Just In
- 10 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 11 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 12 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 13 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మహీంద్రా ట్రాక్టర్ ఉత్పత్తిలో రికార్డ్ బద్దలు కొట్టిన తెలంగాణ.. KTR పై ఆనంద్ మహీంద్రా కామెంట్స్
తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ, అభివృద్ధిలో శరవేగంగా ముందుకు సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా అందరిచూపు తెలంగాణా వైపే పడుతోంది. అంతే కాకుండా తెలంగాణాకు కొత్త కొత్త పరిశ్రమలను తీసుకురావడానికి అక్కడి ప్రభుత్వం కూడా నిరంతరం పాటుపడుతూనే ఉంది. ఇందులో భాగంగానే కొత్త కంపెనీలు కూడా ఇక్కడ నెలకొల్పబడుతున్నాయి. పరిశ్రమలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.
తెలంగాణలో మహీంద్రా ఫార్మ్ ఎక్విప్మెంట్ సెక్టార్లో భాగమైన మహీంద్రా ట్రాక్టర్స్ యొక్క జహీరాబాద్ కంపెనీ ట్రాక్టర్ తయారీ కేంద్రం నుండి ఇటీవల 3,00,001 వ ట్రాక్టర్ విడుదలైంది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ యొక్క జహీరాబాద్ కంపెనీ ట్రాక్టర్ తయారీ కేంద్రం 2012 వ సంవత్సరంలో ప్రారంభించబడింది. ఈ తయారీ కేంద్రంలో ఇప్పుడు ఏకంగా 3,00,001 వ ట్రాక్టర్ ని సగర్వంగా విడుదల చేశారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వ ఐటీ, పరిశ్రమలు శాఖామంత్రి కెటి రామారావు (KTR) కూడా పాల్గొన్నారు.
ఈ ట్రాక్టర్ విడుదల సందర్భంగా KTR మాట్లాడుతూ.. జహీరాబాద్లోని మహీంద్రా యొక్క తయారీ కేంద్ర కేవలం భారతీయ మార్కెట్ కి మాత్రమే కాకూండా ప్రపంచ మార్కెట్ కి సైతం ఎగుమతి చేయడానికి ఉపయోగపడుతోంది. ఇది నిజంగా గర్వకారణమైన విషయం. మొత్తం మీద తెలంగాణా ట్రాక్టర్ ఎగుమతుల్లో ప్రధాన కేంద్రంగా మారినందుకు చాలా సంతోషిస్తున్నామని అన్నారు.
అంతే కాకుండా ఈ సందర్భంగా మహీంద్రా చైర్మన్ 'ఆనంద్ మహింద్ర'ను ఉద్దేశించి.. ఆనంద్ మహీంద్రా గారూ చూడండి, నేను మీ ఉత్పత్తులకు ఫోజులిస్తూ, మార్కెటింగ్ చేయడం కోసం ఎలా ప్రచారం కల్పిస్తున్నానో, కాబట్టి మీరు మా రాష్ట్రానికి మరిన్ని వ్యాపార అవకాశాలను కల్పించాలని చమత్కారంగా ట్వీట్ చేశారు.
కేటీఆర్ చేసిన ట్వీట్కు ఆనంద్ మహీంద్రా రీప్లే ఇస్తూ.. మీరు అద్భుతమైన బ్రాండ్ అంబాసిడర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ ఫొటోలకు ఫోజులివ్వడం చూస్తుంటే టాలీవుడ్ ప్రపంచం మిమ్మల్ని ఎత్తుకుపోతుందేమోనన్నదే నా భయం' అంటూ చమత్కరించారు.
మహీంద్రా అండ్ మహీంద్రా ఫార్మ్ ఎక్విప్మెంట్ సెక్టార్ ప్రెసిడెంట్ 'హేమంత్ సిక్కా' మాట్లాడుతూ.. మా జహీరాబాద్ కేంద్రం నుంచి 300,001 వ ట్రాక్టర్ను విడుదల చేయడం కంపెనీ సాధించిన గొప్ప విజయం. అంతే కాకూండా ట్రాక్టర్ తయారీలో కంపెనీ చేరుకున్న కొత్త మైలురాయి, అన్నారు. కంపెనీ యొక్క ఉత్పత్తులు భారతదేశం మొత్తానికి అందించడమే కాకుండా.. అమెరికా, జపాన్ మరియు యూరప్ వంటి 60 దేశాలకు ఎగుమతి చేయడం కూడా జరుగుతోందన్నారు.
తెలంగాణలోని జహీరాబాద్ తయారీ కర్మాగారం 2012 లో స్థాపించబడింది. కంపెనీ జహీరాబాద్లోని దాని ఫెసిలిటీలో దాదాపు ₹1,087 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఈ తయారీ కర్మాగారం ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే అతిపెద్ద ట్రాక్టర్ తయారీ కర్మాగారంగా నిలిచింది. ఈ తయారీ కర్మాగారంలో 1,500 కంటే ఎక్కువమంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇది సంవత్సరానికి 1,00,000 యూనిట్ల ట్రాక్టర్లను తయారుచేసే సమాటేనని కలిగి ఉంది.
2013 లో జహీరాబాద్ కేంద్రం నుంచి మొదటి ట్రాక్టర్ను విడుదల చేసిన మహీంద్రా 2017 నాటికి ఎగుమతులతో కలిపి ఏకంగా 1,00,000 యూనిట్ ఉత్పత్తి మార్కును చేరుకుంది. 2019 నాటికి కంపెనీ ఉత్పత్తిలో 2,00,000 యూనిట్లను చేరుకుంది. అయితే ఇప్పటికి 3,00,000 యూనిట్ల ఉత్పత్తిని నిరాఘాటంగా పూర్తి చేసింది.
డ్రైవ్స్పార్క్ అభిప్రాయం:
తెలంగాణాలోని జహీరాబాద్ కేంద్రం నుంచి 3,00,001 వ మహీంద్రా ట్రాక్టర్ విడుదలకావడం చాలా సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే తెలుగు రాష్ట్రమైన తెలంగాణ ఈ ఘనతను పొందింది. రానున్న రోజుల్లో కంపెనీ మరింత ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేసి ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయాలనీ ఆశిస్తున్నాము.