనసాగుతుందని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో, సెమీకండక్టర్ల చిప్స్ కొరతను ఎదుర్కునేందుకు ఆటోమొబైల్ కంపెనీలు ప్రత్యామ్నాయాల గురించి తీవ్రంగా ఆలోచించడం ప్రారంభించాయి. ఎలక్ట్రానిక్ పరికకాలు, స్మార్ట్ ఫోన్లు మరియు కార్లలో ఉపయోగించే ఇన్ఫోటైన్మెంట్స్ అలాగే లేటెస్ట్ కార్ కెనెక్ట్ మరియు టెక్ ఫీచర్లలో ఈ సెమీ కండక్టర్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఫలితంగా, వీటికి డిమాండ్ ఒక్కసారిగా ఊపందుకుంది.
ఇదిలా ఉండగా Toyota (టొయోటా) మార్కెట్లో తన బ్రాండ్ కార్ల ధరలను ఇప్పుడు దాదాపు రూ. 61,000 వరకు పెంచింది. Toyota ఇప్పుడు టొయోటా గ్లాంజా, అర్బన్ క్రూయిజర్, ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్ మరియు టొయోటా క్యామ్రీ ధరలను పెంచింది. అయితే కంపెనీ యొక్క టొయోటా వెల్ఫైర్ ధరను మాత్రం పెంచలేదు. ఇందులో కూడా కంపెనీ యొక్క క్యామ్రీ ధరను ఏకంగా 61,000 రూపాయలు పెంచింది. టొయోటా కంపెనీ యొక్క పెరిగిన కార్ల ధరల గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటేఇక్కడ క్లిక్ చేయండి. మీకు కావలసిన కారు ధరలను గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.