వోల్వో భారత్‌లో విడుదల చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ; పూర్తి వివరాలు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన శకం మొదలైంది. ఈ నేపథ్యంలో భాగంగా దాదాపు ఇప్పటికే చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఈ తరుణంలో ప్రముఖ కార్ తయారీ సంస్థ వోల్వో కూడా సరికొత్త ఆల్-ఎలక్ట్రిక్ ఎక్స్‌సి 40 రీఛార్జ్ ఎస్‌యూవీని భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది.

వోల్వో భారత్‌లో విడుదల చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ; పూర్తి వివరాలు

వోల్వో కంపెనీ తన ఎక్స్‌సి 40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేయడానికి ముందే ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఎక్స్‌సి 40 రీఛార్జ్ యొక్క బుకింగ్స్ 2021 జూన్ నుండి భారతదేశం అంతటా ప్రారంభమవుతుందని వోల్వో ధృవీకరించింది. అయితే ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ డెలివరీలు ఈ ఏడాది అక్టోబర్ నుంచి ప్రారంభమై దశలవారీగా జరగనున్నట్లు కూడా కంపెనీ తెలిపింది.

వోల్వో భారత్‌లో విడుదల చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ; పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లో వోల్వో ఎక్స్‌సి 40 రీఛార్జ్ ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగానికి సరికొత్తగా ఉంటుంది. ప్రస్తుతం ఈ విభాగంలో మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి ఉంది. ఈ వోల్వో యొక్క ఎక్స్‌సి 40 రీఛార్జ్ భారత మార్కెట్లో విడుదలైన తర్వాత, జాగ్వార్ I-పేస్ మరియు ఆడి ఇ-ట్రోన్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ఈ రెండూ కూడా త్వరలో వస్తాయని భావిస్తున్నారు.

MOST READ:త్వరపడండి.. హోండా యాక్టివా 125 పై 5000 క్యాష్‌బ్యాక్ ఆఫర్, వారికి మాత్రమే

వోల్వో భారత్‌లో విడుదల చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ; పూర్తి వివరాలు

కొత్త వోల్వో ఎక్స్‌సి 40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని సిబియు మార్గం ద్వారా భారత్‌లోకి దిగుమతి చేయనున్నారు. బెల్జియంలోని ఘెంట్‌లోని బ్రాండ్ సౌకర్యం వద్ద ఈ ఎస్‌యూవీని తయారు చేయనున్నారు. భారతీయ మార్కెట్ కోసం ప్లాన్ చేసిన అనేక ఉత్పత్తులలో ఎక్స్‌సి 40 రీఛార్జ్ మొదటిదని కంపెనీ తెలిపింది.

వోల్వో భారత్‌లో విడుదల చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ; పూర్తి వివరాలు

ప్రతి సంవత్సరం ఒక కొత్త ఎలక్ట్రిక్ ఉత్పత్తిని మార్కెట్లో ప్రవేశపెట్టే ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని వోల్వో ధృవీకరించింది. వచ్చే ఏడాది ఎప్పుడైనా మార్కెట్లోకి ప్రవేశించబోయే సి40 రీఛార్జ్ కంపెనీ యొక్క రెండవ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.

MOST READ:బెంగళూరులో మీకు నచ్చిన బైక్ డ్రైవ్ చేయాలంటే.. ఇలా బుక్ చేయండి

వోల్వో భారత్‌లో విడుదల చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ; పూర్తి వివరాలు

వోల్వో ఎక్స్‌సి 40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ స్టాండర్డ్ ఐసి-ఇంజన్ పవర్డ్ మోడల్ మాదిరిగానే డిజైన్ మరియు స్టైలింగ్ ఎలిమెంట్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ రెండింటి మధ్య ఉన్న పెద్ద తేడాలు ఏమిటంటే, ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి గ్రిల్ స్థానంలో బాడీ-కలర్ ప్యానెల్, కొత్త అల్లాయ్ వీల్స్ మరియు 31-లీటర్ల చిన్న స్టోరేజ్ ప్లేస్ లభిస్తాయి.

వోల్వో భారత్‌లో విడుదల చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ; పూర్తి వివరాలు

రాబోయే వోల్వో ఎక్స్‌సి 40 రీఛార్జ్ డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్స్ ద్వారా వస్తుంది. ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ 408 బిహెచ్‌పి మరియు 660 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుందని, ఇది కేవలం 4.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ స్ప్రింట్ చేయడానికి అనుమతిస్తుంది. ఎక్స్‌సి 40 రీఛార్జ్ ఒకే ఛార్జీపై 418 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది.

MOST READ:కారులోపల అలంకరణ వస్తువులున్నాయా.. వెంటనే తీసెయ్యండి, లేకుంటే..

వోల్వో భారత్‌లో విడుదల చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ; పూర్తి వివరాలు

వోల్వో ఎక్స్‌సి 40 రీఛార్జ్ భారత మార్కెట్లో ధృవీకరించబడిన సరికొత్త ఆల్-ఎలక్ట్రిక్ ప్రీమియం ఎస్‌యూవీ ఆఫర్. కొత్త వోల్వో ఎక్స్‌సి 40 రీఛార్జ్ భారతదేశంలో బ్రాండ్ యొక్క మొట్టమొదటి ఇ-ఎస్‌యూవీ అవుతుంది, అయితే ఇది చివరిది కాదు. ఇది దేశీయ మార్కెట్లో విడుదలైన తర్వాత ఏవిధమైన స్పందనను చూరగొంటుందో వేచి చూడాలి.

Most Read Articles

Read more on: #వోల్వో #volvo
English summary
New Volvo XC40 Recharge Unveiled In India Ahead Of Launch. Read in Telugu.
Story first published: Tuesday, March 9, 2021, 20:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X